Tag Archives: goodbye to movies

Samantha: సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న సమంత… కారణం అదేనా?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సమంత ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. నాగచైతన్యత విడాకులు తీసుకున్న తర్వాత ఈమె పూర్తిగా తన దృష్టిని కెరియర్ పై పెట్టారు. ఇలా వరుస సినిమాలకు కమిట్ అయిన తర్వాత సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డారు.

ఈ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి ఈమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో నటిస్తున్నారు. అలాగే సిటాడల్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు ఈ రెండు కూడా దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చాయి అయితే ఈ రెండు షూటింగ్ పూర్తి అయిన తర్వాత సమంత సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారన్న వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

సమంత ఇలా కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని భావించారట. అయితే ఈమె ఎందుకు సినిమాలకు దూరం అవ్వాలనుకుంటున్నారు అనే విషయానికి వస్తే గతంలో మయోసైటిస్ బారిన పడిన సమంతకు ఈ వ్యాధి మళ్లీ తిరగబడిందని అందుకే ఈమె కమిట్ అయిన సినిమాలకు తీసుకున్న అడ్వాన్స్ కూడా వెనక్కి ఇస్తుందని సమాచారం.

Samantha: మరోసారి అనారోగ్యానికి గురయ్యారా…


ఇలా మయోసైటిస్ తిరగబడటంతో కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండి పూర్తిగా ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవాలని భావించారట అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. దీన్నిబట్టి చూస్తుంటే సమంత ఆరోగ్యం గురించి మరోసారి తాను అప్డేట్ ఇవ్వబోతుందని తెలుస్తుంది. ఇలా సమంత తన ఆరోగ్యానికి సంబంధించి అన్ని విషయాలు ముందుగానే చెప్పడంతో తన గురించి ఎలాంటి పుకార్లు రాకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది.

Nagarjuna: సినిమాలకు నాగార్జున గుడ్ బై చెప్పారా.. ఇక వాటికే పరిమితమవుతారా?

Nagarjuna: అక్కినేని నాగార్జున గత ఏడాది ఘోస్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత ఈయన ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు.ఈ విధంగా నాగార్జున ఎలాంటి సినిమాలను ప్రకటించకపోవడంతో చాలామంది నాగార్జున సినిమాలకు దూరమవుతున్నారా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయన సినిమాలకు దూరమవుతున్నారని తెలుస్తుంది.

ఈ విధంగా నాగర్జున ఎలాంటి సినిమాలను ప్రకటించకపోవడంతో ఈయన సినిమాలకు దూరం అవుతూ డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టబోతున్నారని సమాచారం.ఇప్పటికే ఎంతోమంది హీరోలు డిజిటల్ ఎంట్రీ ఇచ్చి పెద్ద ఎత్తున వెబ్ సిరీస్లలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నాగార్జున సైతం నెట్ ఫ్లిక్స్ కోసం ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ వారు నాగార్జునను సంప్రదించి ఆయనతో చర్చలు జరపగా అందుకు నాగార్జున కూడా ఒప్పుకున్నారని సమాచారం. అయితే ఈ సిరీస్ 10 భాగాలుగా రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సిరీస్ లో నాగార్జున రైటర్స్ కూడా భాగస్వాములుగా మారారట.ఈ సిరీస్ ఖచ్చితంగా నాగార్జునకు సరిపోతుందన్న ఉద్దేశంతోనే ఈయన డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

Nagarjuna: వెబ్ సిరీస్ కోసం సినిమాలు మానేయడం అవసరమా…


ఇలా సినిమాలు చేయకుండా డిజిటల్ మీడియాలోకి నాగార్జున ఎంట్రీ ఇవ్వడంతో ఆయన అభిమానులు కొంత పాటి అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే ఎంతో మంది హీరోలు సినిమాలలో నటిస్తూనే డిజిటల్ మీడియా వైపు అడుగులు వేస్తున్నారు. నాగార్జున కూడా అలాగే చేయొచ్చు కదా వీటికోసం సినిమాలు మానేయడం దేనికి అంటూ కామెంట్ చేస్తున్నారు.

Saipallavi: సినిమాలకు గుడ్ బై చెప్పనున్న సాయి పల్లవి… అదే కారణమా?

Saipallavi: టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి పరిచయం అవసరం లేదు.ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ నటి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తన నటనతో డాన్స్ తో ఫిదా చేసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

ఇలా తనకు అనుగుణంగా తనకు నచ్చిన పాత్రలను ఎంపిక చేసుకొని వరుస హిట్ సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి గత కొంతకాలంగా ఎలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఇలా సాయి పల్లవి సినిమాలకు దూరంగా ఉండడానికి గల కారణాలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. ఈమె పెళ్లి చేసుకోబోతుందని అందుకే సినిమాలకు దూరంగా ఉంటుంది అంటూ వార్తలు వచ్చాయి

ఇకపోతే తాజాగా సాయి పల్లవి సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పనున్నారని అయితే అందుకు గల కారణం కేవలం ఆమె వైద్యవృత్తిలో స్థిరపడటమే కారణమని తెలుస్తుంది. ఈమె ఇండస్ట్రీలోకి రాకముందే వైద్య విద్యను అభ్యసించిన సంగతి మనకు తెలిసిందే.గతంలో కూడా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తాను సినిమాలలో కొనసాగకపోతే వైద్య వృత్తిలో స్థిరపడతానని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

Saipallavi: హాస్పిటల్ నిర్మాణంలో బిజీగా ఉన్న సాయి పల్లవి..

ఈ క్రమంలోనే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నటువంటి సాయి పల్లవి తన చెల్లెలితో కలిసి కోయంబత్తూర్ లో హాస్పిటల్ నిర్మాణం కోసం పలు కార్యాలయాలు చుట్టూ తిరుగుతూ అనుమతి తీసుకోవడానికి ప్రయత్నిస్తుందని,ప్రస్తుతం ఈమె హాస్పిటల్ నిర్మాణ పనులలో బిజీగా ఉండటం వల్లే సినిమాలకు దూరంగా ఉన్నారని భవిష్యత్తులో తాను పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పి వైద్య వృత్తిలో కొనసాగుతుందని తెలుస్తోంది. సాయి పల్లవి సినిమాలకు దూరమవుతుందని తెలియడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.