Nagarjuna: అక్కినేని నాగార్జున గత ఏడాది ఘోస్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత ఈయన ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు.ఈ విధంగా నాగార్జున ఎలాంటి సినిమాలను ప్రకటించకపోవడంతో చాలామంది నాగార్జున సినిమాలకు దూరమవుతున్నారా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయన సినిమాలకు దూరమవుతున్నారని తెలుస్తుంది.
ఈ విధంగా నాగర్జున ఎలాంటి సినిమాలను ప్రకటించకపోవడంతో ఈయన సినిమాలకు దూరం అవుతూ డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టబోతున్నారని సమాచారం.ఇప్పటికే ఎంతోమంది హీరోలు డిజిటల్ ఎంట్రీ ఇచ్చి పెద్ద ఎత్తున వెబ్ సిరీస్లలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నాగార్జున సైతం నెట్ ఫ్లిక్స్ కోసం ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ వారు నాగార్జునను సంప్రదించి ఆయనతో చర్చలు జరపగా అందుకు నాగార్జున కూడా ఒప్పుకున్నారని సమాచారం. అయితే ఈ సిరీస్ 10 భాగాలుగా రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సిరీస్ లో నాగార్జున రైటర్స్ కూడా భాగస్వాములుగా మారారట.ఈ సిరీస్ ఖచ్చితంగా నాగార్జునకు సరిపోతుందన్న ఉద్దేశంతోనే ఈయన డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
ఇలా సినిమాలు చేయకుండా డిజిటల్ మీడియాలోకి నాగార్జున ఎంట్రీ ఇవ్వడంతో ఆయన అభిమానులు కొంత పాటి అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే ఎంతో మంది హీరోలు సినిమాలలో నటిస్తూనే డిజిటల్ మీడియా వైపు అడుగులు వేస్తున్నారు. నాగార్జున కూడా అలాగే చేయొచ్చు కదా వీటికోసం సినిమాలు మానేయడం దేనికి అంటూ కామెంట్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…