Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సమంత ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. నాగచైతన్యత విడాకులు తీసుకున్న తర్వాత ఈమె పూర్తిగా తన దృష్టిని కెరియర్ పై పెట్టారు. ఇలా వరుస సినిమాలకు కమిట్ అయిన తర్వాత సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డారు.
ఈ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి ఈమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో నటిస్తున్నారు. అలాగే సిటాడల్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు ఈ రెండు కూడా దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చాయి అయితే ఈ రెండు షూటింగ్ పూర్తి అయిన తర్వాత సమంత సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారన్న వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.
సమంత ఇలా కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని భావించారట. అయితే ఈమె ఎందుకు సినిమాలకు దూరం అవ్వాలనుకుంటున్నారు అనే విషయానికి వస్తే గతంలో మయోసైటిస్ బారిన పడిన సమంతకు ఈ వ్యాధి మళ్లీ తిరగబడిందని అందుకే ఈమె కమిట్ అయిన సినిమాలకు తీసుకున్న అడ్వాన్స్ కూడా వెనక్కి ఇస్తుందని సమాచారం.
ఇలా మయోసైటిస్ తిరగబడటంతో కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండి పూర్తిగా ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవాలని భావించారట అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. దీన్నిబట్టి చూస్తుంటే సమంత ఆరోగ్యం గురించి మరోసారి తాను అప్డేట్ ఇవ్వబోతుందని తెలుస్తుంది. ఇలా సమంత తన ఆరోగ్యానికి సంబంధించి అన్ని విషయాలు ముందుగానే చెప్పడంతో తన గురించి ఎలాంటి పుకార్లు రాకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…