Tag Archives: got married

PS Mithran: జర్నలిస్టుతో కలిసి పెళ్లి పీటలు ఎక్కిన డైరెక్టర్ పిఎస్ మిత్రన్… హాజరైన నటుడు కార్తీ!

PS Mithran: ఈ మధ్యకాలంలో వరుసగా సినిమా సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే తమిళ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ పి ఎస్ మిత్రన్ సైతం కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.ఈయన గత ఏడాది జూన్ నెలలో ప్రముఖ జర్నలిస్ట్ ఆశమీరా అయ్యప్పన్ అనే జర్నలిస్టుతో నిశ్చితార్థం జరుపుకున్నారు.

ఇకపోతే తాజాగా తంజావూరు వివాహ వేదికగా ఈయన వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇలా వీరి వివాహ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. ఈ క్రమంలోనే హీరో కార్తీ సైతం వీరి పెళ్లికి హాజరయ్యాడు. ఈ క్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

విశాల్ హీరోగా తెరకెక్కిన అభిమన్యు సినిమా ద్వారా దర్శకుడుగా పరిచయమయ్యారు పి ఎస్ మిత్రన్. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకుంది ఈ సినిమా తర్వాత నటుడు కార్తీ హీరోగా హీరో అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అనంతరం గత ఏడాది కార్తీ ద్విపాత్రాభినయంలో నటించిన సర్దార్ సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.


PS Mithran: జర్నలిస్టుతో ఏడడుగులు నచ్చిన డైరెక్టర్…

ఇలా వరుస హిట్ సినిమాలతో కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ల జాబితాలో పేరు సంపాదించుకున్నటువంటి ఈయన వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త అధ్యయనానికి నాంది పలికారు. ఈ క్రమంలోనే ఈయన పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈయన ఫోటోలు చూసినటువంటి పలువురు నెటిజన్స్ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Ram Charan: రామ్ చరణ్ తో నటిస్తూ పెళ్లి పీటలు ఎక్కిన హీరోయిన్స్… రామ్ చరణ్ తో నటిస్తే పెళ్లి అయిపోతుందా?

Ram Charan: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోయిన్లందరూ కూడా వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇలా వారు ప్రేమించిన వారితో ఏడడుగులు నడిచి కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీలు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఇద్దరూ కూడా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే వీరు పెళ్లి ఫోటోలు వైరల్ కావడంతో కొందరు నెటిజెన్లు గతంలో జరిగిన కొన్ని విషయాలకు లింక్ పెట్టి రామ్ చరణ్ గురించి పలు విషయాలు తెలియజేస్తున్నారు.ఇలా గతంలో రామ్ చరణ్ తో నటిస్తూ పెళ్లి పీటలు ఎక్కిన హీరోయిన్లు ఎవరు అనే విషయానికి వస్తే గత ఏడాది పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం RRR ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా నటి అలియా భట్ నటించారు.

ఈ సినిమా విడుదలైన కొన్ని వారాలకే అలియా భట్ నటుడు రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకున్నారు. ఇక రంగస్థలం సినిమా చర్చల సమయంలోనే నాగచైతన్య సమంత నిశ్చితార్థం జరిగింది. అనంతరం ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి వివాహం కూడా జరిగింది. ఇకపోతే ఈయన ఆచార్య సినిమా షూటింగ్ జరుగుతుండగా నటి కాజల్ అగర్వాల్ కూడా వివాహం చేసుకున్నారు.


Ram Charan: రామ్ చరణ్ తో నటిస్తూ పెళ్లి చేసుకున్న హీరోయిన్స్..

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ నటి కియారా అద్వానీతో కలిసి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నటి కియారా అద్వాని పెళ్లి కావడంతో చాలామంది రామ్ చరణ్ తో సినిమాలలో నటిస్తే హీరోయిన్లకు తప్పనిసరిగా పెళ్లవుతుంది అంటూ కామెంట్ లు చేస్తున్నారు.

Dil Raju: దిల్ రాజు తేజస్వినినీ ప్రేమించి పెళ్లి చేసుకున్నరా…. వీళ్ళ లవ్ స్టోరీ మామూలుగా లేదుగా?

Dil Raju: తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్నారు.ఇలా దిల్ రాజు ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చిన కేవలం సినిమాల గురించి మాత్రమే మాట్లాడేవారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ సినిమాల గురించి కాకుండా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. దిల్ రాజు గత రెండు సంవత్సరాల క్రితం తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించారు. అయితే ఈయన తేజస్విని ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటూ తాజాగా తమ లవ్ స్టోరీని బయటపెట్టారు.

దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో మరణించిన తర్వాత మూడు సంవత్సరాల పాటు ఈయన ఒంటరిగా ఎన్నో కష్టాలను అనుభవించానని, ఆ సమయంలోనే తనకు తోడు అవసరమనిపించే రెండో పెళ్లికి సిద్ధమయ్యానని తెలిపారు. అయితే నా బిజీ షెడ్యూల్ కారణంగా తనని అర్థం చేసుకునే వారు అయితే బాగుంటుందని ఆలోచించాననీ తెలిపారు.

Dil Raju: ఏడాది పాటు తేజస్వినినీ గమనించాను….

ఇక తేజస్విని ఎయిర్ హోస్టర్స్ గా పని చేస్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న ప్రతిసారి తేజస్విని గమనిస్తూ ఉండేవారట. ఇలా ఏడాది పాటు తనని గమనించిన తర్వాత తన ఫోన్ నెంబర్ తీసుకొని అనంతరం తనకు ప్రపోజ్ చేశానని నా ప్రపోజల్ ఒప్పుకున్న తర్వాతే ఈ విషయం ఇంట్లో వారికి చెప్పి ఇద్దరం పెళ్లి చేసుకున్నామని ఈ సందర్భంగా దిల్ రాజు తన లవ్ స్టోరీ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Actress Jayasudha: మూడో పెళ్లి చేసుకున్న జయసుధ…. ఆ వ్యక్తి గురించి క్లారిటీ ఇచ్చేసిందిగా?

Actress Jayasudha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జయసుధ అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.ఈమె సీనియర్ హీరోలైన ఎన్టీఆర్ ఏఎన్నార్ నుంచి చిరంజీవి బాలకృష్ణ వంటి హీరోల సరసన కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటికీ ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే గత కొద్దిరోజులుగా జయసుధ మూడో పెళ్లి చేసుకుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఈమె ఏ కార్యక్రమానికి వెళ్లిన ఈమె పక్కనే ఒక వ్యక్తి కనిపించడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది.ఇలా జయసుధ రహస్యంగా మూడో వివాహం చేసుకున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఇక తాజాగా ఈమె హీరో విజయ్ నటించిన వారసుడు సినిమాలో కూడా నటించారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కూడా ఆ వ్యక్తి జయసుధ పక్కనే ఉండడం గమనార్హం. ఇలా ఏ కార్యక్రమానికి వెళ్లిన తను జయసుధ వెంట ఉండడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.అయితే తాజాగా జయసుధ తన మూడో పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందించి ఆ వ్యక్తి ఎవరు తనకు ఆ వ్యక్తికి సంబంధం ఏంటి అనే విషయాలను తెలియచేశారు.

Actress Jayasudha: నా బయోపిక్ చిత్రం కోసం నన్ను ఫాలో అవుతున్నారు…

ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ ప్రతి కార్యక్రమంలోనూ తన పక్కనే ఉన్నటువంటి ఆ వ్యక్తి పేరు పెలిపే.తాను అమెరికాలో వ్యాపారవేత్తగా స్థిరపడ్డారని అయితే ఆయన తనకు మంచి స్నేహితుడిని జయసుధ తెలిపారు.ఆయన తన బయోపిక్ చిత్రం చేయాలని భావిస్తున్నారు అందుకే తన గురించి ఇంటర్నెట్ మొత్తం సెర్చ్ చేశారు. అదేవిధంగా ఇండియాలో తనకు ఎలాంటి పాపులారిటీ ఉందని తెలుసుకోవడం కోసమే ప్రతి ఒక్క కార్యక్రమానికి తనతో పాటు హాజరవుతున్నారని అంతకుమించి మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదంటూ ఈమె మూడో పెళ్లి గురించి వచ్చినటువంటి వార్తలను కొట్టి పారేశారు.

Celebrity Marriages: 2022లో బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు వీళ్లే?

Celebrity Marriages: ఈ ఏడాది ఎంతో మంది సెలెబ్రెటీలు వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇలా 2022వ సంవత్సరంలో చిత్ర పరిశ్రమకు చెందిన చాలామంది కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.మరి ఈ ఏడాది బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బాయ్ చెప్పి వైవాహిత జీవితంలోకి అడుగుపెట్టిన సెలబ్రిటీలు ఎవరు ఓ లుక్ వేసేద్దాం…

రణబీర్ -అలియా భట్: బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్న రణబీర్ కపూర్ అలియాభట్ ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీ పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక ఈ దంపతులకు కుమార్తె కూడా జన్మించారు.

నయనతార -విగ్నేష్: కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ నయనతార గత ఏడు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉండి ఈ ఏడాది జూన్ 9వ తేదీ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు. ఇక ఈ దంపతులు సరోగసి ద్వారా ఇద్దరు కవల మగ పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు.

మౌని రాయ్ -సూరజ్ నంబియా: బాలీవుడ్ నటి మౌని రాయ్ ఈ ఏడాది జనవరి 27వ గోవాలో ప్రముఖ వ్యాపారవేత్త సూరజ్ నంబియా అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు..

Celebrity Marriages:

హన్సిక – సోహైల్ కతురియా: నటి హన్సిక ప్రముఖ వ్యాపారవేత్త సోహైల్ కతురియా అనే వ్యక్తితో డిసెంబర్ నెల నాలుగవ తేదీ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.

పూర్ణ – అసిఫ్ అలీ ఖాన్: నటి పూర్ణ తన ప్రియుడు ఆసిఫ్ అలీ ఖాన్ తో అక్టోబర్ 25వ తేదీ కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.

అదితి ప్రభుదేవా – యషాస్‌ని: అదితి ప్రభుదేవా యషాస్‌ని నవంబర్ 25వ తేదీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

నాగశౌర్య -అనూష శెట్టి: నటుడు నాగశౌర్య బెంగుళూరు కి చెందిన డిజైనర్ అనూష శెట్టి అనే అమ్మాయిని నవంబర్ 20వ తేదీ బెంగళూరులో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.