Dil Raju: తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్నారు.ఇలా దిల్ రాజు ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చిన కేవలం సినిమాల గురించి మాత్రమే మాట్లాడేవారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ సినిమాల గురించి కాకుండా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. దిల్ రాజు గత రెండు సంవత్సరాల క్రితం తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించారు. అయితే ఈయన తేజస్విని ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటూ తాజాగా తమ లవ్ స్టోరీని బయటపెట్టారు.
దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో మరణించిన తర్వాత మూడు సంవత్సరాల పాటు ఈయన ఒంటరిగా ఎన్నో కష్టాలను అనుభవించానని, ఆ సమయంలోనే తనకు తోడు అవసరమనిపించే రెండో పెళ్లికి సిద్ధమయ్యానని తెలిపారు. అయితే నా బిజీ షెడ్యూల్ కారణంగా తనని అర్థం చేసుకునే వారు అయితే బాగుంటుందని ఆలోచించాననీ తెలిపారు.
ఇక తేజస్విని ఎయిర్ హోస్టర్స్ గా పని చేస్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న ప్రతిసారి తేజస్విని గమనిస్తూ ఉండేవారట. ఇలా ఏడాది పాటు తనని గమనించిన తర్వాత తన ఫోన్ నెంబర్ తీసుకొని అనంతరం తనకు ప్రపోజ్ చేశానని నా ప్రపోజల్ ఒప్పుకున్న తర్వాతే ఈ విషయం ఇంట్లో వారికి చెప్పి ఇద్దరం పెళ్లి చేసుకున్నామని ఈ సందర్భంగా దిల్ రాజు తన లవ్ స్టోరీ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…