Rakhi Sawant: బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న నటి,సింగర్ రాకీ సావంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తరచూ తన వింత చేష్టలతో వార్తలలో నిలిచే ఈమె పెద్ద ఎత్తున నెటిజన్ల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. గత ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ వాలంటైన్స్ డే సందర్భంగా తన భర్తకు విడాకులు ఇవ్వబోతున్నానని ప్రకటించారు.
ఇలా తన భర్తకు విడాకులు ఇచ్చి ఏడాది కూడా తిరగకముందే ఈమె మరో పెళ్లి చేసుకున్నారు. ఈమె తన ప్రియుడు ఆదిల్ ఖాన్ ను వివాహం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే వీరు పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇలా తరచూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో సరదాగా ముచ్చటించే ఈమె తాజాగా అభిమాని పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈమె రెండోసారి తన ప్రియుడిని పెళ్లి చేసుకున్న అనంతరం ముంబై రోడ్లపై కనిపించడంతో ఓ అభిమాని అతి ఉత్సాహం చూపిస్తూ తనతో సెల్ఫీ దిగడానికి ఆమె దగ్గరకు వెళ్లారు. ఇలా తనతో సెల్ఫీ అడిగితే వెంటనే రాఖీసావంత్ దూరం జరుగు బ్రదర్ నాకు పెళ్లయింది అంటూ ఆ అభిమాని పట్ల కాస్త అసహనం వ్యక్తం చేశారు.
నన్ను ముట్టుకోవద్దు కాస్త దూరం జరుగు అప్పుడంటే ఓకే కానీ ఇప్పుడు నాకు పెళ్లి అయింది అంటూ ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పెళ్లికాకముందు సెల్ఫీలు అంటే ఓకే కానీ పెళ్లి అయిన తర్వాత ఇలా సెల్ఫీలు తీసుకోవడం నాకు నచ్చలేదు అంటూ ఈమె అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్ లు ఈ వీడియో పై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…