Tag Archives: jayaprakash reddy

Jayaprakash Reddy : సమరసింహారెడ్డి షూటింగ్ లొ‌కేషన్ లో ఒకే ఒక్క కుర్చీ.. బాలయ్య సంస్కారానికి అది ఒక నిదర్శనం. : జయప్రకాశ్ రెడ్డి

Jayaprakash Reddy : ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఏసీ కళాశాలలో ఉన్నప్పుడు ఓ సీనియర్‌ స్టేజీ రాచరికం అనే నాటకంలో అడవేషం వేసే అవకాశం ఇచ్చాడు. అది రాజూ, రాణీ, సేవకీ, సేవకుడు ఉండే నాటకం. పాటలూ, ఆటలూ అన్నీ నేర్చుకొని సేవకి పాత్ర చేశాడు. నాటకం అయ్యాక అబ్బాయిలు ఎత్తుకుని ముద్దులు పెట్టేసుకున్నారు. మూడు నాలుగు రోజుల తర్వాత నోటీసు బోర్డు చూస్తే, యూనివర్సిటీ ప్రకటించిన బహుమతుల్లో ఉత్తమ నటుడు జయప్రకాశ్‌‌రెడ్డి అని రాసి ఉంది. అప్పటి నుంచి నాటకాలు వేయడం, వేయించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఉద్యోగంలో చేరాక కూడా నాటకాలను వదులుకోలేదు.

ఒకసారి జయప్రకాష్ రెడ్డి నల్గొండలో డాక్టర్ రాజారావు మెమోరియల్ ఆర్ట్స్ అసోషియేషన్ తరపున అనేక నాటికలలో నటించి, దర్శకత్వం వహించాడు. నల్లగొండ జిల్లా పరిషత్ ఆవరణలో ప్రజా పోరు పత్రిక మొదటి వార్షికోత్సవం సందర్భంగా మాడభూషి దివాకర్ బాబు రాసిన గప్ చుప్ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా దాసరి నారాయణరావుకు అతని నటన నచ్చి నిర్మాత రామానాయుడుకు పరిచయం చేశాడు. అప్పుడు హైదరాబాదులో రామానాయుడు, అతని కుటుంబసభ్యుల ముందు ఆ నాటకాన్ని ప్రదర్శించాడు. అలా ఈయన 1988లో విడుదలైన “బ్రహ్మపుత్రుడు” చిత్రంతో తెలుగు సినీరంగానికి పరిచయమయ్యాడు. అప్పటినుండి 1992 వరకు 25 సినిమాల్లో నటించాడు. కానీ ఆర్థికంగా ఒడిదుడుకులు రావడంతో మళ్లీ గుంటూరుకు వెళ్లి మున్సిపల్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేశాడు. ఉదయం ఆరింటి నుంచి ట్యూషన్లు చెప్పడం, బడికి వెళ్లడం, మళ్లీ రాత్రి తొమ్మిదింటి వరకూ ట్యూషన్లు ఇలా జీవితం సాగింది.

అనుకోకుండా ఓసారి హైదరాబాదు వచ్చినప్పుడు రామానాయుడు కలిసి 1997లో “ప్రేమించుకుందాం రా” అనే సినిమా ద్వారా మరో అవకాశం కల్పించగా, ఆ చిత్రం ప్రతినాయకునిగా ఇతనికి మంచి పేరు తీసుకునివచ్చింది. తరువాత 1999లో బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి విజయవంతమైన సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రతోనే ప్రేక్షకులను మెప్పించాడు. ఆమధ్య ఓ ప్రముఖ ఛానల్ కి జయప్రకాశ్ రెడ్డి ఇంటర్వ్యూ ఇస్తూ… సమరసింహారెడ్డి చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో లొకేషన్ లో ఒకే ఒక కుర్చీ అందులో బాలయ్య కూర్చున్నాడు.

నేను సినిమాలోని నా సీన్ పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాను. బాలయ్య కంటే నేను వయస్సులో కొద్ది సంవత్సరాలు సీనియర్ అయినప్పటికీ రండి గురువుగారు కూర్చుండని వినయంగా బాలయ్య పిలిచారు. అలా ఆయన నా పట్ల గౌరవాన్ని చూపడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. అలాగే సమరసింహారెడ్డి సినిమా విజయవంతమైన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నంది అవార్డు ఆయనకు (బాలయ్య) రాకపోయినా ఫర్వాలేదు. కానీ నాకు రావాలంటూ చెప్పడం మరింత ఆనందాన్నిచ్చిందని జయప్రకాశ్ రెడ్డి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

దాసరి నారాయణ వల్ల అతడు రూ.100 కోట్లు నష్టపోయారు..! ఎందుకు.. ఎవరు..?

దాసరి నారాయణ రావు.. ఈ పేరు చెబితే ఇండస్ట్రీలో అదో గౌరవం. పెద్దాయనగా.. తలలో నాలుకగా.. చిన్న సినిమాలకు పెద్ద దిక్కుగా, దర్శకులకు బాసటగా.. నటులకు నారాయణ మంత్రంగా నిలిచిన మహోన్నత వ్యక్తి. అంతే కాదు మేస్త్రీగా రాజకీయాల్లోకెళ్లి ఇస్త్రీ చేసిన దర్శక నట దిగ్గజం దాసరి నారాయణ రావు. దాసరి అనేది పేరు కాదు…ఒక బ్రాండ్ గా తెలుగు సినీ చరిత్రలో ఆయనకంటూ పేజీలు ఏర్పాటు చేసుకున్న అతికొద్ది మంది దర్శకుల్లో ఆయన ఒకరు.

అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన వ్యక్తి గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించారు. ఎంతో మంది సినీ హీరోలను, హీరోయిన్లను, ఆర్టిస్టులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసి.. మంచి బంగారు భవిష్యత్తును ఇచ్చిన మహోన్నత వ్యక్తి. ఒక డైరెక్టర్ గా, నిర్మాతగా, యాక్టర్ గా , గాయకుడిగా ఎన్నో సనిమాలను తీశారు.. నటించారు. అబ్బో ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలా అతడు సినిమాలకు పరిచయం చేసిన వారిలో ఓ వ్యక్తి రూ.100 కోట్లు దాసరి వల్ల నష్టపోయాడట.. ఎవరా వ్యక్తి.. ఇది నిజమేనా.. ఆ విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

1995 సంవత్సరంలో ‘ఒరేయ్ రిక్షా’ సినిమా దాసరి దర్వకత్వంలో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో దాసరి నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని.. యాక్టింగ్ లో కూడా ఎంతో ప్రతిభ ఉన్న వారిగా అందరికీ తెలిసింది. అయితే జయప్రకాశ్ రెడ్డి.. దాసరికి మంచి స్నేహితుడు. ఆయన ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాలను చెప్పారు. అప్పట్లో జేపీ రెడ్డి సినిమాలోకి రాకముందు దాసరి నారాయణ బలవంతగా వచ్చేట్టు చేశారట.

అప్పుడు అతడు ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అప్పుడు అతడికి ఓ ప్రాజెక్టు వచ్చింది. దానిని చేస్తున్న సమయంలో దాసరి బలవంతం చేయడంతో ఇండస్ట్రీకి వచ్చారు. దీంతో ఆ ప్రాజెక్టు వదిలి పెట్టి రావాల్సి వచ్చిందని.. ఆ ప్రాజెక్టు విజయవంతగా పూర్తి చేసిన వారికి రూ.100 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని అతడు చెప్పుకొచ్చాడు. ఇలా దాసరి వల్ల తాను వంద కోట్ల రూపాయాలు నష్టపోయానని నవ్వుకుంటూ చెప్పారు జయప్రకాశ్ రెడ్డి.