Tag Archives: karthikeya

Mahesh Babu: మరోసారి మంచి మనసు చాటుకున్న మహేష్.. రెండేళ్ల చిన్నారికి పునర్జన్మ?

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహేష్ బాబు కేవలం తెరపై మాత్రమే కాకుండా హీరో అని అందరికీ తెలిసిందే. ఈయన సినిమా ఇండస్ట్రీలో సంపాదిస్తూ మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు పునర్జన్మల ప్రసాదిస్తున్నారు.

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారులందరికీ కూడా ఈయన ఉచితంగా తన ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్లు చేయిస్తూ చిన్నారులకు పునర్జన్మ ప్రసాదిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఇప్పటికే కొన్ని వందల మందికి సర్జరీలు చేయించడం మహేష్ బాబు తాజాగా మరో రెండేళ్ల చిన్నారికి ఊపిరి పోసారు.

ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన రెండేళ్ల కార్తికేయ గుండె జబ్బుతో బాధపడుతున్నాడు.అయితే తనకు హార్ట్ లో రంద్రం ఉందని సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. దీంతో ఏం చేయాలో దిక్కు తెలియక మహేష్ బాబు ఫౌండేషన్ ను ఆశ్రయించారు. వెంటనే బాలుడిని తీసుకుని వెళ్లి ఫౌండేషన్ నిర్వాహకులను సంప్రదించారు. ఆంధ్ర హాస్పిటల్స్ లో బాలుడికి హార్ట్ ఆపరేషన్ చేసి బాబు ప్రాణాలను నిలబెట్టారు..

Mahesh Babu: మంచి మనసు చాటుకున్న మహేష్…

ఇక వైద్యుల పర్యవేక్షణ అనంతరం తనకు ఎలాంటి ప్రమాదం లేదని తెలియడంతో బాబుని డిశ్చార్జ్ చేశారు. అయితే తమ కుమారుడి ప్రాణాలను నిలబెట్టినందుకు మహేష్ బాబు ఫౌండేషన్ కి చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఇక ఇదే విషయాన్ని మహేష్ బాబు ఫౌండేషన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో మరోసారి మహేష్ మంచితనం పై అభిమానులు నేటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Rajamouli: రాజమౌళి నా తండ్రి కాకపోయినా నాకు ఆ భావన కలిగింది… కార్తీకేయ కామెంట్స్ వైరల్!

Rajamouli: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడిగా గుర్తింపు పొందిన దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు రాజమౌళి దర్శనం ఒక్క సినిమా కూడా ప్లాప్ అవ్వలేదు అంటే ఆయన దర్శకత్వ ప్రతిభ ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క సినిమాతో అంచలంచెలుగా ఎదుగుతూ తన ఫాలోయింగ్ పెంచుకున్న రాజమౌళి ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసి తెలుగు సినిమా కి ఆస్కార్ అవార్డు వచ్చేలా చేసిన ఘనత రాజమౌళికి దక్కుతుంది.

ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా కి ఆస్కార్ అవర్ ఆస్కార్ అవార్డు రావడానికి రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా కీలక పాత్ర పోషించాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలకు కుటుంబ సభ్యుల చొరవ ఎక్కువగా ఉంటుంది. రాజమౌళి తో పాటు ఆయన భార్య రమ, కొడుకు కార్తికేయ అలాగే కీరవాణి ఆయన సతీమణి వల్లి ఇలా అందరూ సినిమా కోసం కష్టపడతారు.

ఇక రాజమౌళి సినిమాల మార్కెటింగ్ వ్యవహారాలలో కార్తికేయ కీలక పాత్ర పోషిస్తాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తికేయ ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ క్రమంలో సినిమాకి ఆస్కార్ అవార్డు దకడం కోసం 80 కోట్లు ఖర్చు చేసినట్లు వస్తున్న వార్తలలో నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు.

Rajamouli: నాన్న అనే ఫీలింగ్ కలిగింది…

అలాగే ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి మాట్లాడుతూ … ” రాజమౌళి తన తల్లిని పెళ్లి చేసుకోవడానికి ఏడాది ముందునుంచి తమ ఇంటికి వచ్చేవారని కార్తికేయ పేర్కొన్నారు. నన్ను, అమ్మను రాజమౌళి చాలా బాగా చూసుకునేవాడు. రాజమౌళి గారిపై ఆ సమయంలో ఫాదర్ ఫీల్ రావడంతో పాటు ఆ వైబ్ వచ్చేసిందని కార్తికేయ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పటినుండి రాజమౌళిని వదలాలని అనిపించలేదని కార్తికేయ పేర్కొన్నారు. కార్తికేయ రాజమౌళి సొంత కొడుకు కాకపోయినా వారిద్దరూ తద్రికొడుకుల్లా ఉంటారు. చిన్ననాటి నుండి కార్తీకేయ జక్కన్నని బాబా అని పిలుస్తాడు.

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ ఆస్కార్ జర్నీ వెనుక ఆ ముగ్గురి ప్రమేయం ఉందా… అసలు విషయం చెప్పిన కొరియోగ్రాఫర్!

Prem Rakshith: నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు అందుకోవడంతో ప్రతి ఒక్కరు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు తన . అయితే ఈ పాటకు కొరియోగ్రఫీ అందించినటువంటి కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ సైతం తాను కొరియోగ్రఫీ అందించిన ఒక పాటకు అంతర్జాతీయ వేదికపై అవార్డు అందుకోవడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇలా ఈయన కూడా ఆస్కార్ అవార్డు వేడుకలలో పాల్గొన్నారు. అయితే అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన ప్రేమ్ రక్షిత్ తాజాగా ఆస్కార్ జర్నీ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ప్రేమ్ రక్షిత్ మాట్లాడుతూ తనకు ఆస్కార్ అవార్డు వేడుకకు వెళ్లడానికి అసలు వీసానే దొరకలేదని తెలిపారు. కానీ కార్తికేయ, వల్లి, రమా మేడమ్ ఈ ముగ్గురి ప్రోత్సాహం వల్లే తాను అమెరికా వీసా పొందానని ఆస్కార్ అవార్డుకు వెళ్లానని తెలిపారు.

కేవలం నాకు ఐదు రోజుల వరకు మాత్రమే వీసా లభించిందని ఆస్కార్ వేడుకకు ఒక రోజు ముందు అమెరికా వెళ్లాలని తెలిపారు. అక్కడ రిహార్సల్స్ చేసిన తర్వాత ఆ పాటకు ఆస్కార్ వేదికపై డాన్స్ వేయడంతో పాట పూర్తి కాగానే అందరూ లేసి ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు ఆ క్షణం కళ్ళల్లో నీళ్లు వచ్చాయని ప్రేమ్ రక్షిత్ తెలిపారు.

Prem Rakshith:ఆ క్షణం మాటలు రాలేదు…


ఇక వేదికపై కీరవాణి సర్ ఆస్కార్ అవార్డు అందుకోవడంతో ఒక్కసారిగా తనని ఆలింగనం చేసుకున్నారని ఆ క్షణం తనకు మాటలు రావడం లేదని ఈ సందర్భంగా ప్రేమ్ రక్షిత్ తన ఆస్కార్ జర్నీ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.ఇలా ఆస్కార్ అవార్డు గురించి ప్రేమ్ రక్షిత్ మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Akkineni Akhil: కార్తికేయను బ్రో అన్న అఖిల్… కార్తికేయ రిప్లై చూసి షాక్ అయినా అక్కినేని ఫ్యాన్స్?

Akkineni Akhil: ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా లోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని అఖిల్ సైతం ఈ విషయంపై స్పందిస్తూ దర్శక ధీరుడు రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా అఖిల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. అందరికంటే ముందుగా కార్తికేయ పేరును సంబోధిస్తూ అతిపెద్ద ఘనత సాధించినందుకు మై బ్రదర్ కార్తికేయకు బిగ్ షౌటౌట్ అంటూ తర్వాత మిగతా వారి పేర్లు పెట్టాడు.. ఇలా అఖిల్ చేసిన ట్వీట్ కి కార్తికేయ రిప్లై ఇచ్చారు. అయితే ఇది చూసిన అక్కినేని ఫ్యాన్స్ కొంత పాటి అసహనం వ్యక్తం చేశారు.

అఖిల్ బ్రో అంటూ సంబోధిస్తూ ట్వీట్ చేయగా కార్తికేయ మాత్రం థ్యాంక్యూ రా!.. లవ్ యూ అంటూ హార్ట్ సింబల్స్‌తో రీ ట్వీట్ చేశాడు కార్తికేయ..అయితే అభిమానులు మాత్రం కార్తికేయ చేసిన ట్వీట్ పై కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ మిమ్మల్ని బ్రో అని పిలిస్తే మీరు మాత్రం రా అని పిలుస్తున్నారు ఎంత ఫ్రెండ్షిప్ ఉంటే మాత్రం ఇలా పిలవడం ఏంటి సారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Akkineni Akhil: అఖిల్ కార్తికేయ కన్నా చిన్నవాడే…


ఇక ఈ విషయం గురించి సోషల్ మీడియాలో కొంత పాటి చర్చలు కూడా జరుగుతున్నాయి. అఖిల్ వయసులో కార్తికేయ కన్నా చిన్నవాడు అంతేకాకుండా ఇద్దరి మధ్య చాలా మంచి స్నేహబంధం ఉంది ఆ స్నేహబంధం కారణంగానే తనని రా అని పిలిచి ఉంటాడు.ఇందులో తప్పు పట్టాల్సిన అంశం ఏమాత్రం లేదంటూ మరికొందరు కార్తికేయ పోస్టుకు మద్దతు తెలుపుతున్నారు.

ఈ ఏడాది దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన సెలబ్రిటీలు వీళ్లే..!

కరోనా మహమ్మారి కారణంగా 2020 లో ఎన్నో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. కానీ 2021లో మాత్రం ఎంత కష్టమైనా పెళ్లిళ్లు మాత్రం బాగానే జరిగాయి. అయితే ఈ సంవత్సరంలో పెళ్లి పీటలు ఎక్కిన సెలబ్రిటీలు ఎవరో ఓ సారి లుక్కేద్దాం. అందులో మొదటగా చెప్పుకునే పేరు సింగర్ సునీత. ఆమెకు ఇది రెండో వివాహం. మ్యాంగో మీడియా గ్రూప్‌ అధినేత రామ్‌ వీరపనేనినితో 2021 జనవరి 9న వివాహం జరిగింది.

ఈమెకు 19 సంవత్సరాల వయసులో కిరణ్ తో వివాహమైనది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అబ్బాయి ఆకాష్, అమ్మాయి శ్రేయ. అయితే కొన్ని కారణాల వల్ల 2020లో ఆమె అతడితో విడాకులు తీసుకుంది. ఇక టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ వివాహం కూడా ఈ ఏడాది తన స్నేహితురాలు లోహితరెడ్డితో జరిగింది. ఈ వేడుకకు ఎంతో మంది సెలబ్రిటీలు హాజరయ్యారు.

2007 సంవత్సరంలో గోదావ చిత్రంలో నటించిన నటి శ్రద్ధా ఆర్య. దీంతో తెలుగులో పరిచయం అయింది. ఇదే సంవత్సరంలో ఆమె తమిళంలో కూడా కాల్వనిన్ కాదల్ ద్వారా పరిచయం అయ్యారు. నవంబర్ 16, 2021న, ఆర్య తన స్వస్థలమైన న్యూఢిల్లీలో భారతీయ నావికాదళ అధికారి రాహుల్ శర్మను వివాహం చేసుకున్నారు . బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్.. యూరీ ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ ను వివాహం చేసుకుంది.

బిజినెస్ మ్యాన్ నితిన్ రాజ్‌ను ప్రణీత వివాహమాడింది. బ్యాట్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాను హీరో విష్ణు విశాల్ వివాహం చేసుకున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దియా మీర్జా, వైభవ్ రేఖిని పెళ్లి చేసుకుంది. విక్కీ కౌషల్ ను కత్రినా కైఫ్ వివాహమాడింది. ఇలా ఎంతో కాలంగా కోవిడ్ కారణంగా వాయిదా వేసుకుంటూ వస్తున్న పెళ్లిళ్లు ఈ ఏడాది పూర్తయ్యాయి.

అంగరంగ వైభవంగా హీరో కార్తికేయ పెళ్లి.. ఫోటోలు వైరల్ !

ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ ఒక ఇంటివాడు అయ్యాడు. తాజాగా తన ప్రియురాలు లోహిత రెడ్డి ని పెళ్లి చేసుకొని వివాహ జీవితంలో కి అడుగు పెట్టారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ లో ఒక ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ వివాహ వేడుకకు పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు.

ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వివాహ వేడుకకు ఎవరెవరు హాజరయ్యారు? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ వివాహ కార్యక్రమానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి,అల్లు అరవింద్, తనికెళ్ల భరణి, అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై ఆ నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్ళికొడుకు గెటప్ లో హీరో కార్తికేయ మెరిసిపోతున్నాడు. పెళ్లి కూతురు రోహిత రెడ్డి రెడ్డి కూడా బంగారు రంగు దుస్తులలో వాటికి తగ్గట్టుగానే జ్యువెలరీ వేసుకుని మెరిసిపోయింది.

కార్తికేయ తను ప్రేమించిన అమ్మాయిని మూడుముళ్ల బంధంతో తన వశం చేసుకున్నారు. నేడు హైదరాబాదు లోని ఒక ఫంక్షన్ హాల్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.ఇది ఇలా ఉంటే ఇటీవలే కార్తికేయ తాను హీరోగా నటించిన రాజా విక్రమార్క సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన ప్రియురాలు, కాబోయే భార్య లోహిత రెడ్డిని తన అభిమానులకు పరిచయం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే.

పెళ్లి దుస్తులలో వధూవరులు మెరిసి పోతున్నారు.కార్తికేయ లవ్ స్టోరీ గురించి మనందరికీ తెలిసిందే. రాజా విక్రమార్క ఈవెంట్లో వారిద్దరూ వివాహ బంధంతో ఏకం అవుతున్నట్లు వెల్లడించిన సంగతి మనందరికీ తెలిసిందే. మొత్తానికి కార్తికేయ తాను ప్రేమించిన అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేసి ఒక ఇంటివారయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అంగరంగ వైభవంగా హీరో కార్తికేయ పెళ్లి.. ఫోటోలు వైరల్ !

అంగరంగ వైభవంగా హీరో కార్తికేయ పెళ్లి.. ఫోటోలు వైరల్ !

అంగరంగ వైభవంగా హీరో కార్తికేయ పెళ్లి.. ఫోటోలు వైరల్ !

అంగరంగ వైభవంగా హీరో కార్తికేయ పెళ్లి.. ఫోటోలు వైరల్ !

కార్తికేయ కాబోయే భార్య ‘ఆర్ఎక్స్ 100’ సినిమా చూడకపోవడానికి కారణం ఇదేనా..?

హీరో కార్తికేయ.. ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో మనోడికి ఆఫర్లు భారీగానే వచ్చాయి. కానీ ఈ సినిమా తర్వాత అతడు నటించిన సినిమాలు దానంత పెద్ద హిట్ కాలేదనే చెప్పాలి. అతడు కేవలం హీరోగానే కాకుండా.. వివిధ రకాలు జోనర్లను కూడా ట్రై చేస్తూ సినిమాల్లో నటిస్తున్నాడు.

హీరోగా చేసే సినిమాకు మాత్రం మంచి కథలను ఎంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం అతడు నటించిన చిత్రం రాజా విక్రమార్క. ఈ సినిమా నవంబర్ 12 న విడుదల కానుంది. ఈ సందర్భంగా అతడు ఆసక్తికరమైన విషయాలను పాత్రికేయులతో పంచుకున్నాడు. అవేంటంటే.. ఇప్పటి వరకు తాను వివిధ రకాల క్యారెక్టర్లు వేశాను .. కానీ మొదటి సారి ఇందులో టచ్ చేయని జోనర్ ఎంచుకున్నట్లు చెప్పాడు.

ఇందులో ఎన్ఐఏ ఎజెంట్ గా తన పాత్ర ఉంటుందన్నాడు. ఇటీవల ఫ్రీ రిలీజ్ వేడుకకు తనకు కాబోయే భార్య లోహితను వేదికపైనే ప్రపోజ్ చేశాడు కార్తికేయ. అయితే లోహిత ఇంత వరకు ఆర్ఎక్స్ 100 సినిమా చూడలేదని చెప్పాడు. దానికి కారణం సినిమా విడుదలకు ముందు తాము ఇద్దరం గొడవ పడ్డామని.. తర్వాత కలిసి చూద్దామంటే..తానే వద్దని చెప్పానన్నాడు.

ఒక వేళ ఆమె సినిమా చూస్తాను అంటే.. సెకండాఫ్ నుంచి చూడమని చెబుతానన్నాడు. అన్ని సంవత్సరాలు వాళ్లిద్దరు ప్రేమించుకున్నా.. వీళ్ల ప్రేమ విషయం ఇటీవలే వాళ్ల తల్లిదండ్రులకు తెలిసిందన్నారు. తానే ఇంట్లో చెప్పి.. పెళ్లికి ఒప్పించానని కార్తికేయ వెల్లడించారు.

స్టేజిపైనే కాబోయే భార్యకు ఎంత క్యూట్ గా ప్రపోజ్ చేసాడో చూడండి.. ఈ లవ్ స్టోరీ వెరీ ఇంట్రెస్టింగ్.!

ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాజా విక్రమార్క. ఈ సినిమాను శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి టి సమర్పణలో 88 రామారెడ్డి నిర్మించారు. ఈ సినిమాలో కార్తికేయ సరసన తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నవంబర్ 12న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు.

ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చిన దిల్ రాజు గారు, సుధీర్ బాబు గారు,శ్రీ విష్ణు అన్నయ్య , విశ్వక్ సేన్, కిరణ్ ప్రతి ఒక్కరికి థాంక్యూ అని తెలిపారు. రాజా విక్రమార్క సినిమా టైటిల్ చిరంజీవి గారిది. ఆయన ఖైదీ పెట్టుకునేది స్థాయి ఉందని అనుకోవడం లేదు అని తెలిపారు.చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమా ఏది చుసిన అందులో మనల్ని ఉహించుకుంటూ పెరిగాం అని తెలిపారు.

నా సినిమాలు అన్నింటిలో నేను సొంతంగా టైటిల్ పెట్టుకున్నది ఈ సినిమాకే అని చెప్పుకొచ్చాడు.ఈ సినిమా సక్సెస్ అవ్వడం నా మీద నాకు కాన్పిడెన్స్ ఇస్తుంది, అంత ఇంపార్టెంట్ సినిమా ఇది అని చెప్పుకొచ్చాడు.ఇక ఇదే ఈవెంట్ లో తనకు కాబోయే భార్యను కార్తీక్ పరిచయం చేసారు.తన ప్రేమకథ గురించి కార్తికేయ మాట్లాడుతూ నేనే ప్రపోజ్ చేశా. ఈ మెసేజ్ కోసం ఎదురు చూశా, గిఫ్ట్ లు కూడా ఇచ్చాను అని చెప్పుకొచ్చాడు.

తాను లైఫ్ లో హీరోగా అవ్వడానికి పడినంత స్ట్రగుల్ పడ్డాను. అలా చివరికి ఆ అమ్మాయిని నవంబర్ 21న పెళ్లిచేసుకోబోతున్నాను. తన పేరు లోహిత. తను నా ఫ్రెండ్,గర్ల్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఇక నుంచి ఒకటే రోల్ వైఫ్ అని చెప్పారు. అనంతరం వేదికపై లోహితకు కార్తికేయ ప్రపోస్ కూడా చేశారు.

ఐస్ క్రీంపార్లర్ లో పనిచేసిన రాజమౌళి కుమారుడు కార్తికేయ.. ఎందకంటే..?

రెండు సంవత్సరాల క్రితం దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ.. జగపతి బాబు బంధువైన పూజను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దసరా పండుగ నేపథ్యంలో వాళ్లు ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. పూజ వృత్తి రీత్యా సింగర్. దాదాపు సంవత్సరం వరకు తాము స్నేహితులుగా ఉన్నామని.. తర్వాత తానే ప్రపోజ్ చేశానని కార్తికేయ అన్నారు.

ఆమె ఒప్పుకోవడంతో 2019 డిసెంబర్ 28 న జైపూర్ ప్యాలెస్ లో పెళ్లి జరిగిందని చెప్పుకొచ్చాడు. పూజ పాటలు అంటే చాలా ఇష్టమని.. తనకు కావాల్సినప్పుడల్లా సాంగ్ పాడుతూ ఉంటుందని కార్తికేయ చెప్పాడు. 10 డిగ్రీల చలిలో తమ పెళ్లి అయిందని చెప్పాడు. సొంతంగా తాను సంపాదించడం కోసం ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లో పని చేశానని.. సొంత జీతం ద్వారా వచ్చిన డబ్బులను ఖర్చు చేస్తుంటే ఆ కిక్కే వేరుగా ఉంటుందన్నారు.

పెళ్లి అంటే ట్రస్ట్, లవ్, సెక్యూరిటీ, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అంటూ చెప్పాడు. తన నాన్న రాజమౌళి గురించి మాట్లాడుతూ రోడ్డుపై ట్రాఫిక్ లేకపోయినా.. స్లోగా డ్రైవ్ చేస్తాడని చెప్పాడు. ఇక పూజ మాట్లాడుతూ.. తాను సినిమా వాళ్లను పెళ్లి చేసుకోకూడదని అనుకున్నట్లు చెప్పారు. కానీ కార్తికేయ అడగ్గానే ఆలోచించి ఒప్పుకున్నట్లు చెప్పారు.

సంద్రదాయ సంగీతం నేర్చుకున్నా.. కానీ ప్రస్తుతం ప్రాక్టీస్ లేదని చెప్పింది. ఇక రాజమౌళి గురించి మాట్లాడుతూ.. పెళ్లికి ముందు ఎలా ఉన్నారో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నారని.. పది సంవత్సరాల తర్వాత కూడా అలానే ఉంటారని ఆమె అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ లో కూడా తన భాగస్వామ్యం ఉందని.. నైట్ షూట్స్ టైంలో తాను అందరికీ ఐస్ క్రీం తెప్పించేదాన్ని అంటూ నవ్వుకుంటూ చెప్పారు.

ఓ ఇంటివాడు కాబోతున్న‘ఆర్ఎక్స్ 100’ హీరో.. రహస్యంగా నిశ్చితార్థం..!

ఆర్ఎక్స్ 100 సినిమాలో ఎతో పాపులారిటీ తెచ్చుకున్న హీరో కార్తికేయ గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. ఆ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తిపును తెచ్చుకున్నారు. మొదటి సినిమాతోనే అద్బుతమైన విజయాన్ని అందుకున్నారు కార్తికేయ. ఈ సినిమాలో బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ తో కలిసి రొమాన్స్ చేసిన ఈ హీరో ఘనమైన విజయం అందుకున్నారు.

తర్వాత కార్తికేయకు సినిమా ఇండస్ట్రీలో పలు అవకాశాలు వచ్చినప్పటికీ ఈ సినిమా తర్వాత నటించిన కార్తికేయ సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. రీసెంట్ గా వచ్చిన చావు కబురు చల్లగా కూడా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అతడు సినిమాలో ఇలా బిజీ ఉండగా.. అతడు వ్యక్తి గత విషయంలో తర్వలోనే అతడు ఓ ఇంటివాడు కోబోతున్నట్లు తెలుస్తోంది.

గుట్టుచప్పుడు కాకుండా కుటుంబసభ్యుల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరుపుకున్నట్లు సమాచారం. పెద్దలు కుదిర్చిన వివాహమే కార్తికేయ చేసుకోనున్నారు. అయితే ఈ హీరో పెళ్లిచేసుకోబోయే అమ్మాయి… ఎవరు.. ఎక్కడ ఉంటుందనే విషయాలు మాత్రం తెలియరాలేదు. నిన్ననే నిశ్చితార్థం చేసుకున్న కార్తికేయ.. తన పెళ్లి, అమ్మాయి గురించి అధికారికంగా త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

కార్తికేయ ప్రస్తుతం రాజా విక్రమార్క సినిమా షూటింగ్ లో బిజీ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాకుండా యూవీ క్రియేషన్స్ తో కలిసి ఆసక్తికరమైన ప్రాజెక్టులో కూడా కార్తికేయ నటించబోతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ హీరో పెళ్లి విషయం గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే హీరో అధికారికంగా ప్రకటించే వరకు వేచి ఉండాల్సిందే.