కరోనా మహమ్మారి కారణంగా 2020 లో ఎన్నో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. కానీ 2021లో మాత్రం ఎంత కష్టమైనా పెళ్లిళ్లు మాత్రం బాగానే జరిగాయి. అయితే ఈ సంవత్సరంలో పెళ్లి పీటలు ఎక్కిన సెలబ్రిటీలు ఎవరో ఓ సారి లుక్కేద్దాం. అందులో మొదటగా చెప్పుకునే పేరు సింగర్ సునీత. ఆమెకు ఇది రెండో వివాహం. మ్యాంగో మీడియా గ్రూప్ అధినేత రామ్ వీరపనేనినితో 2021 జనవరి 9న వివాహం జరిగింది.
ఈమెకు 19 సంవత్సరాల వయసులో కిరణ్ తో వివాహమైనది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అబ్బాయి ఆకాష్, అమ్మాయి శ్రేయ. అయితే కొన్ని కారణాల వల్ల 2020లో ఆమె అతడితో విడాకులు తీసుకుంది. ఇక టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ వివాహం కూడా ఈ ఏడాది తన స్నేహితురాలు లోహితరెడ్డితో జరిగింది. ఈ వేడుకకు ఎంతో మంది సెలబ్రిటీలు హాజరయ్యారు.
2007 సంవత్సరంలో గోదావ చిత్రంలో నటించిన నటి శ్రద్ధా ఆర్య. దీంతో తెలుగులో పరిచయం అయింది. ఇదే సంవత్సరంలో ఆమె తమిళంలో కూడా కాల్వనిన్ కాదల్ ద్వారా పరిచయం అయ్యారు. నవంబర్ 16, 2021న, ఆర్య తన స్వస్థలమైన న్యూఢిల్లీలో భారతీయ నావికాదళ అధికారి రాహుల్ శర్మను వివాహం చేసుకున్నారు . బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్.. యూరీ ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ ను వివాహం చేసుకుంది.
బిజినెస్ మ్యాన్ నితిన్ రాజ్ను ప్రణీత వివాహమాడింది. బ్యాట్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాను హీరో విష్ణు విశాల్ వివాహం చేసుకున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దియా మీర్జా, వైభవ్ రేఖిని పెళ్లి చేసుకుంది. విక్కీ కౌషల్ ను కత్రినా కైఫ్ వివాహమాడింది. ఇలా ఎంతో కాలంగా కోవిడ్ కారణంగా వాయిదా వేసుకుంటూ వస్తున్న పెళ్లిళ్లు ఈ ఏడాది పూర్తయ్యాయి.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…