Tag Archives: Karthikeya2

Tammareddy Bharadwaj: ఆరోజు దిల్ రాజు ఇంటికి వెళ్లి ఎందుకు అడుక్కున్నావ్..? హీరో నిఖిల్ పై ఫైర్ అయిన తమ్మారెడ్డి

Tammareddy Bharadwaj: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా నిర్మాతగా గుర్తింపు పొందిన తమ్మారెడ్డి భరద్వాజ్ తాజాగా నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా పై స్పందిస్తూ పెద్ద ఎత్తున హీరో నిఖిల్ పై ఫైర్ అయ్యారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నిఖిల్ మాట్లాడుతూ తన సినిమా విడుదల చేయకుండా అడ్డుకుంటున్నారని థియేటర్లు కూడా దొరక్కుండా చేస్తున్నారంటూ పరోక్షంగా దిల్ రాజు గురించి ఈయన ఆరోపణలు చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ విషయంపై తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందిస్తూ నిఖిల్ పై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ హీరో నిఖిల్ సినిమా విడుదలకు థియేటర్స్ దొరకడం లేదని ముసలి కన్నీళ్లు కార్చి సినిమా హిట్ అవ్వగానే దిల్ రాజుని సక్సెస్ మీట్ కి పిలవడం ఆయన మాట్లాడుతూ చేసిందంతా మీడియా అంటూ మీడియాపై మండిపడుతున్న సమయంలో నిఖిల్ మాత్రం వెనకనే ఉండి నవ్వుతున్నారే తప్ప ఆ రోజు నువ్వు నా సినిమాకి అడ్డుపడలేదా అని దిల్ రాజు గారిని ప్రశ్నించలేదు.

నిజంగానే నీ సినిమాకి దిల్ రాజుగారు అడ్డుపడి ఉంటే ఆరోజు ఆయన మాట్లాడుతున్న సమయంలో మైక్ తీసుకొని మీరు నా సినిమాకు అడ్డుపడలేదా అని అడగాల్సింది. సినిమా హిట్ అయితే ఒక విధంగా ఫ్లాప్ అయితే మరొక విధంగా మాట్లాడటం మానుకోవాలి. అయినా దిల్ రాజు గారి ఇంటికి వెళ్లి అడుక్కోవాల్సిన అవసరం నీకేంటి? హీరో హీరో పనులు మాత్రమే చూసుకోవాలి డబ్బులు తీసుకోకుండా నువ్వేం సినిమాలో నటించలేదు కదా…మాచర్ల నియోజకవర్గం సినిమాకి పోటీగా వచ్చిన నీవు థాంక్యూ సినిమాకి ఎందుకు పోటీగా రాలేకపోయావు అంత ధైర్యం నీకు లేదా? అంటూ తమ్మారెడ్డి నిఖిల్ పై ఫైర్ అయ్యారు.

Tammareddy Bharadwaj: డబ్బు కోసమే సినిమాలు చేస్తారు…

సినిమా ఫ్లాప్ అయితే ముసలి కన్నీళ్లుకార్చడం హిట్ అయితే కాలర్ ఎగరేయడం వంటివి మానుకోవాలి అయినా నువ్వు హీరోగా డబ్బు తీసుకోకుండా సినిమాలు చేయలేదు కదా డబ్బు కోసమే సినిమాలు చేశావు కానీ దేశాన్ని ఉద్ధరించడం కోసం సినిమాలు చేయలేదు అంటూ ఈ సందర్భంగా ఈయన నిఖిల్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం తమ్మారెడ్డి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి మరి ఈ వ్యాఖ్యలపై నిఖిల్ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

Sri Reddy: కంటెంట్ లేదు కానీ బాబు డేట్స్ కావాలా అధ్యక్షా.. లైగర్ సినిమా పై స్పందించిన శ్రీ రెడ్డి!

Sri Reddy: పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం లైగర్. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో భారీ బడ్జెట్ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కొంది.

ఇక ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేయడమే కాకుండా సినిమాలో ఏ మాత్రం కంటెంట్ లేకపోయినా సినిమాకి భారీ హైప్ క్రియేట్ చేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించారని, చివరికి విజయ్ దేవరకొండ అభిమానుల సైతం ఈ సినిమా విషయంలో సంతృప్తి పడలేదని తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమా విజయం పై నటి శ్రీరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి మాట్లాడుతూ తీసేవన్నీ అట్టర్ ఫ్లాప్ సినిమాలే… పైగా మహేష్ బాబు డేట్స్ ఇవ్వలేదని చెప్పడం ఏంటో.. అట్టర్ ఫ్లాప్ సినిమాలకు బాబు డేట్స్ ఇవ్వలేదని ఏడవడం ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష అంటూ ఈమె కామెంట్ చేశారు.

Sri Reddy: లైగర్ కన్నా కార్తికేయ 2 బెటర్…

సినిమాలో కంటెంట్ లేదు కానీ సినిమాకి ఇలాంటి హైప్ అవసరమా.. అంతేకాదు లైగర్ ముందు లైగర్ తర్వాత అంట మనకు ఇలాంటి వన్నీ అవసరమా.. అసలు లైగర్ సినిమా కన్నా కార్తికేయ 2 సినిమా చాలా బాగుందంటూ ఈ సందర్భంగా శ్రీ రెడ్డి చేసిన ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా పూరి జగన్నాథ్ ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమాని విడుదల చేసినప్పటికీ ఈ సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చిందనే చెప్పాలి.

Anupama Parameswaran: కార్తికేయ 2 సినిమా విషయంలో బాధగా ఉందన్న అనుపమ… భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేనటువంటి హీరోయిన్. కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే అనుపమ పరమేశ్వరన్ తాజాగా నిఖిల్ సరసన నటించిన కార్తికేయ 2 సినిమాలో నటించిన విషయం మనకు తెలిసింది. ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ విడుదల అయ్యి కేవలం సౌత్ లో మాత్రమే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుంది.

ఇలా ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా కమర్షియల్ గా కూడా మంచి వసూళ్లను రాబడుతుంది.ఇకపోతే ఈ సినిమా విడుదలైన మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి ప్రస్తుతం లాభాలను అందుకుంటుంది. ఇక ఈ సినిమా విజయవంతం కావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.ఈ క్రమంలోనే అల్లు అరవింద్ దిల్ రాజు వంటి నిర్మాతలు హాజరై చిత్ర బృందం పై ప్రశంసలు కురిపించారు.ఇలా ఈ సినిమా విజయం సాధించినందుకు అందరూ సంతోషంగా ఉండగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో మాత్రం అనుపమ తనకు చాలా బాధగా ఉందంటూ బాంబు పేల్చారు.

Anupama Parameswaran: ఈ సినిమాతో రుణం తీరిపోయిందా…

ఈ సక్సెస్ మీట్ కార్యక్రమంలో అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ కార్తికేయ 2 సినిమా విషయంలో తనకు చాలా బాధగా ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంతో అద్భుతమైన ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా జరిగిపోవడంతో ఈ సినిమాతో నాకు రుణం తీరిపోయిందా అనే బాధ తనలో ఎక్కువగా ఉందంటూ చెప్పుకొచ్చారు.ఇలా ఈమె ఈ సినిమా విషయంలో బాధగా ఉందని చెప్పడంతో యధావిధిగా నేటిజన్ లు తనపై భారీగా ట్రోల్ చేస్తున్నారు.

Karthikeya 2: బాలీవుడ్ హీరోలను ఆశ్చర్యపరుస్తున్న కార్తికేయ 2 కలెక్షన్లు.. దూసుకుపోతున్న కార్తికేయ 2!

Karthikeya 2: నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తికేయ సినిమా సీక్వెల్ చిత్రంగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ2.ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఇకపోతే ఈ సినిమానీ హిందీ వర్షన్ లో కూడా విడుదల చేశారు. మొదటిరోజు కేవలం 50 థియేటర్లకు మాత్రమే పరిమితమైన ఈ సినిమా మొదటి రోజు 9 లక్షల వసూలను రాబట్టింది..

ఇకపోతే ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో థియేటర్ కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య అధికమవడంతో థియేటర్ల సంఖ్య కూడా పెంచారు.ఇలా థియేటర్ల సంఖ్య పెరగడంతో రెండవ రోజు ఈ సినిమా హిందీలో మాత్రమే 40 లక్షల వసూళ్లను రాబట్టింది. ఇలా తొమ్మిది నుంచి 40 లక్షల వసూలు రాబట్టడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

కేవలం మౌత్ టాక్ ద్వారా ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అందుకొని పెద్ద ఎత్తున ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంది. ఈ క్రమంలోనే మూడవరోజు ఈ సినిమా ఏకంగా కోటి రూపాయలకు పైగా వసూలు రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా,అక్షయ్ కుమార్ రక్షాబంధన్ సినిమాలు విడుదలైనప్పటికీ ఆ సినిమాలను మించి కలెక్షన్లను రాబట్టడంతో బాలీవుడ్ హీరోలు సైతం నిఖిల్ సినిమా కలెక్షన్లను చూసి ఆశ్చర్యపోతున్నారు.

Karthikeya 2: బాలీవుడ్ చిత్రాలను వెనుకనెట్టి దూసుకుపోతున్న కార్తికేయ 2…

ఒక తెలుగు సినిమాని హిందీలో డబ్ చేసి విడుదల చేయడంతో ఈ స్థాయిలో కలెక్షన్లను రాబట్టడంతో మరోసారి తెలుగు సినిమా సత్తా ఏంటో బాలీవుడ్ ఇండస్ట్రీలో నిరూపితమైంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దోసుకుపోతుంది.ఇక ఈ సినిమా విడుదలైన మూడు రోజులలోనే బ్రేక్ ఈవెన్ కావడంతో నిఖిల్ మంచి విజయాన్ని తన సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా లాభాల బాటలో పయనిస్తుందని చెప్పాలి.