Karthikeya 2: నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తికేయ సినిమా సీక్వెల్ చిత్రంగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ2.ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఇకపోతే ఈ సినిమానీ హిందీ వర్షన్ లో కూడా విడుదల చేశారు. మొదటిరోజు కేవలం 50 థియేటర్లకు మాత్రమే పరిమితమైన ఈ సినిమా మొదటి రోజు 9 లక్షల వసూలను రాబట్టింది..
ఇకపోతే ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో థియేటర్ కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య అధికమవడంతో థియేటర్ల సంఖ్య కూడా పెంచారు.ఇలా థియేటర్ల సంఖ్య పెరగడంతో రెండవ రోజు ఈ సినిమా హిందీలో మాత్రమే 40 లక్షల వసూళ్లను రాబట్టింది. ఇలా తొమ్మిది నుంచి 40 లక్షల వసూలు రాబట్టడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.
కేవలం మౌత్ టాక్ ద్వారా ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అందుకొని పెద్ద ఎత్తున ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంది. ఈ క్రమంలోనే మూడవరోజు ఈ సినిమా ఏకంగా కోటి రూపాయలకు పైగా వసూలు రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా,అక్షయ్ కుమార్ రక్షాబంధన్ సినిమాలు విడుదలైనప్పటికీ ఆ సినిమాలను మించి కలెక్షన్లను రాబట్టడంతో బాలీవుడ్ హీరోలు సైతం నిఖిల్ సినిమా కలెక్షన్లను చూసి ఆశ్చర్యపోతున్నారు.
ఒక తెలుగు సినిమాని హిందీలో డబ్ చేసి విడుదల చేయడంతో ఈ స్థాయిలో కలెక్షన్లను రాబట్టడంతో మరోసారి తెలుగు సినిమా సత్తా ఏంటో బాలీవుడ్ ఇండస్ట్రీలో నిరూపితమైంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దోసుకుపోతుంది.ఇక ఈ సినిమా విడుదలైన మూడు రోజులలోనే బ్రేక్ ఈవెన్ కావడంతో నిఖిల్ మంచి విజయాన్ని తన సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా లాభాల బాటలో పయనిస్తుందని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…