Karthikeya 2: నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తికేయ సినిమా సీక్వెల్ చిత్రంగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ2.ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఇకపోతే ఈ సినిమానీ హిందీ వర్షన్ లో కూడా విడుదల చేశారు. మొదటిరోజు కేవలం 50 థియేటర్లకు మాత్రమే పరిమితమైన ఈ సినిమా మొదటి రోజు 9 లక్షల వసూలను రాబట్టింది..
ఇకపోతే ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో థియేటర్ కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య అధికమవడంతో థియేటర్ల సంఖ్య కూడా పెంచారు.ఇలా థియేటర్ల సంఖ్య పెరగడంతో రెండవ రోజు ఈ సినిమా హిందీలో మాత్రమే 40 లక్షల వసూళ్లను రాబట్టింది. ఇలా తొమ్మిది నుంచి 40 లక్షల వసూలు రాబట్టడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.
కేవలం మౌత్ టాక్ ద్వారా ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అందుకొని పెద్ద ఎత్తున ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంది. ఈ క్రమంలోనే మూడవరోజు ఈ సినిమా ఏకంగా కోటి రూపాయలకు పైగా వసూలు రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా,అక్షయ్ కుమార్ రక్షాబంధన్ సినిమాలు విడుదలైనప్పటికీ ఆ సినిమాలను మించి కలెక్షన్లను రాబట్టడంతో బాలీవుడ్ హీరోలు సైతం నిఖిల్ సినిమా కలెక్షన్లను చూసి ఆశ్చర్యపోతున్నారు.
ఒక తెలుగు సినిమాని హిందీలో డబ్ చేసి విడుదల చేయడంతో ఈ స్థాయిలో కలెక్షన్లను రాబట్టడంతో మరోసారి తెలుగు సినిమా సత్తా ఏంటో బాలీవుడ్ ఇండస్ట్రీలో నిరూపితమైంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దోసుకుపోతుంది.ఇక ఈ సినిమా విడుదలైన మూడు రోజులలోనే బ్రేక్ ఈవెన్ కావడంతో నిఖిల్ మంచి విజయాన్ని తన సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా లాభాల బాటలో పయనిస్తుందని చెప్పాలి.
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…