Tag Archives: Khammam

Karate Kalyani: నటి కరాటే కళ్యాణి పై మా సస్పెన్షన్ వేటు… సభ్యత్వం రద్దు చేయడానికి ఇదే కారణమా?

Karate Kalyani: నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు నటిగా పలు సినిమాలలో నటించిన ఈమె సినిమాలలో కన్నా ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఫేమస్ అయ్యారు. తాజాగా నటి కరాటే కళ్యాణి పై మా సస్పెన్షన్ వేటు వేసింది. మా అసోసియేషన్ లో ఈమె సభ్యత్వాన్ని రద్దు చేస్తూ షాక్ ఇచ్చింది.

ఈ విధంగా నటి కరాటే కళ్యాణి సభ్యత్వం రద్దు చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ విగ్రహ ఏర్పాటు పై కరాటే కళ్యాణి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్స్ కారణంగానే ఈమెపై మా సస్పెన్షన్ వేటు వేసినట్టు తెలుస్తుంది.

నందమూరి తారక రామారావు విగ్రహాన్ని కృష్ణుని రూపంలో ప్రతిష్టిస్తున్న తరుణంలో ఈమె ఎన్టీఆర్ ఏ వర్గానికి దేవుడు అంటూ తీవ్ర వ్యతిరేకత చూపించారు. ఎన్టీఆర్ కృష్ణుడి రూపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదంటూ యాదవ సంఘాలతో కలిసి ధర్నాలు చేశారు.ఈ విధంగా తెలుగు చిత్ర పరిశ్రమకే గర్వకారణమైనటువంటి నందమూరి తారక రామారావు గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతోనే ఈమె పై సస్పెన్షన్ వేటు పడిందని తెలుస్తోంది.

Karate Kalyani: ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలే కారణమా…

ఈ క్రమంలోనే జనరల్ సెక్రటరీ వై.రఘుబాబు గురువారం కరాటే కళ్యాణీకి సస్పెన్షన్ నోటీసు పంపించారు. ఈనెల 16 జారీ చేసిన షోకాజ్ నోటీసుకు నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వాలని తెలిపారు. మా
సభ్యుల కోసం నిర్దేశించిన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అని సస్పెన్షన్ నోటీసులో పేర్కొన్నారు. మరి ఈ విషయంపై కరాటే కళ్యాణి స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

Sad News: ఎవరిదీ పాపం..ఇద్దరు చేసిన తప్పుకు.. ముళ్లపొదల్లో ఇలా..!

Sad News: ప్రస్తుతం ఉన్న జీవవ విధానంతో చాలా మంది సంతాన భాగ్యానికి నోచుకోవడం లేదు. మాతృత్వ మాధుర్యం కోసం లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఐవీఎఫ్, సరోగసీ చేసుకుంటూ పిల్లల్ని కంటున్నారు. అయితే కొంత మంది మాత్రం ఆ మాతృత్వానికే మచ్చ తెస్తున్నారు.

Sad News: ఎవరిదీ పాపం..ఇద్దరు చేసిన తప్పుకు.. ముళ్లపొదల్లో ఇలా..!

కావాలని నవజాత శిశువును ముళ్ల పొదల్లో, చెత్త కుండీల్లో వదిలి వెళుతున్నారు. ఎవరైనా చూస్తే బతికి బయటపడుతున్నారు. లేకపోతే.. మరణిస్తున్నారు. చిన్న పిల్లల్ని అన్ని ఉన్నా అనాథలుగా చేస్తున్నారు. తల్లిదండ్రులు తెలియక మనోవేధనకు గురవుతున్నారు. ఇలాంటి చాలా ఘటనలు దేశవ్యాప్తంగా చూస్తున్నాం.

Sad News: ఎవరిదీ పాపం..ఇద్దరు చేసిన తప్పుకు.. ముళ్లపొదల్లో ఇలా..!

యుక్తవయసులో తప్పటడుగులు వేసి అబార్షన్లు చేయించుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు. బయటకు తెలిస్తే సమాజం అవమానిస్తుందని గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్లు చేయించుకుంటున్నారు. బిడ్డలు పుడితే ఎక్కడో చోట విసిరేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. 

ముళ్ల పొదల్లో నవజాత శిశువు …

ఖమ్మం జిల్లా పెద్దమండవలో శుక్రవారం ఓ వీధిలో సీసీ రోడ్డు పక్కన ఉన్న ముళ్ల పొదల్లో నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. అయితే పూర్తిగా నెలలు నిండక ముందే శిశువును గర్భం నుంచి తొలగించి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. దీంతో గ్రామ పంచాయతీ సిబ్బందే.. శిశువును ఖననం చేశారు. ఇదిలా ఉంటే అదే గ్రామానికి చెందిన శిశువు మరణిస్తే ఖననం చేశారని.. కుక్కలు వెలికి తీసి పొదల్లోకి ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.

వివాహిత స్నానం చేస్తుండా వీడియో తీశాడు.. ఆ వీడియోని అడ్డుపెట్టుకుని ఏం చేశారంటే?

చట్టాలు ఎన్ని చేసినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాల వార్తలే వినిపిస్తున్నాయి. ఇంటి నుంచి మహిళ బయట అడుగుపెట్టిందంటే.. తిరిగి ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేకుండా పోతోంది. ఏం జరిగి ఉంటుందో అన్న ఆందోళనలో తల్లిదండ్రులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇటీవల మైనర్ బాలికపై అత్యాచారాలు బాగా పెరిగిపోయాయి. అమ్మాయి అయితే చాలు ఎలాంటి వాయి వరుసలు గుర్తుకురావు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళకు బయటనే కాదు ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోయింది. ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా.. వారి రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇటువంటిదే మరో ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం పట్టణంలోని ప్రశాంత్ నగర్ లో ఓ వివాహిత నివాసం ఉంటుంది.

ఆమెపై ఇద్దరు అన్నాదమ్ముళ్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. దీనిపై ఖమ్మంలోని ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆమె స్నానం చేస్తుండగా.. ప్రవీణ్ అనే యువకుడు ఆమె ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటితో ఆమెను బెదిరించాడు.

తన కామ కోరిక తీర్చాలని ఆమెను లొంగదీసుకున్నాడు. ప్రవీణ్ సోదరుడు గిరిదర్ కూడా ఆమెను ఇలానే బెదిరించడం మొదలుపెట్టాడు. వాళ్లు పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక ఆమె తనపై వారిద్దరు లైంగిక దాడి చేసి.. వేధింపులకు గురిచేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వాళ్లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

వివాహేతర సంబంధం.. మూడు ప్రాణాలను బలి తీసుకుంది.. ఏమైందంటే..!

వివాహేతన సంబంధాలు ఎంత దూరమైనా దారితీస్తాయి. దీంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున కూడా పడ్డాయి. ఇలా రోజు ఏదో ఒక వార్తలు మనం వింటూనే ఉన్నాం. తాజాగా జరిగిన ఘటనలో కూడా వివాహేతర సంబంధం కాస్త.. ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామానికి చెందిన బాలయ్య, కృష్ణవేణి దంపతులు. అదే గ్రామానికి చెందిన 30 ఏళ్ల ధర్మయ్య వారు ఉండే కాలనీలోనే ఉంటున్నాడు. దీంతో అతడితో పరిచయం ఏర్పరుచుకున్న సందరు మహిళ.. తరచూ మాట్లాడుతుండేది. ఇది రాను రాను వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో ఓ రోజు కృష్ణవేణి, ధర్మయ్య ఇంటి నుంచి పారిపోయారు.

దీంతో బాలయ్య తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. నిండు నూరేళ్లు కలిసి ఉంటానని చెప్పిన భార్య ఇలాంటి పని చేయడంతో ఎంతో క్రుంగిపోయాడు. తెల్లారి అతడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అది చూసిన చుట్టు పక్కల వారు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా.. చికిత్స పొందుతూ అతడు మరణించాడు.

ఇంటి నుంచి పారిపోయిన సదరు మహిళ, ధర్మయ్యలు ఆ ఊర్లోనే ఓ ఇంట్లో ఉన్నారు. ఆ ఇంటి యజమాని.. కొన్ని రోజుల క్రితం వాళ్ల బిడ్డ ఇంటికి వెళ్లి.. తిరిగి వచ్చింది. తలుపులు తీయగా ఆ రెండు శవాలు వాసన వచ్చాయి. దీంతో ఆమె స్థానికులకు చెప్పగా.. వాళ్లిద్దరు ధర్మయ్య, కృష్ణవేణి గా గుర్తించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఆరేళ్ల బాలికపై.. 60 ఏళ్ల వృద్ధుడు ధారుణం.. చాక్లెట్ కొనిస్తానంటూ..!

ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మృగాళ్ల ఆగడాలు ఆగడం లేదు. ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆరేళ్ల వయస్సున్న ఆడపిల్ల నుంచి ఆరవై ఏళ్ల వయస్సున్న వృద్ధురాలి వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా జరిగిన ఘటన సమాజం ఎటుపోతుందా అన్న సందేహం కలుగకమానదు.

ఇంటి బయట మిగతా పిల్లలతో ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని.. 60 ఏళ్ల వయస్సున్న వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం మోటాపురం గ్రామ పరిధిలోని పెద్ద తండాలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దతండాకు చెందిన దంపతులకు ఆరేళ్ల కూతురు ఉంది. కూలీ పనులకు వెళ్లిన వాళ్లు ఆ పాపను ఇంట్లో వదిలేసి వెళ్లారు.

చుట్టుపక్కల పిల్లలతో ఆడుకుంటున్న ఆ పాపపై పక్కనే ఉన్న 60 ఏళ్ల వయస్సున్న చిన్నారిపై దీప్లానాయక్ కన్ను పడింది. చాక్లెట్ కొనిస్తానంటూ.. ఆ పాపను ఇంట్లోకి తీసుకెళ్లాడు. తలుపులు వేసి ఘోరానికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చిన పాప తల్లిదండ్రులు తమ కూతురు కనిపించకపోవడంతో కంగారు పడ్డారు. ఆ పాపతో ఆడుకున్న వారిని అడిగారు. వాళ్లు పక్కనే ఉన్న తాత వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడని చెప్పారు.

దీంతో ఆ ఇంటికి వెళ్లి చూడగా.. ఆ బాలిక వివస్త్రగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వెంటనే అతడిపై దాడి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ పాపను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

తండ్రికి తలకొరివి పెట్టని కొడుకు.. ఐదేళ్ల కూతురుతో అంత్యక్రియలు.. కంటతడి పెట్టించిన దృశ్యాలు..

భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనను పోలీస్ స్టేషన్ కు పిలిపించి అవమానించాడన్న ఒక్క కారణంతో తన తండ్రికి తలకొరివి పెట్టనని మొండికేశాడు ఓ కొడుకు. దీంతో చేసేది లేక తన పదేళ్ల కూతురుతోనే అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించారు. చెడు మార్గాల్లో పయనిస్తున్న పదహారేళ్ల కొడుకుని సక్రమ మార్గంలో పెట్టేందుకు తండ్రి పోలీసులతో కౌన్సెలింగ్‌ ఇప్పించాడు. ఆయన చేసింది తన భవిష్యత్ కోసమేనని తెలుసుకోలేని ఆ కుర్రాడు కన్నతండ్రి పైన కక్ష పెంచుకున్నాడు.

తండ్రి మరణిస్తే కనీసం తలకొరివి పెట్టడానికి కూడా ముందుకు రాలేదు. దీంతో కూతురే అంత్యక్రియలు నిర్వహించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అశ్వారావుపేటకు చెందిన లింగిశెట్టి నీలాచలం(38) స్థానికంగా సెలూన్‌ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేక అప్పుల పాలయ్యాడు. తెచ్చిన అప్పులు పెరిగి వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితి నెలకొంది.

దీంతో తీర్చే మార్గం లేక ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 16 ఏళ్ల కొడుకు చేత తలకొరివి పెట్టించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తుండగా తాను పెట్టనని మొండికేశాడు. గతంలో జులాయిగా తిరుగుతున్నాననే నెపంతో తండ్రి తనకు పోలీసులతో కౌన్సెలింగ్‌ ఇప్పించి పరువు తీశాడని, అందుకే ఆయనకు తలకొరివి పెట్టనని తెగేసి చెప్పాడు.

ఎంత నచ్చజెప్పినా వినిపించుకోకపోవడంతో బంధువులు, పెద్దలు చర్చించుకుని కూతురు మీనాక్షితో నీలాచలానికి అంత్యక్రియలు చేయించారు. ఇక్కడ ఐదు సంవత్సరాల కూతురు తలకొరివి పెట్టే దృశ్యాలు ఇప్పుడు ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టించాయి.