చట్టాలు ఎన్ని చేసినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాల వార్తలే వినిపిస్తున్నాయి. ఇంటి నుంచి మహిళ బయట అడుగుపెట్టిందంటే.. తిరిగి ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేకుండా పోతోంది. ఏం జరిగి ఉంటుందో అన్న ఆందోళనలో తల్లిదండ్రులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇటీవల మైనర్ బాలికపై అత్యాచారాలు బాగా పెరిగిపోయాయి. అమ్మాయి అయితే చాలు ఎలాంటి వాయి వరుసలు గుర్తుకురావు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళకు బయటనే కాదు ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోయింది. ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా.. వారి రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇటువంటిదే మరో ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం పట్టణంలోని ప్రశాంత్ నగర్ లో ఓ వివాహిత నివాసం ఉంటుంది.
ఆమెపై ఇద్దరు అన్నాదమ్ముళ్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. దీనిపై ఖమ్మంలోని ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆమె స్నానం చేస్తుండగా.. ప్రవీణ్ అనే యువకుడు ఆమె ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటితో ఆమెను బెదిరించాడు.
తన కామ కోరిక తీర్చాలని ఆమెను లొంగదీసుకున్నాడు. ప్రవీణ్ సోదరుడు గిరిదర్ కూడా ఆమెను ఇలానే బెదిరించడం మొదలుపెట్టాడు. వాళ్లు పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక ఆమె తనపై వారిద్దరు లైంగిక దాడి చేసి.. వేధింపులకు గురిచేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వాళ్లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…