Tag Archives: killed

Crime News: నెల రోజులు కాపుకాసి.. 10 నిమిషాల్లో ఖతం.. హైదరాబాద్ పరువు హత్య నిందితులు అరెస్ట్!

Crime News: హైదరాబాద్ లో బుధవారం సాయంత్రం పరువు హత్య జరిగిన సంగతి మనకు తెలిసిందే. వికారాబాద్‌ జిల్లా మర్పల్లికి చెందిన బిల్లిపురం నాగరాజు (25), ఆశ్రిన్‌ సుల్తానా ప్రేమించుకొని జనవరి నెలలో ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆశ్రిన్‌ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని వీరిద్దరూ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లిపోయారు. అయితే తమ కోసం తమ కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టలేదని తెలుసుకున్న ఈ జంట తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.

Crime News: నెల రోజులు కాపుకాసి.. 10 నిమిషాల్లో ఖతం.. హైదరాబాద్ పరువు హత్య నిందితులు అరెస్ట్!

వీరిద్దరూ హైదరాబాద్ వచ్చారని తెలుసుకున్న ఆశ్రిన్‌ సోదరుడు అతని బావ వీరి కదలికలను అనుసరిస్తూ బుధవారం సాయంత్రం నాగరాజు పై దాడి చేసి చంపిన సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా హైదరాబాదులో జరిగిన ఈ పరువు హత్య ఒక్కసారిగా సంచలనం అయింది. కులాంతర వివాహం చేసుకోవడంతో వీరి పై పగ పెంచుకున్న ఆశ్రిన్‌ సోదరుడు నెలరోజులపాటు వీరి కోసం గాలించి చివరికి బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంలో బయటకు వెళ్లిన ఇతనిపై ఆశ్రిన్‌ సోదరుడు ఆమె భావ దాడి చేసి దారుణంగా చంపారు.

Crime News: నెల రోజులు కాపుకాసి.. 10 నిమిషాల్లో ఖతం.. హైదరాబాద్ పరువు హత్య నిందితులు అరెస్ట్!

కేవలం పది నిమిషాల్లోనే నాగరాజు పై దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా
ఎల్బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి సారథ్యంలో పోలీసులు గాలించి నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ హత్యలో భాగంగా ఆశ్రిన్‌ సోదరుడు ఆమె రెండవ అక్క భర్తతో కలిసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రభుత్వ పరిహారం అందజేస్తుంది…

ఈ సందర్భంగా డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ మాట్లాడుతూ నాగరాజు ఎస్సీ వర్గానికి చెందిన వారు కావడంతో ప్రభుత్వ పరిహారం అతడి కుటుంబానికి చేరుతుందని డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ తెలిపారు. తన కొడుకు మృతి చెందడంతో నాగరాజు కుటుంబసభ్యులు ఆశ్రిన్‌ను తమ వెంట మర్పల్లి తీసుకెళ్లారు.

Crime news: మామతో అక్రమ సంబంధం.. బండారం బయటపడుతుందని కన్న కూతురినీ హత్యచేసిన కసాయి తల్లి…!

Crime news: కన్న కూతురనే కనికరం లేదు.. మనవరాలు అనే మమకారం లేదు. తన అనైతిక సంబంధాన్ని ఎక్కక  బయటపెడుతుందో అని ఓ తల్లి కర్కషంగా ప్రవర్తించింది. భర్త తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకుని బరితెగించింది. సొంత కూతురునే దారుణంగా చంపేసింది. 

Crime news: మామతో అక్రమ సంబంధం.. బండారం బయటపడుతుందని కన్న కూతురినీ హత్యచేసిన కసాయి తల్లి…!

ఈ ఘటన ఖమ్మం జిల్ల బోనకల్ లో జరిగింది. ఓ మహిళ తన భర్త తండ్రితోనే అక్రమ సంబంధం నెరుపుతూ.. ఎక్కడ తమ బండారాన్ని భర్తకు చెబుతుందో అని భయపడి కన్న కూతురును కడతేర్చింది. చివరకు పోలీస్ విచారణలో నేరాన్ని అంగీకరించింది. వైరా ఏసీపీ స్నేహ మెహ్రా ఈ దారుణానికి సంబంధించి వివరాలను వెల్లడించారు. 

Crime news: మామతో అక్రమ సంబంధం.. బండారం బయటపడుతుందని కన్న కూతురినీ హత్యచేసిన కసాయి తల్లి…!

బోనకల్ కు చెందని పాలెపు హరికృష్ణ– సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. హరికృష్ణ లారీ, ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తరుచూ పని నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్తుంటాడు. దీంతో ఇంటి వద్ద తక్కువగానే ఉండే వాడు. ఈక్రమంలో సునీత భర్త తండ్రి నర్సింహరావుతో అక్రమ సంబంధం ఏర్పరుచుకుంది. ఐదారేళ్లుగా ఇది కొనసాగుతున్నా.. ఇటీవల తల్లి-తాత ఒకే గదిలో ఉండటాన్ని గమనించింది పెద్ద కూతురు మహాదేవి(11). ఈ విషయాన్ని తండ్రికి చెబుతా  అని బెదిరించింది. దీంతో సునీత, నర్సింహారావులు ఆ మెను హతమార్చాలని నిర్ణయించుకున్నారు.

దారుణంగా చంపి పిట్స్ తో మృతిగా స్కెచ్..

ఈ నెల 8న మహాదేవి కాళ్లు, చేతులను చున్నీతో కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి వైరుతో మెడకు బిగించి సునీత, నర్సింహారావులు హతమర్చారు. పాప స్కూల్ లో పిట్స్ వచ్చి చనిపోయిందని స్కెచ్ వేశారు. అయితే పాపమెడపై ఉన్న కమిలిన గాయాలను బంధువులు గమనించి పోలీసులకు చెప్పడంతో వారు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించారు. మహాదేవి హత్యకు గురైనట్లు నివేదిక రావడంతో పోలీసులు బాలిక తల్లి, తాతను అదుపులోకి తీసుకుని విచారించారు. మహాదేవిని తామే హత్య చేసినట్లు సునీత, నర్సింహారావు అంగీకరించడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు

Actress Krishnaveni: ఆ హీరోయిన్ నా భర్తను కరెంటు వైర్లతో కాల్చి హత్య చేయించింది… నటి కృష్ణవేణి షాకింగ్ కామెంట్స్!

Actress Krishnaveni: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటి కృష్ణవేణి గురించి అందరికీ తెలిసిందే. 1979లో నగ్నసత్యం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కృష్ణవేణి ఎన్నో సినిమాలలో నటిగా సహాయనటిగా అద్భుతమైన పాత్రలో నటించి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

Actress Krishnaveni: ఆ హీరోయిన్ నా భర్తను కరెంటు వైర్లతో కాల్చి హత్య చేయించింది… నటి కృష్ణవేణి షాకింగ్ కామెంట్స్!

ఈ విధంగా ఇండస్ట్రీలో సుమారు 200కు పైగా సినిమాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందిన కృష్ణవేణి ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ లో బామ్మ పాత్రలలో నటిస్తున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఇప్పటికీ కొనసాగుతున్న కృష్ణవేణి ఓ ఇంటర్వ్యూలో పాల్గొనీ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Actress Krishnaveni: ఆ హీరోయిన్ నా భర్తను కరెంటు వైర్లతో కాల్చి హత్య చేయించింది… నటి కృష్ణవేణి షాకింగ్ కామెంట్స్!

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితంలో ‘వారాలబ్బాయి’ డైరెక్టర్‌ రాజచంద్రను పెళ్లి చేసుకున్నానని వెల్లడించారు.అయితే అప్పటికే ఆయనకు పెళ్లి అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారని,ఇంటి అద్దె కూడా చెల్లించుకోలేని పరిస్థితులలో ఉన్న ఆయన ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒక్కో సినిమాకి సుమారు 4 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదగారని అయితే అదే సమయంలోనే ఆయన చనిపోయారని తెలియజేశారు.

అతని విజయాన్ని ఓర్వలేకే ఈ హత్య…

ఇక ఆయనను పెళ్లి చేసుకున్న తర్వాత నాలుగు సంవత్సరాలు మేము కలిసి ఉన్నామని అయితే ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు 100 రోజులు ఆడటం వల్ల ఇండస్ట్రీ తనని చూసి ఓర్వ లేక పోయిందని తెలియజేశారు. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ తనని కరెంటు వైర్ లతో కాల్చి హత్య చేయించిందని కృష్ణవేణి ఈ సందర్భంగా తన భర్త హత్యకు గల కారణాలు తెలియజేశారు.ఇక తన భర్త హత్య గురించి పోలీసులు మాట్లాడుతూ ఈ హత్య ఎవరు చేశారో మాకు తెలుసు అయినా తనని మేము ఏమీ చేయలేక పోతున్నాను అంటూ తెలియజేశారని వెల్లడించారు..ఈ విధంగా తన భర్తను చంపడమే కాకుండా మా కుటుంబానికి కూడా బెదిరింపులు వచ్చాయని అందుకే మా కుటుంబానికి పోలీసులు సుమారు రెండు సంవత్సరాల పాటు రక్షణ కల్పించారని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కృష్ణవేణి తెలిపారు. తన భర్తను ఒక హీరోయిన్ హత్య చేయించింనే విషయం చెప్పినప్పటికీ ఆమె ఎవరు అనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు.

Crime News: దారుణ ఘటన.. పొట్టేలును నరకబోయి..! యువకుడి తల నరికేశాడు.. !

Crime News: సంక్రాంతి పండుగ సందర్భంలో ప్రతీ ఒక్కరి ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే. కొంతమంది వారి ఆర్థిక స్థోమతకు తగ్గట్టుగా చికెన్, మటన్ , చేపలు ఇలా తెచ్చుకొని ఇంటిల్లిపాది తింటారు. అయితే కొన్ని పల్లెటూర్లలో ఒక నలుగురు.. ఐదుగురు కలిసి.. ఒక గొర్రెను కొనుక్కొని.. దానిని కోసుకొని.. భాగాలు వేసుకొని.. తీసుకుంటారు.

Crime News: దారుణ ఘటన.. పొట్టేలును నరకబోయి..! యువకుడి తల నరికేశాడు.. !

ఇలా ఆ గ్రామంలో ఆ గ్రామస్తులంతా పొట్టేలును కొనుక్కొని దానిని ఎల్లమ్మ గుడి దగ్గరకు తీసుకొచ్చారు. అక్కడ దానికి మొక్కలు చెల్లించుకొని.. అమ్మారికి ఆ పొట్టేలును బలి ఇచ్చేందుకు అన్నీ రెడీ చెసేశారు. ఇక బలి కార్యక్రమంలో అతడు పొట్టేలును నరకబోయి.. పక్కనే ఓ వ్యక్తి తలను నరికేశాడు.

Crime News: దారుణ ఘటన.. పొట్టేలును నరకబోయి..! యువకుడి తల నరికేశాడు.. !

ఆ యువకుడు అక్కిడిక్కడే గిలగిల కొట్టుకొని చనిపోయాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్లితే.. చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని వలసపల్లె గ్రామంలో ఆదివారం రాత్రి పశువుల పండుగ నిర్వహించారు.

కావాలనే చేశారా.. లేదా పొరపాటున జరిగిందా..

గ్రామానికి సమీపంలో ఉన్న ఎల్లమ్మ గుడికి చుట్టుప‌క్క‌ల ప్ర‌జ‌లంతా వెళ్లి పూజ‌లు నిర్వ‌హించారు . మొక్కుల్లో భాగంగా అమ్మవారికి బలి ఇచ్చేందుకు సురేష్ అనే యువ‌కుడు పొట్టేలును తీసుకొని వ‌చ్చాడు. అదే గ్రామానికి చెందిన చలపతి పొట్టేలుని నర‌క‌బోయి.. మద్యం మత్తులో సురేష్ తలను నరికేశాడు. దీంతో సురేష్ కు తీవ్ర రక్తస్రావం కాగా.. అక్కడే కుప్పకూలిపోయాడు. అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే చనిపోయాడు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చ‌ల‌ప‌తిపై హత్య కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటన కావాలనే చేశారా.. లేదా పొరపాటున జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇక ఈ సంక్రాంతి పండుగు బంధువులు, కొత్త అల్లుళ్లతో అంగరంగ వైభవంగా జరగాల్సింది పోయి.. ఇలా విషాదంలో గ్రామం మునిగిపోయింది. ఇక బాధితుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ల ఆర్తనాధాలు వర్ణించలేకుండా ఉన్నాయి. ఈ ఘటన ప్రతీ ఒక్కరినీ కన్నీళ్లు తెప్పిచ్చింది.

దారుణం: భర్తను చంపి జైలుకెళ్లి లొంగిపోయిన భార్య.. ఎక్కడంటే?

ప్రస్తుత కాలంలో భార్య భర్తల మధ్య ఏ చిన్నపాటి మనస్పర్థలు వచ్చినా అవి ఎన్నో సమస్యలకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలోనే తొందరపాటు నిర్ణయం వల్ల ఎందరో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుని చివరికి బిడ్డను ఒంటరి పాలు చేసిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

హైదరాబాదులోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భాగంగా గత కొంత కాలం నుంచి మురళీధర్ రెడ్డి, మౌనిక అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి 11 సంవత్సరాల క్రితం వివాహం జరగగా తొమ్మిది సంవత్సరాల బాబు ఉన్నాడు. గత 11 సంవత్సరాల నుంచి వీరి మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో సంతోషంగా ఉన్నారు.

అయితే గత కొద్దిరోజుల నుంచి భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయంలోనూ మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఇలా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకోవడంతో ఆవేశంలో మౌనిక వంటగదిలో కూరగాయలు కట్ చేసే కత్తితో తన భర్తపై విచక్షణారహితంగా దాడి చేసింది.

ఈ క్రమంలోని తన భర్త పట్ల ఎంతో దారుణంగా ప్రవర్తించిన మౌనిక తిరిగి పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిన విషయం చెప్పి ఆమె పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని తనని అరెస్ట్ చేశారు.

నిండు ప్రాణం బలిగొన్న ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్… వేల మందిలో టెన్షన్..?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు వ్యాక్సిన్లు తొలి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో మంచి ఫలితాలు సాధించగా త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అతిత్వరలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్న వ్యాక్సిన్లలో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా వ్యాక్సిన్ కూడా ఒకటి.

అయితే ఈ వ్యాక్సిన్ ఒక నిండుప్రాణాన్ని బలిగొంది. బ్రెజిల్ వ్యాక్సిన్ తీసుకున్న ఒక వాలంటీర్ మృతి చెందినట్టు నిన్న అధికారిక ప్రకటన చేసింది. బ్రెజిల్ తో పాటు ప్రపంచ దేశాల్లో ఆక్స్ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. కొదీ రోజుల క్రితం ఆక్స్ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఒక వ్యక్తి బ్రిటన్ లో అనారోగ్యానికి గురి కాగా క్లినికల్ ట్రయల్స్ తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. అయితే ప్రస్తుతం మరోసారి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి మృతి చెందడంతో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ సురక్షితమేనా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఆ వ్యక్తి కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే మృతి చెందాడా..? ఆ వ్యక్తి మృతికి ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అనే విషయాలు తెలియాల్సి ఉంది. అయితే వాలంటీర్ మృతి చెందినా క్లినికల్ ట్రయల్స్ ఆగవని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ మృతి చెందడంతో ఆ వ్యాక్సిన్ ను తీసుకున్న ఇతర వాలంటీర్లు సైతం ఆందోళనకు గురవుతున్నారు.

ఆక్స్‌ఫర్డ్‌ ప్రతినిధి అలెగ్జాండర్‌ బక్స్‌టన్‌ ఈ ఘటన గురించి స్పందిస్తూ వ్యాక్సిన్ భద్రత గురించి అనుమానాలు, అపోహలు అవసరం లేదని చెప్పారు. అయితే వాలంటీర్ మృతి చెందినంత మాత్రాన ప్రయోగాలు నిలిపివేయాల్సిన అవసరం ఐతే ప్రస్తుతానికి లేదని ఆయన వ్యాఖ్యానించారు.