Crime News: నెల రోజులు కాపుకాసి.. 10 నిమిషాల్లో ఖతం.. హైదరాబాద్ పరువు హత్య నిందితులు అరెస్ట్!
Crime News: హైదరాబాద్ లో బుధవారం సాయంత్రం పరువు హత్య జరిగిన సంగతి మనకు తెలిసిందే. వికారాబాద్ జిల్లా మర్పల్లికి చెందిన బిల్లిపురం నాగరాజు (25), ఆశ్రిన్ సుల్తానా ప్రేమించుకొని జనవరి నెలలో ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆశ్రిన్ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని వీరిద్దరూ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లిపోయారు. అయితే తమ కోసం తమ కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టలేదని తెలుసుకున్న ఈ జంట తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
వీరిద్దరూ హైదరాబాద్ వచ్చారని తెలుసుకున్న ఆశ్రిన్ సోదరుడు అతని బావ వీరి కదలికలను అనుసరిస్తూ బుధవారం సాయంత్రం నాగరాజు పై దాడి చేసి చంపిన సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా హైదరాబాదులో జరిగిన ఈ పరువు హత్య ఒక్కసారిగా సంచలనం అయింది. కులాంతర వివాహం చేసుకోవడంతో వీరి పై పగ పెంచుకున్న ఆశ్రిన్ సోదరుడు నెలరోజులపాటు వీరి కోసం గాలించి చివరికి బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంలో బయటకు వెళ్లిన ఇతనిపై ఆశ్రిన్ సోదరుడు ఆమె భావ దాడి చేసి దారుణంగా చంపారు.
కేవలం పది నిమిషాల్లోనే నాగరాజు పై దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా
ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి సారథ్యంలో పోలీసులు గాలించి నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ హత్యలో భాగంగా ఆశ్రిన్ సోదరుడు ఆమె రెండవ అక్క భర్తతో కలిసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ సందర్భంగా డీసీపీ సన్ప్రీత్సింగ్ మాట్లాడుతూ నాగరాజు ఎస్సీ వర్గానికి చెందిన వారు కావడంతో ప్రభుత్వ పరిహారం అతడి కుటుంబానికి చేరుతుందని డీసీపీ సన్ప్రీత్సింగ్ తెలిపారు. తన కొడుకు మృతి చెందడంతో నాగరాజు కుటుంబసభ్యులు ఆశ్రిన్ను తమ వెంట మర్పల్లి తీసుకెళ్లారు.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…