Tag Archives: kumari aunty

Kumari Aunty: నేనేంటో నాకే తెలియదు… ఈ ప్రపంచాన్ని నాకు చూపించారు: కుమారి ఆంటీ

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు ఈమె హైదరాబాద్లో ఒక ఫుడ్ స్టాల్ బిజినెస్ చేస్తూ ఎంతో మంది ఆకలి నింపడమే కాకుండా ఆ బిజినెస్ ద్వారా తన ఫోటో కూడా నింపుకునేవారు ఇదే జీవనోపాధిగా కొనసాగుతూ ఉన్నటువంటి కుమారి అంటే ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఈమె ఫుడ్ స్టాల్ వద్దకు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్లి ఆమెను ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా ఈమె ఫేమస్ అయ్యారు.

ఇలా ఈమె మాట తీరుతో ఏకంగా ఒక డిజే సాంగ్ కూడా క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా కుమారి ఆంటీ ప్రెస్ రోజురోజుకు భారీగా పెరిగిపోతుంది. ఇక ఇటీవల కాలంలో ఈమె బుల్లితెర కార్యక్రమంలో కూడా సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాదులో జరిగిన డిజిటల్ మీడియా ఫ్యాక్టరీ కార్యక్రమంలో భాగంగా ఈమె పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కుమారి ఆంటీ మాట్లాడుతూ అసలు నేనెక్కడున్నాను ఏం చేస్తున్నాను అనే విషయాల గురించి నాకే సరిగా తెలియదు. ప్రపంచం అంటే ఏంటో తెలియని నాకు ఈ ప్రపంచాన్ని పరిచయం చేశారు. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే అందుకు కారణం సోషల్ మీడియా అంటూనే ఈమె అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

చదువు పని లేదు..
ఇలా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయినటువంటి కుమారి అండి అనంతరం ఒక పద్యాన్ని కూడా పాడారు ఈ పద్యం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని చెప్పాలి మనిషికి ఒక ఆశయం ఉంటే చదువుతో పనిలేదని ఆశయ సాధన కోసం కష్టపడితే లక్ష్యాన్ని చేరుతారని ఈమె ఒక పద్యం రూపంలో ఎంతో స్ఫూర్తి దాయకమైనటువంటి వ్యాఖ్యలను చేస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Kumari Aunty: సీరియల్ నటి కీర్తికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన కుమారి ఆంటీ.. ఏమైందంటే?

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు రోడ్డు పక్కన ఫుడ్ బిజినెస్ నడుపుకుంటూ జీవనం గడుపుతున్నటువంటి ఈమె ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయారు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈమెను ఇంటర్వ్యూ చేయడంతో ఈమెకు భారీ స్థాయిలో పాపులారిటీ వచ్చింది ఎంతోమంది పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈమె వద్ద ఫుడ్ తినే వాళ్ళు అంటే తన క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇలా ఫుడ్ బిజినెస్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి కుమారి ఆంటీ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలతో పాటు బుల్లితెర సీరియల్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఇలా ఫుడ్ బిజినెస్ జరుపుకుంటూ జీవనాన్ని గడుపుతున్నటువంటి ఈమె పట్ల బిగ్ బాస్ బ్యూటీ సీరియల్ ఆర్టిస్ట్ కీర్తి భట్ సంచలనమైన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

కుమారి ఆంటీ వద్ద ఫుడ్ బాగుందని తెలిసి మేము ఇక్కడికి వచ్చాము అయితే అక్కడ ఫుడ్ ఏ మాత్రం బాగాలేదని చికెన్ మొత్తం చాలా కారంగా రుచి లేకుండా చేశారని తనకంటే నేనే వంట బాగా చేస్తానని ఈమె చేసినటువంటి వీడియో కుమారి ఆంటీ బిజినెస్ పై భారీ దెబ్బ పడిందని చెప్పాలి అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా కుమారి ఆంటీ స్పందించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీర్తి గారు అక్కడికి వచ్చినప్పుడు నేను అక్కడ లేను. వేరే ఊరికి వెళ్లాను దాంతో ఆరోజు వంట నేను చేయలేదు. అయినా మహిళలు వంట చేయడానికి మగవాళ్ళు వంట చేయడానికి చాలా తేడా ఉంటుందని తెలిపారు. ఇక ఆమె నా గురించి అలా మాట్లాడిన నేను తప్పుగా భావించను ఎందుకంటే నేను చేసే వంటలు అందరికీ నచ్చాలని రూల్ ఏమి లేదని ఈమె తెలిపారు.

అందరికీ నచ్చాలని లేదు…
ఈ విధంగా కీర్తి తన బిజినెస్ దెబ్బతీసేలా తన యూట్యూబ్ ఛానల్ వ్యూస్ పెరిగేలా కుమారి ఆంటీ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కుమారి ఆంటీ మాత్రం చాలా హుందాగా వ్యవహరించారు. దీంతో ఈమె వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ చదువుకో లేకపోయినా కుమారి ఆంటీ హుందాతనం ముందు నువ్వు వేస్ట్ అని కేవలం నీ స్వార్థం కోసం ఆమెపై ఇలాంటి వ్యాఖ్యలు చేశావంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Kumari Aunty: కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు హైదరాబాద్లో రోడ్డు పక్కన ఫుడ్ పాత్ పై ఈమె ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ కాలం గడిపేది అయితే ఈమె వద్దకు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్లి తనని ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. దీంతో సెలబ్రిటీలు కూడా ఆమె ఫుడ్ స్టాల్ వద్దకు రావడం మొదలుపెట్టారు. ఇలా కుమారి ఆంటీ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.

కుమారి ఆంటీ బిజినెస్ రోజు రోజుకు పెరుగుతూ పోయింది. ఈమె వద్ద తక్కువ ధరకే ఎంతో రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను కడుపునిండా తినవచ్చు అనే విధంగా రివ్యూలు కూడా ఇవ్వడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా కుమారి ఆంటీ వద్ద ఫుడ్డు తినడం కోసం వచ్చేవారు అంటే తనకు ఎంత పాపులారిటీ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే ఇటీవల కాలంలో ఈమె ఏకంగా బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలలో కనిపించి ఈమె సెలబ్రిటీ హోదాని కూడా అందుకున్నారు. ఈ విధంగా కుమారి ఆంటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో పాపులర్ సెలబ్రిటీగా కొనసాగుతున్నారు. ఇలా రోజుకు ఇంతమంది కస్టమర్లు ఈమె ఫుడ్ స్టాల్ వద్ద ఫుడ్ తింటూ ఉండడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే ఈమెకు నెలకు ఎంత మొత్తంలో ఆదాయం ఉంటుంది అన్న సందేహాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి.

లక్షల్లో ఆదాయం…

ఈ క్రమంలోనే కుమారి ఆంటీ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన నెల సంపాదన గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను ప్రతిరోజు చేసే ఆహార పదార్థాలు అలాగే అక్కడ పనిచేసే వారికి ఇచ్చే ఖర్చులన్నీ పోను నెలకు లక్షన్నర వరకు మిగులుతుంది అంటూ ఈ సందర్భంగా కుమారి ఆంటీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన నేటిజన్స్ ఉద్యోగం కంటే ఈ వ్యాపారమే బాగుందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Kumari Aunty: ఒక వీడియోతో కుమారి ఆంటీ బిజినెస్ పై దెబ్బ కొట్టిన బిగ్ బాస్ కీర్తి.. దారుణంగా ఉందంటూ?

Kumari Aunty: కుమారి ఆంటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు హైదరాబాద్లో ఫుట్ పాత్ పై ఫుడ్ బిజినెస్ జరుపుకుంటూ ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె ఏకంగా సెలబ్రిటీ రేంజ్ లో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఈ పాపులారిటీతో ఏకంగా ఈమె బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.

అత్యంత తక్కువ ధరలకు ఎంతో రుచికరమైనటువంటి వివిధ రకాల ఆహార పదార్థాలతో కడుపునిండా భోజనం పెడుతూ అందరినీ ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఈమె పాపులర్ అయ్యారు ఈమె గురించి ఎన్నో ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తనని ఇంటర్వ్యూ చేస్తూ తన గురించి చెప్పడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా పలువురు ఈమె వద్ద టెస్ట్ చేయడం కోసం వచ్చేవారు.

ఇలా ఎంతో ఫేమస్ అయినటువంటి కుమారి ఆంటీ గురించి తాజాగా బుల్లితెర నటి బిగ్ బాస్ బ్యూటీ కీర్తి భట్ చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటీవల బిగ్ బాస్ కీర్తి తనకు కాబోయే భర్త విజయ్ కార్తీక్ తో కలసి కుమారి ఆంటీ వద్ద భోజనం చేయడానికి వెళ్ళారు. అయితే వీరు వెళ్లిన సమయంలో కుమారి ఆంటీ లేదని 170 రూపాయలకు వైట్ రైస్ చికెన్ కర్రీ తిన్నామని భోజనం ధర చాలా ఎక్కువగా ఉందని ఈమె తెలిపారు.

రుచి పెద్దగా లేదు…

ఇక ఆ ఫుడ్ తినడానికి పెద్దగా రుచి లేదని దారుణంగా ఉందని తెలిపారు. ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే అసలు తినాలనిపించక పడేసామని మరో ఫుడ్ స్టాల్ వద్దకు వెళ్లి అక్కడ భోజనం చేశామని అది కాస్త బెటర్ గా ఉందని ఈమె తెలిపారు. కుమారి ఆంటీ కంటే నేనే వంట బాగా చేస్తానని కీర్తి తెలిపారు. ఇలా కీర్తి కుమారి ఆంటీ వద్ద ఫుడ్ బాగాలేదు అంటూ చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈమెకు మద్దతు తెలుపుగా మరికొందరు విమర్శిస్తున్నారు. మొత్తానికి ఈ ఒక్క వీడియోతో కుమారి ఆంటీ బిజినెస్ పై దెబ్బపడిందని చెప్పాలి


Kumari Aunty: మరో బుల్లితెర షోలో సందడి చేసిన కుమారి ఆంటీ…ఈమెను నాశనం చేసేదాకా వదిలేలా లేరే?

Kumari Aunty: నాన్న బుజ్జి కన్నా అంటూ తన ఫుడ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుపుకుంటూ ఎంతో పాపులర్ అయినటువంటి వారిలో కుమారి ఆంటీ ఒకరు. ఈమె హైదరాబాద్లో ఫుట్ పాత్ పక్కన బిజినెస్ జరుపుకుంటూ ఎంతో పాపులర్ అయ్యారు. ఈమె పాపులారిటీ ఎంత అంటే ఏకంగా టీవీ షోస్ లో వచ్చే అంత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఈమె పేరుతో డిజె సాంగ్ క్రియేట్ చేసే అంతగా పాపులర్ అయ్యారు.

ఇలా ఫుడ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుపుకుంటూ ఉన్నటువంటి ఈమెను ఏకంగా బుల్లితెర సెలబ్రిటీగా మార్చేశారు. ఇటీవల బిగ్ బాస్ ఉత్సవం కార్యక్రమంలో సందడి చేస్తున్నటువంటి కుమారి అంటే తాజాగా ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా సందడి చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ కార్యక్రమంలో 90s వెబ్ సిరీస్ టీం కూడా పాల్గొని సందడి చేశారు. ఇక కుమారి ఆంటీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎప్పటిలాగే అందరికీ నాన్న బుజ్జి అంటూ ఫుడ్ పెడుతూ సందడి చేశారు. ఇలా ఈమె ఆ నాన్న ఏం కావాలి చెప్పు అంటూ మాట్లాడటంతో హైపర్ ఆది కలుగజేసుకొని ఇదే అసలైన బిజినెస్ ట్రిక్ అంటూ ఆమెపై సెటైర్ వేశారు.

అసలైన బిజినెస్ ట్రిక్..

ఇలా కుమారి ఆంటీ తాజాగా ఈ కార్యక్రమంలో కనిపించడంతో పలువురు ఈమె పట్ల వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏమైనా బుల్లితెర కార్యక్రమాలకు తీసుకువచ్చి తన బిజినెస్ మరింత పాపులర్ చేశారని కామెంట్లు చేయగా మరికొందరు ఈమెను ఇలా తీసుకువచ్చి సెలబ్రిటీ వచ్చేసి తర్వాత తనకు తన బిజినెస్ పట్ల కూడా ఆసక్తి లేకుండా చేస్తున్నారని ఇలా ఇప్పటికే ఎంతోమంది జీవితాలతో బుల్లితెర షోస్ ఆడుకున్నాయని ఇప్పుడు ఈమెను కూడా నాశనం చేసే వరకు వదిలేలా లేరే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Kumari Aunty: శ్రీదేవి డ్రామా కంపెనీలోకి కుమారి ఆంటీ.. ఒక్క దెబ్బతో సెలబ్రిటీ అయ్యిందిగా?

Kumari Aunty: కుమారి ఆంటీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మారుమోగిపోతున్నటువంటి పేరు. రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ పెట్టుకొని జీవనం గడుపుతూ ఉన్నటువంటి ఈమెను సోషల్ మీడియా వాళ్ళు భారీ స్థాయిలో ప్రమోట్ చేశారు. ఎన్నో యూట్యూబ్ ఛానల్ ఈమె వద్దకు వెళ్లి ఇంటర్వ్యూ చేయడంతో భారీగా పాపులర్ అయింది.

ఇకపోతే ఇటీవల ఈమె ఫుడ్ బిజినెస్ కి భారీగా డిమాండ్ రావడంతో ఏకంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ట్రాఫిక్ పోలీసులు ఈమె ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేయించారు అయితే సీఎం రేవంత్ రెడ్డి చొరవతో తిరిగి ప్రారంభించారు. ఇలా రేవంత్ రెడ్డి వరకు ఈమె విషయం వెళ్లడంతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.

ఇకపోతే తాజాగా ఈమె ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఉండగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి వెళ్లబోతున్నారనే విషయాన్ని చెప్పకనే చెప్పేశారు యాంకర్ మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కనిపించబోతున్నారని తెలుస్తోంది అసలు ఎప్పుడు మీకు కాల్ చేశారు ఎప్పుడు వెళ్తున్నారు అంటూ ప్రశ్నించగా ఈమె మాత్రం నవ్వుతూ దయచేసి ఇవేవీ అడగకండి అంటూ సమాధానం చెప్పారు.

సెలబ్రిటీగా మారిన కుమారి ఆంటీ…

ఈ విధంగా కుమారి ఆంటీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకోవడంతోనే ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఫుడ్ బిజినెస్ ద్వారా పాపులర్ అయ్యి అదే పాపులారిటీతో బిజినెస్ క్లోజ్ అయ్యి సీఎం చొరవతో తిరిగి ఫుడ్ బిజినెస్ ప్రారంభించిన ఈమె భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. దీంతో ఏకంగా సెలబ్రిటీ హోదా దక్కించుకున్నారని చెప్పాలి.

Revanth Reddy: రేవంత్ రెడ్డి ఆదేశాలతో తీరిన కుమారి ఆంటీ కష్టాలు.. మరింత పాపులర్ అయిన కుమారి ఆంటీ?

Revanth Reddy: కుమారి ఆంటీ ఇటీవల కాలంలో ఎంతో ఫేమస్ అయ్యారు ఫుట్ పాత్ పక్కన ఫుడ్ స్టాల్ నిర్వహిస్తూ జీవనోపాధి కోసం కష్టాలు పడుతున్నటువంటి ఈమె యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అత్యంత తక్కువ ధరలకు ఎన్నో రకాల వెరైటీ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నింటిని కూడా ఈమె అందరికీ అందించడంతో ఈమె వద్దకు ఎంతోమంది సెలబ్రిటీల నుంచి మొదలుకొని సాధారణ వ్యక్తులు కూడా వచ్చి భోజనం చేసేవారు.

అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కస్టమర్స్ రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యేది దీంతో కొందరు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈమె ఫుడ్ స్టాల్ క్లోజ్ చేసేసారు. దీంతో ఈమె బిజినెస్ పూర్తిగా క్లోజ్ అయిందని అందరూ భావించారు అంతేకాకుండా ఈమెకు మద్దతుగా కొందరు నిలిచారు.

తాజాగా ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో రేవంత్ రెడ్డి తిరిగి ఈమె ఫుడ్ స్టాల్ నిర్వహించుకోవచ్చు అంటూ ఆదేశాలను జారీ చేశారు ఫుట్ పాత్ మీద వ్యాపారాలు చేసుకునే వారి పట్ల చూసి చూడకుండా వెళ్లాలి అంటూ ఈయన ట్రాఫిక్ పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో కుమారి ఆంటీ కష్టాలు మొత్తం తీరిపోయాయని తెలుస్తుంది.

కుమారి ఆంటీకి అండగా సీఎం రేవంత్…

ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు మేరకు ఈమె తిరిగి తన ఫుడ్ బిజినెస్ ప్రారంభం చేస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా అండగా నిలవడంతో కుమారి ఆంటీ పాపులారిటీ మరింత పెరిగిపోయింది అని చెప్పాలి. కుమారి ఆంటీ మాటతీరుతో ఎంతోమంది రీల్స్ కూడా చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నటువంటి ఈమెకు చివరికి ఆ పాపులారిటీ ద్వారానే తన బిజినెస్ క్లోజ్ చేసుకునే పరిస్థితికి వెళ్లారు కానీ సీఎం చొరవతో ఏదావిధిగా తన బిజినెస్ ప్రారంభించారు.