Revanth Reddy: కుమారి ఆంటీ ఇటీవల కాలంలో ఎంతో ఫేమస్ అయ్యారు ఫుట్ పాత్ పక్కన ఫుడ్ స్టాల్ నిర్వహిస్తూ జీవనోపాధి కోసం కష్టాలు పడుతున్నటువంటి ఈమె యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అత్యంత తక్కువ ధరలకు ఎన్నో రకాల వెరైటీ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నింటిని కూడా ఈమె అందరికీ అందించడంతో ఈమె వద్దకు ఎంతోమంది సెలబ్రిటీల నుంచి మొదలుకొని సాధారణ వ్యక్తులు కూడా వచ్చి భోజనం చేసేవారు.
అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కస్టమర్స్ రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యేది దీంతో కొందరు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈమె ఫుడ్ స్టాల్ క్లోజ్ చేసేసారు. దీంతో ఈమె బిజినెస్ పూర్తిగా క్లోజ్ అయిందని అందరూ భావించారు అంతేకాకుండా ఈమెకు మద్దతుగా కొందరు నిలిచారు.
తాజాగా ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో రేవంత్ రెడ్డి తిరిగి ఈమె ఫుడ్ స్టాల్ నిర్వహించుకోవచ్చు అంటూ ఆదేశాలను జారీ చేశారు ఫుట్ పాత్ మీద వ్యాపారాలు చేసుకునే వారి పట్ల చూసి చూడకుండా వెళ్లాలి అంటూ ఈయన ట్రాఫిక్ పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో కుమారి ఆంటీ కష్టాలు మొత్తం తీరిపోయాయని తెలుస్తుంది.
కుమారి ఆంటీకి అండగా సీఎం రేవంత్…
ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు మేరకు ఈమె తిరిగి తన ఫుడ్ బిజినెస్ ప్రారంభం చేస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా అండగా నిలవడంతో కుమారి ఆంటీ పాపులారిటీ మరింత పెరిగిపోయింది అని చెప్పాలి. కుమారి ఆంటీ మాటతీరుతో ఎంతోమంది రీల్స్ కూడా చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నటువంటి ఈమెకు చివరికి ఆ పాపులారిటీ ద్వారానే తన బిజినెస్ క్లోజ్ చేసుకునే పరిస్థితికి వెళ్లారు కానీ సీఎం చొరవతో ఏదావిధిగా తన బిజినెస్ ప్రారంభించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…