Revanth Reddy: కుమారి ఆంటీ ఇటీవల కాలంలో ఎంతో ఫేమస్ అయ్యారు ఫుట్ పాత్ పక్కన ఫుడ్ స్టాల్ నిర్వహిస్తూ జీవనోపాధి కోసం కష్టాలు పడుతున్నటువంటి ఈమె యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అత్యంత తక్కువ ధరలకు ఎన్నో రకాల వెరైటీ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నింటిని కూడా ఈమె అందరికీ అందించడంతో ఈమె వద్దకు ఎంతోమంది సెలబ్రిటీల నుంచి మొదలుకొని సాధారణ వ్యక్తులు కూడా వచ్చి భోజనం చేసేవారు.
అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కస్టమర్స్ రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యేది దీంతో కొందరు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈమె ఫుడ్ స్టాల్ క్లోజ్ చేసేసారు. దీంతో ఈమె బిజినెస్ పూర్తిగా క్లోజ్ అయిందని అందరూ భావించారు అంతేకాకుండా ఈమెకు మద్దతుగా కొందరు నిలిచారు.
తాజాగా ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో రేవంత్ రెడ్డి తిరిగి ఈమె ఫుడ్ స్టాల్ నిర్వహించుకోవచ్చు అంటూ ఆదేశాలను జారీ చేశారు ఫుట్ పాత్ మీద వ్యాపారాలు చేసుకునే వారి పట్ల చూసి చూడకుండా వెళ్లాలి అంటూ ఈయన ట్రాఫిక్ పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో కుమారి ఆంటీ కష్టాలు మొత్తం తీరిపోయాయని తెలుస్తుంది.
కుమారి ఆంటీకి అండగా సీఎం రేవంత్…
ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు మేరకు ఈమె తిరిగి తన ఫుడ్ బిజినెస్ ప్రారంభం చేస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా అండగా నిలవడంతో కుమారి ఆంటీ పాపులారిటీ మరింత పెరిగిపోయింది అని చెప్పాలి. కుమారి ఆంటీ మాటతీరుతో ఎంతోమంది రీల్స్ కూడా చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నటువంటి ఈమెకు చివరికి ఆ పాపులారిటీ ద్వారానే తన బిజినెస్ క్లోజ్ చేసుకునే పరిస్థితికి వెళ్లారు కానీ సీఎం చొరవతో ఏదావిధిగా తన బిజినెస్ ప్రారంభించారు.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…