Tag Archives: Lakshmi Manchu

Lakshmi Manchu: అనుష్క వల్ల కోట్ల రూపాయలు నష్టపోయాను.. మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు..?

Lakshmi Manchu: ప్రముఖ నటుడు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అనగనగా ఒక ధీరుడు సినిమా ద్వారా విలన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన లక్ష్మీ ప్రసన్న ఆ తర్వాత కొన్ని సినిమాలలో హీరోయిన్గా కూడా నటించింది. అంతేకాకుండా బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో టీవీ షోలలో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించి ఆకట్టుకుంది. ఇలా సినిమాలు, టీవీ షోల ద్వారా మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా లక్ష్మి మంచు బాగా పాపులర్ అయింది.

ఎందుకంటే సోషల్ మీడియాలో మంచు లక్ష్మి మీద వచ్చినన్ని మీన్స్ మరి ఏ సెలబ్రిటీ మీద కూడా రాలేదు. లక్ష్మీ మంచు ఏం చేసినా కూడా తప్పుపడుతూ ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి ప్రసన్న హీరోయిన్ అనుష్క గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అనుష్క వల్ల తనకి కోట్ల రూపాయల నష్టం వచ్చిందని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఎన్నో టాక్ షోలలో హోస్ట్ గా వ్యవహరించిన లక్ష్మి ఎంతోమంది సెలబ్రిటీలతో ముచ్చటించింది.

ఈ క్రమంలో టాక్ షోలలో హోస్ట్ గా వ్యవహరించేందుకు అనేక అవకాశాలు వస్తున్నప్పటికీ వాటిని తిరస్కరించినట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ వెల్లడించింది. మాట్లాడిన వాళ్ళతోనే ఎన్ని సార్లు మాట్లాడాలి అని నాకు బోర్ కొట్టి నేను చెయ్యను మొహం మీదనే చెప్పేసేదానిని అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. ఇక ఈ క్రమంలో ఒక టాక్ షో నిర్వహిస్తున్నప్పుడు ప్రముఖ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిని గెస్ట్ గా ఆహ్వానించి అధిక మొత్తంలో నష్టపోయినట్లు తెలిపింది.

Lakshmi Manchu: మూడు కోట్ల నష్టం…

ఒక టాక్ షోకి అనుష్క శెట్టిని ఒక వారం ముఖ్య అతిథిగా ఆహ్వానించామని, ఆమె ముందుగా వస్తానని చెప్పటంతో ఆమె కోసం భారీగా ఏర్పాట్లు కూడా చేసుకున్నాము అంటూ తెలిపింది . వాటి కోసం మూడు కోట్ల రూపాయిలు ఖర్చు చేసినట్లు తెలిపింది. కానీ ఆ వారం ఆమెకి భాగమతి షూటింగ్ షెడ్యూల్ సడన్ గా ప్లాన్ చెయ్యడం వల్ల మా షో కి రాలేకపోయింది. దాంతో మాకు మూడు కోట్లు నష్టం వచ్చింది అంటూ లక్ష్మి ప్రసన్న చెప్పుకొచ్చింది.

Manchu Lakshmi: ఇంత ఘనత సాధించిన ఎన్టీఆర్ ను మర్చిపోవడం ఏంటి… లక్ష్మీ మంచు పోస్ట్ వైరల్!

Manchu Lakshmi: మోహన్ బాబు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి వరుస సినిమాలు టాక్ షోలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మి తాజాగా సోషల్ మీడియా వేదికగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎన్టీఆర్ చివరిగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ పలు సినిమాలకు కమిట్ అయిన ఇంకా షూటింగ్ పనులను ప్రారంభించుకోలేదు అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాకి దర్శకత్వం వహించినందుకుగాను ఉత్తమ దర్శకుడుగా న్యూయార్క్ ఫిలిం సర్కిల్స్ నుంచి రాజమౌళి ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్నారు. అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ బెస్ట్ యాక్టర్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చోటు సంపాదించుకున్నారు.

ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రముఖులతో పోటీపడి ఎన్టీఆర్ పోటీపడి టాప్ టెన్ పొజిషన్లో ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదని చెప్పాలి. ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో ఏ సెలబ్రిటీ కూడా ఇలాంటి ఘనత సాధించలేదు. మరి ఇలాంటి ఘనత సాధించిన ఎన్టీఆర్ ను సెలబ్రిటీలు మీడియా ఏమాత్రం పట్టించుకోలేదని మంచు లక్ష్మి మండిపడ్డారు.

Manchu Lakshmi: ఈ ఘనతను సెలబ్రేట్ చేసుకోవాలి…

ఈ సందర్భంగా ఈ విషయం గురించి మంచు లక్ష్మి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ చిన్నపాటి అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు మనం దీన్ని సెలబ్రేట్ చేసుకోకూడదు. ప్రపంచ సినీ చరిత్రలో ఎన్టీఆర్ సాధించిన ఘనత చిన్న విషయమేమీ కాదు. తారక్ సాధించిన ఈ ఘనతకు మీ నుంచి విజిల్స్, చప్పట్లు రావాలి అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.