Manchu Lakshmi: మోహన్ బాబు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి వరుస సినిమాలు టాక్ షోలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మి తాజాగా సోషల్ మీడియా వేదికగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎన్టీఆర్ చివరిగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ పలు సినిమాలకు కమిట్ అయిన ఇంకా షూటింగ్ పనులను ప్రారంభించుకోలేదు అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఈ సినిమాకి దర్శకత్వం వహించినందుకుగాను ఉత్తమ దర్శకుడుగా న్యూయార్క్ ఫిలిం సర్కిల్స్ నుంచి రాజమౌళి ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్నారు. అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ బెస్ట్ యాక్టర్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చోటు సంపాదించుకున్నారు.
ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రముఖులతో పోటీపడి ఎన్టీఆర్ పోటీపడి టాప్ టెన్ పొజిషన్లో ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదని చెప్పాలి. ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో ఏ సెలబ్రిటీ కూడా ఇలాంటి ఘనత సాధించలేదు. మరి ఇలాంటి ఘనత సాధించిన ఎన్టీఆర్ ను సెలబ్రిటీలు మీడియా ఏమాత్రం పట్టించుకోలేదని మంచు లక్ష్మి మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఈ విషయం గురించి మంచు లక్ష్మి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ చిన్నపాటి అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు మనం దీన్ని సెలబ్రేట్ చేసుకోకూడదు. ప్రపంచ సినీ చరిత్రలో ఎన్టీఆర్ సాధించిన ఘనత చిన్న విషయమేమీ కాదు. తారక్ సాధించిన ఈ ఘనతకు మీ నుంచి విజిల్స్, చప్పట్లు రావాలి అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…