Tag Archives: life style

Life Style: దాహం వేసి చచ్చిపోతున్నా ఈ పక్షి నీళ్లు తాగదు..! ఎందుకో తెలుసా..!

Life Style: భూమిపై బతికి ఉన్న ప్రతీ జీవికి తినడానికి తిండి.. తాగడానికి నీళ్లు.. బతకడానికి గాలి అత్యంత అవసరం. ఈ మూడు యూనివర్సల్ నీడ్స్ అంటారు. ఇవి ఉంటే.. ఏ జీవి అయినా ఈ భూమిపై బతకొచ్చు. అలా అయితే ఈ ధరణిపై మనుగడ సాగుతుంది.

Life Style: దాహం వేసి చచ్చిపోతున్నా ఈ పక్షి నీళ్లు తాగదు..! ఎందుకో తెలుసా..!

ఎంత దాహం వేసినా.. చచ్చిపోవాల్సి వచ్చినా.. నీరు తాగకుండా ఉంటే ఓ పక్షి ఉందన్న సంగతి మీకు తెలుసా.. దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో మాత్రమే జీవించే చాతక పక్షి గురించి చాలామందికి తెలియకపోవచ్చు.

Life Style: దాహం వేసి చచ్చిపోతున్నా ఈ పక్షి నీళ్లు తాగదు..! ఎందుకో తెలుసా..!

ఇది మన దేశంలో ఎక్కువగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కనిపిస్తుంది. దీనిని అక్కడి స్థానికులు ఎక్కువగా చోళీ అని పిలుస్తుంటారు. ఉత్తరాఖాండ్ లోని ఎక్కువగా ఈ పక్షులు గర్వాల్ అనే ప్రాంతంలో నివసిస్తాయి. ఇక ఈ పక్షికి తాగమని నీళ్లు ఇచ్చినా.. నది లేదా చెరువు వద్దకు వెళ్లి ఉంచినా.. ఈ పక్షి నీళ్లను తాగదు.


ఇది నీరు తాగే సమయంలో ముక్కును..

మరి నీరు తగకుండా ఈ భూమిపై ఏ జీవి మనుగడ ఉండదు కదా.. మరి అది ఎలా బతుకుతుంది అనే అనుమానం మనకు కలగొచ్చు. పాయింట్ కి వస్తే.. అది నీరు తాగుతుంది.. ఎప్పుడంటే.. వర్షపు నీటిని మాత్రమే అది తాగుతుంది. ఇది నీరు తాగే సమయంలో ముక్కును తెరవదట. అది స్వాతి నక్షత్రంలో కురిసే నీటిని మాత్రమే తాగుతుందని స్థానికులు చెబుతుంటారు. అంతే కాదు దాని చూపు అంతా ఆకాశం వైపు మాత్రమే ఉంచుతుందట. ఇలా ఈ పక్షికి ఎంత దాహం వేసినా ఓర్చుకుంటుంది కానీ.. ఏ సరస్సుల్లో నీరు మాత్రం తాగదు. ఇక ఈ పక్షిని మార్వాడీలో మఘ్వా లేదా పాపియా అని కూడా అంటారట. భలే వింతగా ఉంది కదా.

సన్నగా ఉండే వాళ్లు వ్యాయామం, ఎక్సర్‌సైజ్‌లు చేయొచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?

చాలామంది బరువు లేదా లావు ఎక్కువగా ఉన్నవాళ్లు మాత్రమే వ్యాయామం చేస్తారని.. సన్నగా ఉన్నవాళ్లకు అవసరం లేదు అని అనకుంటుంటారు. కానీ అది నిజం కాదు. వ్యాయామం అనేది ప్రతీ ఒక్కరికీ అవసరమే. సన్నగా ఉండే వారికి లావుగా ఉండే వారికి వచ్చే సమస్యలు రాకపోవచ్చు కానీ.. మరేదైనా ఇతర సమస్యల వచ్చే అవకాశం ఉంటుంది.

అందుకే వ్యాయామంతో పాటు.. డైట్ అనేది సన్నగా ఉండే వారికి కూడా అవసరం అని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే.. సన్నగా ఉండేవారు కోచ్‌ ఆధ్వర్యంలో ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. వాళ్ల బాడీని సిక్స్ ప్యాక్ గా మార్చుకోవాలంటే.. తప్పనిసరిగా.. కోచ్ సమక్షంలోనే చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక స్కిప్పింగ్ విషయానికి వస్తే.. దీనిని ఎవరైనా చేయొచ్చు.. లావుగా ఉండేవారైనా.. సన్నగా ఉండేవారికైనా మంచిదే.

ఎనిమిది నిమిషాల నడక చేస్తే.. 10 నిమిషాల స్కిప్పింగ్ తో సమానం. స్కిప్పింగ్ తాడు ఎంచుకునే సమయంలో జాగ్రత్తగా ఉండలి. మన ఎత్తు కంటే అది రెండింత్తలు ఉండాలి. ఈ స్కిప్పింగ్ అనేది సన్నగా ఉన్నవాళ్లు చేయొచ్చు. దీనికి ఎలాంటి కోచ్ లు అవసరం లేదు. ఇక నడక విషయానికి వస్తే.. ఎవరైనా చేయొచ్చు.

ఇలా చేస్తే ఆరోగ్యానికి మంచిది. తిన్న అన్నం జీర్ణం అవుతుంది. అంతే కాకుండా.. కండరాలకు, నరాలకు కాస్తంగా రిలాక్స్ గా అనిపిస్తుంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ లాంటివి దరి చేరకుండా ఉంటాయి. రోజూ అరగంట వాకింగ్‌ చేస్తే పెద్ద పేగు క్యాన్సర్‌ వచ్చే ముప్పు చాలావరకు తగ్గుతుందట.

ఔషదగుణాలున్న వేపకు పెరుగును కలిపితే.. దాని ఫలితం ఎంతో అద్భుతం..!

వేపచెట్టు అనేది ప్రతీ సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది. దీనిలో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. వేప యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ సెఫ్టిక్.. ఇంకా చెప్పాలంటే ట్యూమర్, అల్సర్, మలేరియా, ఆక్సిడెంట్ లను నిరోధించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మరక్షణకు, వెంట్రులకు ఆరోగ్యంగా ఉంచటానికి ఉపయోగపడుతుంది.

ఇక సహజంగా మన ఇళ్లలో ధాన్యం నిల్వచేసేందుకు, పొలాలలో ఎరువుగా కూడా వేప ఆకులను వాడతారు. అయితే ఇంతటి ఉపయోగాలు ఉన్న వేపకు పెరుగును వారానికి 3 లేదా 4 సార్లు కలపడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. రెండు చెంచాలు వేప ఆకులను పేస్ట్ చేసి..పెరుగుతో కలిపి ఉంచాలి. దీనిని చర్మానికి పట్టించినట్లయితే చర్మం కొద్ది సమయం తర్వాత దగదగమెరిసిపోతూ ఉంటుంది. వేప -పెరుగుతో చేసిన ఫేస్ ప్యాక్ చర్మం దెబ్బతిన్న కణజాలాన్ని బాగు చేస్తుంది. ఇది చర్మశుద్ధిని పెంచుతుంది.

మొటిమలు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. బ్లాక్ హెడ్స్ సమస్య నుండి కూడా బయటపడొచ్చు. దీనిని గాయం మీద అప్లై చేయడం ద్వారా, అది నయమవుతుంది అలాగే, మచ్చ కూడాపోతుంది. వేప – పెరుగు ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా డార్క్ సర్కిల్స్ కూడా తొలగిపోతాయి. ఎక్కువగా ఇది చర్మ సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.

అందుకే పెద్దోళ్లు మనకు తెలియకుండానే ఇంటి ముందు వేప చెట్టు పెంచుతారు. వేపచెట్టు నుంచి వచ్చే గాలి చెడు బ్యాక్టీరియాను దరిచేరనీయదు. చుట్టూ వాతావరణాన్ని చల్లగా ఉంచుతుంది. ఈ చెట్టు నీడలో పడుకుంటే ఆక్సిజన్ బాగా అందుతుంది. అందుకే పూర్వకాలంలో ఆరుబయట వేప చెట్టుకింద పడుకోవడం అలవాటుగా ఉండేది.

సన్నగా ఉన్న వారు వ్యాయామం చేయాల్సిన అవసరం లేదా..!

సాధారణంగా చాలా లావుగా ఉన్నవారు మాత్రమే వ్యాయామం చేస్తే సరిపోతుంది.సన్నగా, పీలగా ఉన్న వారు వ్యాయామం చేయవలసిన అవసరం లేదని చాలా మంది భావిస్తుంటారు.వ్యాయామం అనేది కేవలం శరీరం సన్నబడటం కోసం చేస్తున్నారు అనుకుంటే పొరపాటు పడినట్లే. వ్యాయామం కేవలం మన శరీరబరువు తగ్గించుకోవడం కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం ఎంతగానో దోహదపడుతుంది.

సాధారణంగా అధిక శరీర బరువు ఉన్నవారు వ్యాయామం చేస్తూ శరీర బరువును తగ్గించుకుంటారు. అదేవిధంగా సన్నగా ఉన్న వారు కాస్త ఒళ్ళు చేయాలంటే తప్పనిసరిగా డైట్‌తో పాటు వ్యాయామం తప్పదు. సన్నగా ఉన్నవాళ్లు కోచ్‌ ఆధ్వర్యంలో ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. సన్నగా ఉన్న వారైనా, అధిక శరీర బరువు ఉన్న వారైనా తప్పనిసరిగా ప్రతిరోజు వ్యాయామం చేయడం ఎంతో ముఖ్యం.

పది నిమిషాలు స్కిప్పింగ్ చేయడం, ఎనిమిది నిమిషాల పాటు వాకింగ్ చేయడంతో సమానంగా ఉంటుంది. ఈ విధంగా స్కిప్పింగ్ చేసేటప్పుడు మీరు ఎంపిక చేసుకొనే తాడు మీ ఎత్తుకు రెండింతలు ఉండాలి. అలాగే ఎప్పుడూ ఒకే విధమైన ఎక్సర్సైజులు మాత్రమే కాకుండా క్వాట్స్,మిలటరీ ప్రెస్,డెడ్‌ లిప్ట్, డంబెల్‌ రో,బెచ్‌ ప్రెస్, ప్రయత్నించడం వల్ల కండరాలు ఎంతో బలంగా తయారవుతాయి.

అదేవిధంగా ప్రతిరోజు ఓ అరగంట పాటు నడక తప్పనిసరి. ప్రతి రోజు వాకింగ్ చేయడం వల్ల మన శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి ఇవి తరచూ మనలో కలిగే ఒత్తిడి ఆందోళన నుంచి విముక్తి కలిగించి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందింప చేస్తాయి.రోజుకు అరగంట పాటు వాకింగ్ చేయడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కనుక వ్యాయామం అనేది కేవలం లావుగా ఉన్నవారు మాత్రమే కాకుండా సన్నగా ఉన్న వారు కూడా చేయడం ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు.

డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ఇలా చెయ్యండి!

ప్రస్తుత కాలంలో రోజురోజుకు అధికమవుతున్న సమస్యలు మధుమేహ సమస్య ఒకటి. రోజురోజుకు మధుమేహంతో బాధపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తో పాటు, వివిధ రకాల ఫంగస్ లు ఎక్కువగా డయాబెటిస్ పేషెంట్లను టార్గెట్ చేస్తున్నాయి. వీరిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం చేత తొందరగా ఇటువంటి వ్యాధుల బారిన పడుతున్నారు.

ప్రస్తుత కాలంలో మన జీవన విధానంలో,ఆహార శైలిలో అధిక మార్పులు చోటు చేసుకోవడం వల్లే ఈ విధంగా డయాబెటిస్ సమస్య వెంటాడుతోంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విధంగా డయాబెటిస్ బారిన పడిన వారు ఏ మాత్రం వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించకపోతే మన శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగే తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. కనుక చక్కెరవ్యాధి సమస్యతో బాధపడేవారు తరచూ కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.

  • మధుమేహ సమస్య తో బాధపడే వారు నిత్యం ఒకే చోట కూర్చుని పని చేయకుండా వారి శరీరానికి శ్రమ కల్పించేలా చూసుకోవాలి. ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు నడవడం, శరీర వ్యాయామాలు చేయాలి.
  • ఈ మధుమేహ సమస్యతో బాధపడేవారు మధుమేహం వచ్చిందని భావించి పూర్తిగా అన్నం తినడం మానేస్తారు. ఈ విధంగా చేయడం పూర్తిగా తప్పని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం చపాతీలు వంటి వాటిని మాత్రమే కాకుండా వాటితో పాటు కొంత పరిమాణంలో అన్నం తీసుకోవాలి.
  • ఈ మధుమేహ సమస్యతో బాధపడేవారు ఎక్కువగా తీపి పదార్థాలకు దూరంగా ఉండడం ఎంతో మంచిది.అదే విధంగా మీరు ఆహారం తీసుకునేటప్పుడు అధిక మొత్తంలో ఒకేసారి కాకుండా కొంత పరిమాణంలో ఎక్కువసార్లు తీసుకునేలా చూడాలి.
  • మధుమేహంతో బాధపడే వారు పాలిష్ పట్టని బియ్యాన్ని వండుకుని తినాలి.ఈ విధమైనటువంటి బియ్యాన్ని తీసుకుంటూనే చిరు ధాన్యాలు రాగులు జొన్నలు సజ్జలు వంటి వాటిని కూడా తీసుకోవాలి.

*మధుమేహంతో బాధపడేవారు ఎక్కువగా తాజా కూరగాయలు పండ్లు ఆకుకూరలు తీసుకోవాలి. ఈ విధమైన సమస్యతో బాధపడే వారు ఎప్పుడూ కూడా ఉపవాసాలు అంటూ ఖాళీ కడుపుతో ఉండకూడదు.
ఈ విధమైనటువంటి జాగ్రత్తలను పాటించడం ద్వారా మన శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చు.

రష్మిక మందాన్న టాటూ సీక్రెట్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక మందాన్న ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొంత సమయం లోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన వారిలో ఒకరు. తన నటన ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను సందడి చేస్తుంటారు.ఈ క్రమంలోనే తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు.

సాధారణంగా హీరోయిన్ల లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలిసిందే. ముఖ్యంగా టాటూ అంటే మహా పిచ్చి. ఈ విధంగా టాటూల ద్వారా జీవిత సత్యాలను టాటూల రూపంలో లేదా మరికొందరు వారికి నచ్చిన సింబల్స్ ను టాటూగా వేయించుకుంటారు. ఈ విధంగానే రష్మిక చేతికి కూడా ఓ టాటూ ఉంది. అయితే దాని అర్థం ఏమిటో రష్మిక క్లుప్తంగా వివరించారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మిక తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా లైవ్ లోకి వచ్చి అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో సరదాగా సమాధానాలు చెప్పారు.ఈ క్రమంలోనే ఓ అభిమాని రష్మిక చేతికి ఉన్న టాటూ అర్థం ఏంటని అడగగా అందుకు రష్మిక ఎంతో వివరంగా ఆమె చేతికి ఉన్న టాటూ అర్థం వివరించారు.

” నీలాంటి వాళ్లు ఒకరే ఉంటారు. నిన్ను ఎవరు రీ ప్లేస్ చేయలేరు.. నీకు నువ్వే ఉండాలి.. నీకు నువ్వే మిగిలిపోతావ్..ఇర్రిప్లేసబుల్ అని అంటూ టాటూ అర్థం వివరించారు.ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ సరసన సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 13న విడుదల కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు.

తక్షణ శక్తి కావాలనుకునేవారు.. ఈ పండు తినాల్సిందే!

సాధారణంగా పండ్లను తీసుకోవడం వల్ల మన శరీరానికి తగినంత శక్తిని అందిస్తాయని అదేవిధంగా ఆరోగ్యానికి సరిపడా పోషకాలను అందిస్తాయనే విషయం అందరికీ తెలిసినదే. కానీ కొన్ని పండ్లు మనకు కేవలం సీజన్లో మాత్రమే లభిస్తాయి. సీజన్ లతో సంబంధం లేకుండా దొరికే పండ్లలో సపోటా ఒకటని చెప్పవచ్చు.చూడటానికి ఎంతో చిన్నగా ఉన్నప్పటికీ రుచి మాత్రం ఎంతో అమోఘంగా అనిపిస్తుంది. సపోటా పండ్లలో ఎక్కువ శాతం క్యాలరీలను కలిగి ఉండటం వల్ల మనకు శక్తిని ఇవ్వటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ సపోటా పండును తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

సపోటా పండులో ఎక్కువశాతం క్యాలరీలు ఉండడంతో పాటు ఎంతో రుచిగా ఉంటాయి. ఇందులోఉండే ఫ్రక్టోస్ శరీరానికి త్వరగా శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అందుకోసమే క్రీడాకారులు ఎక్కువగా సపోటా పండ్లు తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఈ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల వృద్ధులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. సపోటా పండు వాపు కీళ్ళ నొప్పులను తగ్గించడంలో దోహదపడతాయి.

ఈ పండ్లలో ఎక్కువభాగం యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు, క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా లభిస్తాయి.ఈ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవడానికి కాకుండా మన శరీరంలో రక్త హీనత సమస్య నుంచి కాపాడుతాయి. సపోటాలు ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధక సమస్యతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సపోటా పండ్లను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇంట్లో ఈ పొరపాట్లు చేస్తే లక్ష్మీ కటాక్షం కలగదు..!

సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితం ఆనందమయం కావాలని ఎంతో కష్టపడుతుంటారు. తమ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా,ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలని ప్రతి ఒక్కరు మంగళవారం, శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.కానీ మనకు తెలిసి కొన్ని పొరపాట్లు చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహించి మన ఇంట్లో కొలువై ఉండదని చెబుతుంటారు. అయితే ఎలాంటి పొరపాట్లు చేయడం వల్ల లక్ష్మీదేవి కొలువై ఉండదో ఇక్కడ తెలుసుకుందాం…

ఎవరైతే మన ఇంటి సింహ ద్వారం ముందు చెప్పులు వదులుతారో అలాంటి వారి ఇంట లక్ష్మీదేవి ఉండదు. అదేవిధంగా గడపల సాక్షాత్తు లక్ష్మీదేవి కాబట్టి ఎవరైతే కడప రైతు ఇంటిలోనికి ప్రవేశిస్తారో, గడపకు అటువైపు ఇటువైపు కాళ్ళు పెట్టుకొని మాట్లాడే వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉండదు. అమ్మవారికి ఇష్టమైన మంగళవారం లేదా శుక్రవారం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ చేయటం వల్ల అనుగ్రహం కలిగి మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

ప్రతిరోజు ఎవరైతే ఉదయం ఇంటి ముందు చెత్త గురించి ముగ్గులు పెడతారో అలాంటి వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.అదేవిధంగా ప్రధాన ద్వారం వద్ద గోడలకు ఎరుపు రంగుతో స్వస్తిక్ గుర్తును వేయటం వల్ల శుభ పరిణామాలు జరుగుతాయి.అయితే ఆ ఇంటి ఇల్లాలు ఎల్లప్పుడు అసంతృప్తితో బాధపడుతూ ఉండకూడదు. మన ఇంట్లో చెడిపోయిన గడియారాలు, పగిలిపోయిన అద్దం, చిరిగిపోయిన వస్త్రాలు అస్సలు ఉండకూడదు అని పండితులు చెబుతున్నారు ఎవరి ఇంట్లో అయితే ఇలాంటి నియమాలను పాటిస్తారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.

బీరకాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనలో తెలుసా?

సాధారణంగా మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఎన్నో ప్రకటనలను మనం చూస్తూనే ఉన్నాం. మద్యం సేవించడం వల్ల లివర్ క్యాన్సర్ వస్తుందని, మరి కొందరిలో లివర్ దెబ్బతినటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనీ అందరికీ తెలిసిన విషయమే. అందుకోసమే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటూ..ఎన్నో వాణిజ్య ప్రకటనలు వస్తున్న వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా ఆల్కహాల్ సేవిస్తున్నారు. అయితే మద్యం తాగేవారు ఎక్కువగా బీరకాయలను తీసుకోవడం వల్ల వారికి కాలేయ సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.

 

ఎంత చెప్పినా మద్యం సేవించడం అపని వారు వారు తినే ఆహారంలో వారంలో రెండు సార్లయినా బీరకాయ ను చేర్చడం వల్ల వారి కాలేయం దెబ్బతినకుండా ఎలాంటి సమస్యలకు దారితీయకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బీరకాయలలో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉండటంవల్ల ఆహారం తేలికగా జీర్ణం అవ్వడంలో బీరకాయ కీలక పాత్ర పోషిస్తూ జీర్ణక్రియ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.

ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహారం వల్ల మన శరీరంలో ఎక్కువ శాతం చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి జీర్ణక్రియ సమస్యలు తలెత్తడంతో పాటు అనేక ఇతర సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ చెడు కొలెస్ట్రాల్ పై బ్యాక్టీరియాలు ఇతర సూక్ష్మజీవులు అంటిపెట్టుకొని ఇన్ఫెక్షన్లకు దారి తీయటం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.ఈ సమస్యల నుంచి విముక్తి పొందాలంటే ఫైబర్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో ఉత్తమమని నిపుణులు తెలియజేస్తున్నారు. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉన్నవాటిలో బీరకాయ ముందు వరుసలో ఉంటుంది. ఈ బీరకాయను వారానికి రెండు సార్లు తీసుకోవడం వల్ల మద్యం సేవించే వారిలో కాలేయానికి సంబంధించిన వ్యాధుల నుంచి విముక్తి పొందటమే కాకుండా ఆహారం జీర్ణం అవ్వడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.