Health News

డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ఇలా చెయ్యండి!

ప్రస్తుత కాలంలో రోజురోజుకు అధికమవుతున్న సమస్యలు మధుమేహ సమస్య ఒకటి. రోజురోజుకు మధుమేహంతో బాధపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తో పాటు, వివిధ రకాల ఫంగస్ లు ఎక్కువగా డయాబెటిస్ పేషెంట్లను టార్గెట్ చేస్తున్నాయి. వీరిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం చేత తొందరగా ఇటువంటి వ్యాధుల బారిన పడుతున్నారు.

ప్రస్తుత కాలంలో మన జీవన విధానంలో,ఆహార శైలిలో అధిక మార్పులు చోటు చేసుకోవడం వల్లే ఈ విధంగా డయాబెటిస్ సమస్య వెంటాడుతోంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విధంగా డయాబెటిస్ బారిన పడిన వారు ఏ మాత్రం వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించకపోతే మన శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగే తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. కనుక చక్కెరవ్యాధి సమస్యతో బాధపడేవారు తరచూ కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.

  • మధుమేహ సమస్య తో బాధపడే వారు నిత్యం ఒకే చోట కూర్చుని పని చేయకుండా వారి శరీరానికి శ్రమ కల్పించేలా చూసుకోవాలి. ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు నడవడం, శరీర వ్యాయామాలు చేయాలి.
  • ఈ మధుమేహ సమస్యతో బాధపడేవారు మధుమేహం వచ్చిందని భావించి పూర్తిగా అన్నం తినడం మానేస్తారు. ఈ విధంగా చేయడం పూర్తిగా తప్పని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం చపాతీలు వంటి వాటిని మాత్రమే కాకుండా వాటితో పాటు కొంత పరిమాణంలో అన్నం తీసుకోవాలి.
  • ఈ మధుమేహ సమస్యతో బాధపడేవారు ఎక్కువగా తీపి పదార్థాలకు దూరంగా ఉండడం ఎంతో మంచిది.అదే విధంగా మీరు ఆహారం తీసుకునేటప్పుడు అధిక మొత్తంలో ఒకేసారి కాకుండా కొంత పరిమాణంలో ఎక్కువసార్లు తీసుకునేలా చూడాలి.
  • మధుమేహంతో బాధపడే వారు పాలిష్ పట్టని బియ్యాన్ని వండుకుని తినాలి.ఈ విధమైనటువంటి బియ్యాన్ని తీసుకుంటూనే చిరు ధాన్యాలు రాగులు జొన్నలు సజ్జలు వంటి వాటిని కూడా తీసుకోవాలి.

*మధుమేహంతో బాధపడేవారు ఎక్కువగా తాజా కూరగాయలు పండ్లు ఆకుకూరలు తీసుకోవాలి. ఈ విధమైన సమస్యతో బాధపడే వారు ఎప్పుడూ కూడా ఉపవాసాలు అంటూ ఖాళీ కడుపుతో ఉండకూడదు.
ఈ విధమైనటువంటి జాగ్రత్తలను పాటించడం ద్వారా మన శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

17 hours ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

17 hours ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

17 hours ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

19 hours ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

19 hours ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

19 hours ago