Health News

డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ఇలా చెయ్యండి!

ప్రస్తుత కాలంలో రోజురోజుకు అధికమవుతున్న సమస్యలు మధుమేహ సమస్య ఒకటి. రోజురోజుకు మధుమేహంతో బాధపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తో పాటు, వివిధ రకాల ఫంగస్ లు ఎక్కువగా డయాబెటిస్ పేషెంట్లను టార్గెట్ చేస్తున్నాయి. వీరిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం చేత తొందరగా ఇటువంటి వ్యాధుల బారిన పడుతున్నారు.

ప్రస్తుత కాలంలో మన జీవన విధానంలో,ఆహార శైలిలో అధిక మార్పులు చోటు చేసుకోవడం వల్లే ఈ విధంగా డయాబెటిస్ సమస్య వెంటాడుతోంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విధంగా డయాబెటిస్ బారిన పడిన వారు ఏ మాత్రం వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించకపోతే మన శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగే తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. కనుక చక్కెరవ్యాధి సమస్యతో బాధపడేవారు తరచూ కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.

  • మధుమేహ సమస్య తో బాధపడే వారు నిత్యం ఒకే చోట కూర్చుని పని చేయకుండా వారి శరీరానికి శ్రమ కల్పించేలా చూసుకోవాలి. ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు నడవడం, శరీర వ్యాయామాలు చేయాలి.
  • ఈ మధుమేహ సమస్యతో బాధపడేవారు మధుమేహం వచ్చిందని భావించి పూర్తిగా అన్నం తినడం మానేస్తారు. ఈ విధంగా చేయడం పూర్తిగా తప్పని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం చపాతీలు వంటి వాటిని మాత్రమే కాకుండా వాటితో పాటు కొంత పరిమాణంలో అన్నం తీసుకోవాలి.
  • ఈ మధుమేహ సమస్యతో బాధపడేవారు ఎక్కువగా తీపి పదార్థాలకు దూరంగా ఉండడం ఎంతో మంచిది.అదే విధంగా మీరు ఆహారం తీసుకునేటప్పుడు అధిక మొత్తంలో ఒకేసారి కాకుండా కొంత పరిమాణంలో ఎక్కువసార్లు తీసుకునేలా చూడాలి.
  • మధుమేహంతో బాధపడే వారు పాలిష్ పట్టని బియ్యాన్ని వండుకుని తినాలి.ఈ విధమైనటువంటి బియ్యాన్ని తీసుకుంటూనే చిరు ధాన్యాలు రాగులు జొన్నలు సజ్జలు వంటి వాటిని కూడా తీసుకోవాలి.

*మధుమేహంతో బాధపడేవారు ఎక్కువగా తాజా కూరగాయలు పండ్లు ఆకుకూరలు తీసుకోవాలి. ఈ విధమైన సమస్యతో బాధపడే వారు ఎప్పుడూ కూడా ఉపవాసాలు అంటూ ఖాళీ కడుపుతో ఉండకూడదు.
ఈ విధమైనటువంటి జాగ్రత్తలను పాటించడం ద్వారా మన శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago