Life Style: దాహం వేసి చచ్చిపోతున్నా ఈ పక్షి నీళ్లు తాగదు..! ఎందుకో తెలుసా..!
Life Style: భూమిపై బతికి ఉన్న ప్రతీ జీవికి తినడానికి తిండి.. తాగడానికి నీళ్లు.. బతకడానికి గాలి అత్యంత అవసరం. ఈ మూడు యూనివర్సల్ నీడ్స్ అంటారు. ఇవి ఉంటే.. ఏ జీవి అయినా ఈ భూమిపై బతకొచ్చు. అలా అయితే ఈ ధరణిపై మనుగడ సాగుతుంది.
ఎంత దాహం వేసినా.. చచ్చిపోవాల్సి వచ్చినా.. నీరు తాగకుండా ఉంటే ఓ పక్షి ఉందన్న సంగతి మీకు తెలుసా.. దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో మాత్రమే జీవించే చాతక పక్షి గురించి చాలామందికి తెలియకపోవచ్చు.
ఇది మన దేశంలో ఎక్కువగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కనిపిస్తుంది. దీనిని అక్కడి స్థానికులు ఎక్కువగా చోళీ అని పిలుస్తుంటారు. ఉత్తరాఖాండ్ లోని ఎక్కువగా ఈ పక్షులు గర్వాల్ అనే ప్రాంతంలో నివసిస్తాయి. ఇక ఈ పక్షికి తాగమని నీళ్లు ఇచ్చినా.. నది లేదా చెరువు వద్దకు వెళ్లి ఉంచినా.. ఈ పక్షి నీళ్లను తాగదు.
మరి నీరు తగకుండా ఈ భూమిపై ఏ జీవి మనుగడ ఉండదు కదా.. మరి అది ఎలా బతుకుతుంది అనే అనుమానం మనకు కలగొచ్చు. పాయింట్ కి వస్తే.. అది నీరు తాగుతుంది.. ఎప్పుడంటే.. వర్షపు నీటిని మాత్రమే అది తాగుతుంది. ఇది నీరు తాగే సమయంలో ముక్కును తెరవదట. అది స్వాతి నక్షత్రంలో కురిసే నీటిని మాత్రమే తాగుతుందని స్థానికులు చెబుతుంటారు. అంతే కాదు దాని చూపు అంతా ఆకాశం వైపు మాత్రమే ఉంచుతుందట. ఇలా ఈ పక్షికి ఎంత దాహం వేసినా ఓర్చుకుంటుంది కానీ.. ఏ సరస్సుల్లో నీరు మాత్రం తాగదు. ఇక ఈ పక్షిని మార్వాడీలో మఘ్వా లేదా పాపియా అని కూడా అంటారట. భలే వింతగా ఉంది కదా.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…