Politics: పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో కీలక మలుపు..! తిరిగి సొంత గూటికి సువేందు అధికారి..?
Politics: పశ్చిమ బెంగాల్లో అధికార త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీకి.. బీజేపీ పార్టీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ రెండు పార్టీల కార్యకర్తల మధ్య నిత్యం ఘర్షణలు చెలరేగుతున్నాయి. చాలా చోట్ల హత్యలు, మానభంగాలకు కూడా దారితీశాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారీగా ఘర్షణలు చెలరేగాయి.
ఇదిలా ఉంటే ఏం లేని స్థానం నుంచి ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది బీజేపీ. దీనికి కారణం సువేందు అధికారి. త్రుణమూల్ కాంగ్రెస్ క్యాబినెట్ మంత్రిగా ఉన్న ఆయన 2021లో ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. ఏకంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమత పైనే గెలిచారు. నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీని ఓడించి సత్తా చాటారు.
అయితే ప్రస్తుతం సువేందు అధికారి మళ్లీ సొంతగూటికి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మాట అన్నది ఎవరో కాదు త్రుణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్. బిజెపిలో సువేందు అధికారి ఇమడలేకపోతున్నారని మాకు తెలిసింది.
కాంటేయ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాపై ఆయన అసంతృప్తిగా ఉన్నారట. ఈ జాబితాలో సువేందు అధికారి సోదరుడు సౌమేందు అధికారి పేరు సూచించినా.. బీజేపీ అధిష్టానం పట్టించుకోవడం లేదట. గతంలో సౌమేందు అధికారి కాంటేయ్ మున్సిపాలిటీ ఛైర్మన్ గా పనిచేశారు. కాంటేయ్, కాంతి ప్రాంతాలు సువేందు కుటుంబానికి కంచుకోటలా ఉండేవి. అయితే అలాంటిది తన మాటను కూడా బీజేపీ అధిష్టానం పెడచెవిన పెడుతుందనే సువేందు అధికారి కోపంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఎన్నికల సమయంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై సువేందు అధికారి తీవ్ర విమర్శలు చేశారు. అందువల్ల టీఎంసీలోకి మళ్లీ తీసుకునే అవకాశం కూడా లేదని కునాల్ ఘోష్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…