Sudheer Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు కుటుంబం నుంచి ప్రేమకథా చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన గత పది సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటి ఇప్పటి వరకు తిరిగి సరైన బ్రేక్ రాలేదని చెప్పాలి. సుధీర్ బాబు తెలుగు సినిమాలలో నటిస్తూనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.
ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ‘బాఘి’ అనే ఈ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి తనలో ఉన్న విలనిజాన్ని బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇలా ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈయనకు బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలో నటించే అవకాశం వచ్చింది. తాజాగా ఆయన కృతి శెట్టితో కలిసి ఆ అమ్మాయి గురించి చెప్పాలి అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ బాబు తనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన అవకాశం గురించి తాను రిజెక్ట్ చేసిన విషయం గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా కరణ్ జోహార్ నిర్మాణంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమాలో తనకు విలన్ గా నటించే అవకాశం వచ్చిందని అయితే ఈ సినిమాను ఆయన రిజెక్ట్ చేసినట్లు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
ఈ విధంగా ఈ సినిమాను రిజెక్ట్ చేయడానికి కారణం కూడా తెలియజేస్తూ ఈ సినిమా చేసే సమయంలో తను సమ్మోహనం సినిమాతో బిజీగా ఉండటంవల్ల ఈ సినిమాలో చేయలేకపోయానని తెలియజేశారు. ఇప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు విలన్ గా ఎన్నో అవకాశాలు వస్తున్నాయని ఈ సందర్భంగా సుధీర్ బాబు వెల్లడించారు. అయితే ఇక్కడ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల బాలీవుడ్ చిత్రాలను ఒప్పుకోలేక పోతున్నానని ఈ సందర్భంగా సుధీర్ బాబు వెల్లడించారు.
మన శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తంలో ఉన్న వ్యర్థాలను తొలగించడమే కాకుండా, శరీరంలో ద్రవాల సమతుల్యతను…
వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు సహజమే. అయితే ఇటీవల చాలా మందిలో కనిపిస్తున్న ఒక సమస్య నిపుణులను…
మన రోజువారీ వంటకాలలో నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు దాదాపు ప్రతి…
మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…
గుజరాత్లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…