Tag Archives: ms dhoni

MS Dhoni: అద్భుతమైన గిఫ్ట్ తో కమెడియన్ యోగి బాబును సర్ప్రైజ్ చేసిన ఎమ్ యస్ ధోని.. ఫోటో వైరల్!

MS Dhoni: సినిమా ఇండస్ట్రీకి క్రికెట్ రంగానికి ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ నిర్మాతగా మారి సొంత బ్యానర్ లో ఓ తమిళ సినిమాని చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకొని షూటింగ్ పనులను ప్రారంభించింది.

ధోనీ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో నిర్మించిన నిర్మాణ సంస్థలో
లెట్స్ గెట్ మ్యారీడ్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ‘లవ్ టుడే’ ఫేమ్ ఇవానా, ప్రముఖ నటి నదియా, హరీష్ కళ్యాణ్ అలాగే ప్రముఖ కమెడియన్ యోగి బాబు కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే కమెడియన్ ధోనీకి వీరాభిమాని.

క్రికెట్ అంటే కూడా ఈయనకు విపరీతమైన ప్రత్యేకతకు ఏమాత్రం ఖాళీ సమయం దొరికిన క్రికెట్ ఆడుతూ కనిపిస్తారు. షూటింగ్ లొకేషన్లో కూడా షూటింగ్లో ఏమాత్రం గ్యాప్ దొరికిన బ్యాట్ చేతపట్టి క్రికెట్ ఆడుతూ కనిపిస్తుంటారు. ఇలా క్రికెట్ అంటే ఎంతో ఇష్టం ఉన్నటువంటి యోగి బాబుకు ధోని స్పెషల్ గిఫ్ట్ పంపించి సర్ప్రైజ్ చేశారు.

MS Dhoni: బ్యాట్ గిఫ్ట్ గా ఇచ్చిన ధోని…


ధోని స్వయంగా సంతకం చేసినటువంటి ఒక బ్యాట్ యోగి బాబుకు కానుకగా పంపించారు. ధోని యోగి బాబు కోసం సంతకం చేసినటువంటి బ్యాట్ పంపించడంతో యోగి బాబు సంతోషంలో మునిగి తేలుతున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

MS Dhoni: గిల్ క్రిస్ట్ ను బౌండరీ వరకు పరుగులు పెట్టించిన ధోని… అసలేం జరిగిందంటే?

MS Dhoni: భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని ఆట తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యద్భుతమైన కెప్టెన్, టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనుడు, ఫినిషర్ గా ఎన్నో రికార్డులు అందించిన ఘనత ధోనీకి చెల్లుతుందని చెప్పాలి. ఇలా ఇండియాని ముందుకు నడిపించడంలో ధోని ఎన్నో వినూత్నమైన నిర్ణయాలు తీసుకుంటారు.

సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ధోనికి ఎవరు సాటిరారు.ధోనీ మైండ్ లో ఏముంటుంది అనేది తెలుసుకోవడం ఎవరి తరం కాదు. ఇలా ధోని తీసుకున్న నిర్ణయంతో ఒకసారి రిక్కీ పాంటింగ్ బకరాని చేయక అదే మ్యాచ్లో గిల్ క్రిస్ట్ బౌండరీ వరకు పరిగెత్తించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన అప్పటి వీడియో వైరల్ గా మారింది.

గతంలో ఆస్ట్రేలియా టూర్ కి వెళ్లిన సందర్భంగా ఓ మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్న ధోనీని కట్టడి చేసేందుకు రికీ పాంటింగ్ 8 మంది ఫీల్డర్స్ ని మోహరించాడు. ఎక్కువగా ఆఫ్ సైడ్ ఆడే ధోనీ ఏం చేస్తాడా అని స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ధోని ఏం చేస్తారని ఆత్రుతగా చూస్తున్నారు.ఇక జాన్సన్ ఆఫ్ సైడ్ వేసిన బంతిని.. ఫ్రంట్ ఫుట్ కు వచ్చి ఆడిన ధోనీ లైగ్ సైడ్ కొట్టాడు.

MS Dhoni: గిల్ క్రిస్ట్ పై అసహనం వ్యక్తం చేసిన పాంటింగ్…

అటువైపు ఫీల్డ్స్ ఎవరూ లేకపోవడంతో వికెట్ కీపర్ గా ఉన్నటువంటి గిల్ క్రిస్ట్ బౌండరీ వరకు పరుగెత్తి బాల్ పట్టుకున్నాడు. అయితే అదే సమయంలోనే ధోని ఏకంగా మూడు పరుగులు చేశారు. దీంతో పిచ్చెక్కిపోయినా రికీ పాంటింగ్ ఎందుకు పరిగెత్తావు అంటూ గిల్ క్రిస్ట్ పై అసహనం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

MS Dhoni: బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమిండియాలో కీలక బాధ్యతలు చేపట్టనున్న ఎంఎస్ ధోని?

MS Dhoni: టి20 ప్రపంచ కప్ 2022 లో భారత్ ఘోర వైఫల్యం ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి టీమిండియా టి20 సిరీస్ ప్రపంచ కప్ మ్యాచ్లలో ఘోర వైఫల్యం చెందుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఘోర పరాజయం పాలైంది.ఇక టి20 ప్రపంచ కప్ 2020 మ్యాచ్ లో భాగంగా పాకిస్తాన్ పై ఇంగ్లాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ విధంగా టి20 ప్రపంచ కప్ మ్యాచ్ లలో ఇండియా గత కొన్ని సంవత్సరాల నుంచి పరాజయం కావడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 2013 వ సంవత్సరం నుంచి ఐసీసీ చాంపియన్ ట్రోఫీ భారత్ కి దూరంగా ఉంది. ఈ క్రమంలోనే 2024 ప్రపంచ కప్ టీమ్ ఇండియాలో కీలక మార్పులు చేసే దిశగా బీసీసీఐ అడుగులు వేస్తోంది.

భారత క్రికెట్ డైరెక్టర్ గా ధోని…

ఈ క్రమంలోనే భారత క్రికెటర్ డైరెక్టర్ గా నియమించే అందుకు ఎంఎస్ ధోని పేరును తెరపైకి తీసుకువస్తున్నారు. ఇలా డైరెక్టర్ గా ఎంఎస్ ధోనిని నియమిస్తే రాహుల్ ద్రవిడ్ కి కాస్త పని భారం తగ్గుతుందని చెప్పాలి. టెస్ట్ వన్డే ఫార్మాట్లలో ఆటగాళ్లను తీర్చిదిద్దే బాధ్యత ద్రవిడ్ కి అప్పజెప్పగా, టి20 మ్యాచ్ లలో ఆటగాళ్లను తీర్చిదిద్దే బాధ్యత ఎంఎస్ ధోనీకి అప్పగించనున్నట్టు సమాచారం.ఈ విధంగా టీవి ఇండియాలో కీలక బాధ్యతలను ఎమ్మెస్ ధోనీకి అప్పగించనున్నారని తెలియడంతో ధోని అభిమానులు క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

MS Dhoni: ప్రపంచంలో అలాంటి ఘనత ఆ క్రికెటర్ కు మాత్రమే దక్కిందా… ఆయనను గుర్తు చేసుకున్న అభిమానులు?

MS Dhoni: టి20 ప్రపంచ కప్ సిరీస్ లో భాగంగా టీమిండియా రెండో సెమీఫైనల్స్ కు చేరి ఓటమిపాలైన విషయం తెలిసిందే.ఇలా రెండో సెమీఫైనల్స్ లో ఇండియా ఇంగ్లాండ్ చేతిలో దారుణంగా ఓటమి పాలు కావడంతో ఎంతోమంది టీమ్ ఇండియా పై విమర్శలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే మరికొందరు టీమిండియా ఓడిపోవడంతో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గుర్తు చేసుకుంటున్నారు.

ఇలా t20 ప్రపంచ కప్ 2022 సెమీఫైనల్స్ లో ఇండియా ఓడిపోవడంతో ఎందుకు ఓడిపోయిందని ప్రతి ఒక్క భారతీయుడు ప్రశ్నించుకోగా టీమిండియాలో ఎంఎస్ ధోని లేకపోవడం వల్లే ఓడిపోయిందని వారికి వారే సమాధానం చెప్పుకుంటున్నారు.ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలో ఇండియాకు ఎన్నో విజయాలను తీసుకువచ్చారు. ఈయన తర్వాత కెప్టెన్లుగా ఉన్నటువంటి కోహ్లీ రోహిత్ అలాంటి విజయాలను అందించలేకపోయారని అభిమానులు ధోని విజయాలను గుర్తు చేసుకుంటున్నారు.

ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు టీం ఇండియాని విజయపథంలో నడిపిస్తూ ఎన్నో విజయాలను అందించారు.ధోనీ సారథ్యంలో భారత్ 12 ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లు ఆడగా, అందులో 9 విజయాలు సాధించింది. ఇక ధోని నాయకత్వంలో జరిగిన 2007 t20 ప్రపంచ కప్ టోర్నమెంట్ లో భాగంగా ఇండియా కప్ సొంతం చేసుకుంది. అనంతరం 2011లో జరిగిన వన్డే ప్రపంచ కప్పును కూడా ఇండియా ముద్దాడింది.టెస్టు, వన్ డే, పొట్టి క్రికెట్ టీ20.. ఇలా మూడు  ఫార్మాట్లలోనూ మంచి విజయాన్ని అందుకుంది.

MS Dhoni: ఏ కెప్టెన్ కు సాధ్యపడని రికార్డులు కొట్టిన ధోని..

ఇక ఈయన రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇలాంటి విజయాలను ఇండియాకి ఏ కెప్టెన్ అందించలేకపోయారు. 2013 వ సంవత్సరంలోనే ధోని శకం ముగిసిందని, ఇన్ని రికార్డులు బద్దలు కొట్టడం మరే కెప్టెన్ కుసాధ్యపడలేదని ప్రతి ఒక్క ఇండియన్ ధోని ఆట తీరును ఆయన ఇండియాకు అందించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.

Virender Sehwag: ధోని కావాలనే అలా చేశారు.. మానసికంగా ఎంతో కుంగిపోయా.. ధోని పై సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్!

Virender Sehwag: భారత జట్టు గర్వించదగ్గ ఓపెనర్ల లో ఒకరైనటువంటి వీరేంద్ర సెహ్వాగ్ తన అద్భుతమైన ఆట తీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈయన బ్యాట్ చేత పెట్టారంటే బాల్ బౌండరీ దాటాల్సిందే. ఎలాంటి బౌలర్ అయినా సరే ఈయనకు బౌలింగ్ చేయాలంటే కాస్త భయపడే వారు. సెహ్వాగ్ బ్యాటింగ్ వన్డే అయినా టెస్ట్ అయినా ఒకే రీతిలో ఉంటుంది.

తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ ఒక స్పోర్ట్స్ ఛానల్ తో ముచ్చటిస్తూ గతంలో తనకు జరిగిన ఒక చేదు సంఘటన గురించి తెలియజేశారు. ఈ క్రమంలోనే మహేంద్రసింగ్ ధోని పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2008 ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం వెళ్ళినప్పుడు తను తన ఫామ్ కోల్పోయాను. నాలుగు వన్డేల్లోనూ చాలా తక్కువ పరుగులకే ఆలౌట్ అయ్యారని తెలియజేశారు.

ఆ సమయంలో వీరేంద్ర సెహ్వాగ్ ఆటతీరుపై ఎంతో మంది అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేశారు. ఈ విధంగా నాలుగు వన్డేల్లోనూ సెహ్వాగ్ తక్కువ పరుగులకే అవుట్ అవ్వడంతో మహేంద్రసింగ్ ధోని కావాలనే నన్ను తుది జట్టునుంచి తప్పించాడు. ఆ సమయంలో మానసికంగా ఎంతో కృంగి పోయానని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఆ రోజు సచిన్ లేకపోతే అదే జరిగేది…


ఆ సమయంలో వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చి కేవలం టెస్టులు మాత్రమే ఆడాలని ఫిక్స్ అయ్యాను అయితే సచిన్ టెండూల్కర్ చెప్పగా ఆయన ఇది నీ కెరీర్లో ఎంతో కఠినమైన దశ కొద్ది రోజులు ఓపిక పట్టు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత రిటైర్మెంట్ చేయాలా వద్దా అని ఆలోచించుకో అని చెప్పారు.ఆయన చెప్పిన విధంగానే కొన్ని రోజులపాటు ఓపికతో వేచి చూశాను అదృష్టవశాత్తు తిరిగి ఫామ్ లోకి వచ్చానని ఈ సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ గతంలో తనకు జరిగిన ఈ చేదు సంఘటన గురించి తెలియజేశారు.

MS Dhoni : ఇండియన్ క్రికెటర్ ధోనిని పొగడ్తలతో ముంచెత్తిన సమంత… రీజన్ ఏంటంటే ?

MS Dhoni : భారత క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోని శకం సువర్ణాక్షరాలతో లిఖించదగినదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. కెప్టెన్ కూల్ గా ప్రపంచ క్రికెట్లో కీర్తి అందుకున్న ధోనీ.. ఎన్నో ఘనతలు సాధించాడు. ప్రపంచంలో ఇప్పటికీ బెస్ట్ ఫినిషర్ ధోనీయే అని కోహ్లీ తాజాగా వ్యాఖ్యానించడమే ధోనీ స్టామినాకు నిదర్శనం. కాగా ఈ మిస్టర్ కూల్ తాజాగా హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా యాక్షన్ సీన్లలో ఇరగదీశాడు.

ms dhoni unacademy ad goes viral and samantha appreciates it

తాజాగా రిలీజైన అన్ అకాడమీకి సంబంధించిన వ్యాపార ప్రకటనలో మహేంద్ర సింగ్ ధోని నటించి ప్రపంచవ్యాప్తంగా తన అభిమానులను ఆకట్టుకొంటున్నాడు. ఈ వ్యాపార ప్రకటనలో వెనుక రైలు వస్తూ ఉండగా తనకు అడ్డుగా నిలిచిన గోడలను ధోని ఛేదించుకొంటూ వెళ్లే సీన్లు, అలాగే గ్రాఫిక్స్ సీన్లు వావ్ అనిపించే విధంగా ఉన్నాయి. ఈ వీడియో విడుదల చేసిన కొద్ది సేపట్లోనే పది లక్షలకుపైగా వ్యూస్‌ను సాధించింది. ప్రస్తుతం ధోని నటించిన తీరుపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ms dhoni unacademy ad goes viral and samantha appreciates it

ఈ యాడ్‌ గురించి క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ… వావ్. ఎంఎస్ ధోని కొట్టే హెలిక్టాప్టర్ షాట్ కంటే గొప్పగా ఉంది. ఇది కేవలం ధోని స్టోరినే కాదు.. ప్రతీ క్రికెటర్ కథ. జీవితంలో ఎదురైన ఎన్నో కష్టాలను ఎలా అధిగమించాలనే విషయాన్ని స్పూర్తిదాయకంగా చూపించాడు. ఇది మంచి మనోవికాస పాఠంగా అనిపించింది అని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

పదే పదే ఆ వీడియోను చూస్తున్న సమంత ?

అలానే సమంత కూడా స్పందిస్తూ… లెస్సన్ నంబర్ 7 జీవితానికే ఓ పాఠం. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను ఎలా ఎదుర్కొనాలనే విషయాన్ని అద్భుతంగా చూపించారు. ఈ వీడియోను పదే పదే చూస్తూనే ఉండిపోయాను. ఎందరికో ప్రేరణగా నిలిచేందుకు అన్ అకాడమీ రూపొందించిన వీడియో సహాయ పడుతుంది అని సమంత తన ట్వీట్‌లో పేర్కొన్నది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా దూసుకుపోతుంది.