MS Dhoni: భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని ఆట తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యద్భుతమైన కెప్టెన్, టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనుడు, ఫినిషర్ గా ఎన్నో రికార్డులు అందించిన ఘనత ధోనీకి చెల్లుతుందని చెప్పాలి. ఇలా ఇండియాని ముందుకు నడిపించడంలో ధోని ఎన్నో వినూత్నమైన నిర్ణయాలు తీసుకుంటారు.
సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ధోనికి ఎవరు సాటిరారు.ధోనీ మైండ్ లో ఏముంటుంది అనేది తెలుసుకోవడం ఎవరి తరం కాదు. ఇలా ధోని తీసుకున్న నిర్ణయంతో ఒకసారి రిక్కీ పాంటింగ్ బకరాని చేయక అదే మ్యాచ్లో గిల్ క్రిస్ట్ బౌండరీ వరకు పరిగెత్తించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన అప్పటి వీడియో వైరల్ గా మారింది.
గతంలో ఆస్ట్రేలియా టూర్ కి వెళ్లిన సందర్భంగా ఓ మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్న ధోనీని కట్టడి చేసేందుకు రికీ పాంటింగ్ 8 మంది ఫీల్డర్స్ ని మోహరించాడు. ఎక్కువగా ఆఫ్ సైడ్ ఆడే ధోనీ ఏం చేస్తాడా అని స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ధోని ఏం చేస్తారని ఆత్రుతగా చూస్తున్నారు.ఇక జాన్సన్ ఆఫ్ సైడ్ వేసిన బంతిని.. ఫ్రంట్ ఫుట్ కు వచ్చి ఆడిన ధోనీ లైగ్ సైడ్ కొట్టాడు.
అటువైపు ఫీల్డ్స్ ఎవరూ లేకపోవడంతో వికెట్ కీపర్ గా ఉన్నటువంటి గిల్ క్రిస్ట్ బౌండరీ వరకు పరుగెత్తి బాల్ పట్టుకున్నాడు. అయితే అదే సమయంలోనే ధోని ఏకంగా మూడు పరుగులు చేశారు. దీంతో పిచ్చెక్కిపోయినా రికీ పాంటింగ్ ఎందుకు పరిగెత్తావు అంటూ గిల్ క్రిస్ట్ పై అసహనం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…