Tag Archives: new episode

కారులో దీపని చూసిన మోనిత.. దుర్గ కోసమంటూ ఝలక్ ఇచ్చిన దీప..!

బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు 1109 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. మరి నేటి హైలెట్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.. అంజి కోసం ఇద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మోనిత ఎవరికో ఫోన్ చేసి సూర్యాపేట హోటల్ 8 నుంచి ఒక క్యాబ్ బుక్ చేయమని చెబుతుంది అయితే అది తన ఇంటికి కాదు యాదగిరిగుట్టలో ఉన్న తన ఫామ్ హౌస్ కి అని చెప్పగానే అంజిని కిడ్నాప్ చేసి అక్కడ ఉంచాలి అనుకుంటుంది అంటూ మోనిత ప్లాన్ పసిగట్టిన దీప
తనకు చిన్న ఝలక్ ఇవ్వాలని భావిస్తుంది.అప్పుడే వాటర్ బాటిల్ కనిపించలేదు వెంకట్ కాస్త లైట్ అనగానే.. ఇదేంటి దీప గొంతులా ఉందని వెనక్కి తిరిగి చూస్తుంది. కారులో దీపని చూసేసరికి మోనిత ఎంతో షాక్ అవుతుంది.

అక్క అప్పటి నుంచి నువ్వు కారులోనే ఉన్నావా.. నువ్వు ఉన్నావని తెలియక ఖాళీగా కూర్చున్నాను. బాబు కాస్త కారు ఆపు అని చెప్పి మోనిత దీప దగ్గరకు వెళ్లి కూర్చుంటుంది. ఇంకేంటి అక్క విశేషాలు అని అడగగా… రేపు తీరిగ్గా తెలుసుకుంటావులే అంటూ సమాధానం చెబుతుంది. ఇక డ్రైవర్ టీ తాగడానికి కారు పక్కన ఆపితే వీరిద్దరు బయట దిగి కొంచెం ఫ్రీగా మాట్లాడుకుందామా అంటూ మాట్లాడుతారు.. అయినా నా ఎక్కడికి వెళుతున్నావు ఈ వేళప్పుడు అంటూ మోనిత దీపను అడగగా… దుర్గ దగ్గరికి అంటూ షాక్ ఇస్తుంది. దుర్గ పేరు వినగానే కంగారుపడిన మోనిత ఇప్పుడు వీడిని తీసుకువచ్చి నా పెళ్లి ఆపడానికి ప్రయత్నం చేస్తోందా.. అంటూ కంగారు పడుతుంది. అదే విజయవాడలో దుర్గఉంది కదా.. దుర్గా దేవికి వెళ్తున్నాను అని చెప్పడంతో మోనిత ఊపిరి పీల్చు కుంటుంది.

చాలా రోజుల నుంచి ఎంతో చిరాకుగా ఉన్నాను అందుకోసమే గుడికి వెళదామని వెళ్తున్నా… అయినా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావ్ అని దీప అడగగా.. రేపు నా పెళ్లి కదా.. సాయంత్రమే రిసెప్షన్ ఈ హోటల్లో వంటవాళ్ళు వంట బాగా చేస్తారని వాళ్లని తీసుకువెళ్లడానికి వచ్చాను అని సమాధానం చెబుతుంది. తీసుకెళ్ళు దోసకాయ పచ్చడి బాగా చేయించు.. అవి డాక్టర్ బాబుకు చాలా ఇష్టం అని సమాధానం చెబుతుంది. నేనే ఉంటే దోసకాయ పచ్చడి రోట్లో వేసి బాగా దంచే దాన్ని నీ తలకాయ మాదిరిగా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. ఇక దీపను బాధపెట్టాలని..గుడికి ఎవరు దిక్కులేని దానిలా ఒక్కటే వెళ్లకపోతే పిల్లలని కార్తీక్ ని తీసుకువెళ్ళవచ్చు కదా అంటూ దెప్పి పొడుస్తుంది. డాక్టర్ బాబుని తీసుకు వెళ్తే పిరికివాడిలా పారిపోయాడని నువ్వే అంటావు కదా.. అందుకే రేపు జరగబోయే రచ్చకు ఎనర్జీ కావాలని విశ్రాంతి తీసుకోమని చెప్పాను అంటూ సమాధానం చెబుతుంది.

దీపలో ఉన్న కాన్ఫిడెన్స్ చూసి ఏంటి దీనికి ధైర్యం అని మనసులో అనుకుంటుంది. ఇలా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగి చివరికి మోనితను దింపి కారు విజయవాడ వైపు వెళ్తుంది. దీపకి నాపై అనుమానం రాలేదు అంటూ మోనిత సంతోషపడుతుంది. ఇక అంజి ఉన్న హోటల్ కి వెళ్లి అంజి రూమ్ డోర్ కొట్టగానే అంజి తలుపుతీసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంజిని చూడగానే తన కాళ్ళపై పడి తనను క్షమించమని తను మారిపోయానని, తన తప్పును తెలుసుకొని కార్తీక్, దీపను కలిపానని, తాను పెళ్లి చేసుకోబోతున్నాను తన పెళ్ళికి రమ్మని అడుగుతుంది.మోనిత మాటలు విన్న అంజి కథ బాగా చెప్తున్నావు నీకు అందితే జుట్టు లేకపోతే కాళ్ళు.. నా కాళ్లు పట్టుకున్నావంటే నీకు ఏదో పెద్ద ప్రమాదం ఉంది అందుకే నా కోసం వెతుక్కుంటూ వచ్చావ్ అంటూ సమాధానం చెబుతాడు. ఇలా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? ఏంటి ?అనేది తరువాత ఎపిసోడ్ వరకు వేచి ఉండాలి.

కార్తీకదీపం : కీలక మలుపు తిరిగిన మోనిత కేసు..! కార్తీక్ కు చుక్కలు చూపించిన ఏసీపీ..!

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో అంజి దొరికాడని దీప అబద్ధం చెప్పడంతో మోనిత పార్టీ చేసుకుంటుంది.ఈ క్రమంలోనే అక్కడకు దీపా కార్తీక్ వెళ్లి మౌనిత కు షాక్ ఇస్తారు. ఇక నేడు కార్తీకదీపం సీరియల్ 1107 ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. మరి నేడు ఈ సీరియల్ ఎలా కొనసాగుతుందో తెలుసుకుందాం.. ఈ కేసు విషయమై డాక్టర్ బాబు ఏసిపి రోషిని ఇంటికి వెళ్తాడు. డాక్టర్ బాబుని చూసిన రోషిని రండి అంటూ అతనిని ఆహ్వానించింది. కార్తీక్ ని ఏంటి మీరు డాక్టర్ దగ్గరకు వెళ్లేలా ఉన్నారు. సరెండర్ అవ్వడానికి వచ్చారా? అంటూ ప్రశ్నిస్తుంది. ఏసీపీ ఇలా అనడంతో నేను తప్పు చేస్తే కదా.. సరెండర్ అవ్వడానికి అంటూ కార్తీక్ సమాధానం చెబుతాడు. ఈ క్రమంలోనే మోనిత కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మీరే కదా అంటూ తనదైన శైలిలో ప్రశ్నిస్తుంది.

ఈ క్రమంలోనే డాక్టర్ బాబు మోనిత కడుపులో పెరుగుతున్న బిడ్డకు నాకు ఏ సంబంధం లేదు తన పైశాచికత్వం రోజు రోజుకు పెరిగిపోతుంది. అని చెప్పడంతో తనకు జరిగిన అన్యాయానికి న్యాయపోరాటం చేస్తోంది అని ఏసీపీ చెబుతుంది. అసలు తనకు అన్యాయం జరిగితే కదా అంటూ కార్తీక్ సమాధానం చెబుతాడు. ఈ విధంగా ప్రశ్నలు ఎదురు ప్రశ్నలు వేస్తూ రోషిని ఏ సంబంధం లేకపోతే ఇన్ని రోజులు తనని ఎందుకు భరించారు? తన ఇంటికి ఎందుకు వెళ్లారు? తను పిలవగానే కారు ఎక్కి వెళ్తావు… తను చెయ్యి కోసుకుంటే పరిగెత్తి వస్తావు. తను గుండెనొప్పి తెప్పించిన క్షమించారు.. దీనికి ఏ పేరు పెట్టాలి? సంస్కార మా? అపరాధ భావమా అంటూ ప్రశ్నలు వేస్తోంది.

మీరు స్నేహం పేరుతో గంటలు గంటలు మోనిత ఇంట్లో కూర్చొని మందు తాగుతూ ఉంటారు. తనకు మీ పై ప్రేమ ఉందనీ తెలిసిన కూడా అక్కడికి వెళ్తుంటారు. అయినా మిమ్మల్ని మోనిత ఇంట్లోకి ఎలా రాణించింది..ఆడ, మగ స్నేహానికి చిన్న గీత ఉంటుంది. ఆ రేఖకు మీరు ఎటువైపు ఉన్నారా? అది చూసే వాళ్లకు తెలియదు కానీ మీరు ఆ రేఖలు దాటారు అంటూ అనడంతో కార్తీక్
స్టాపిట్ అని గట్టిగా అరిచి ఆ తరువాత తను ఒక పోలీస్ అధికారితో మాట్లాడుతున్నాను అని గ్రహించి క్షమాపణ చెబుతాడు. మోనిత మీపై పెట్టిన కేసుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది సాక్షాలు మీ వద్ద ఉన్నాయి. మగవాడి శీల పరీక్షకు మించిన అగ్నిపరీక్ష మరొకటి లేదంటూ రోషిని మాట్లాడుతుంది. అందుకు కార్తీక్ మీరు ఏం చెప్పినా అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నావల్ల దీపకు అన్యాయం జరగకూడదని చెబుతాడు.

మోనిత కేసు గురించి అనేక రకాలుగా ఆలోచిస్తున్నాను. అంజి పేరు ఎత్తితే ఆమె కంగారు పడుతుంది. అంజి కోసమే మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాను అంటూ కార్తీక్ సమాధానం చెబుతాడు.అంజి ఎక్కడున్నాడు చెప్పండి నేను వెళ్ళి తీసుకు వస్తాను అని కార్తిక్ అనడంతో ఈ కేసు మీరు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పనిలేదని అని చెబుతుంది. మిమ్మల్ని అరెస్టు చేస్తే దీప పిల్లలు, మౌనిత కడుపులో పెరుగుతున్న బిడ్డ అన్యాయం అయిపోతారు. మోనితకు న్యాయం చేస్తే దీపకు అన్యాయం చేసిన దాన్ని అవుతావు. అందుకోసమే మిమ్మల్ని అరెస్టు చేయకుండా ఆగాను. ఈ కేసును ఎలా పరిష్కరించాలో నాకు తెలుసు మీరు ప్రశాంతంగా ఉండండి. తప్పకుండా దోషి ఎవరు నిర్దోషి ఎవరో కాలమే బయటపెడుతుంది అంటూ రోషిని తెలిపారు. మరి ఆ తర్వాత కథ ఎలా సాగుతుందో తెలియాలంటే వేచి చూడాలి.

అంజి దొరికాడంటూ నాటకమాడిన దీప… పార్టీ చేసుకుంటున్న మోనిత.!

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు 1106 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. గత ఎపిసోడ్ లో భాగంగా దీప మోనిత ఏసీపీ ఇంటికి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. అక్కడ ఏసీపీ రోషిని మోనితను అంజి ఎవరు? అతనితో నీకు ఉన్న సంబంధం ఏమిటి? అంజిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నావా? అనే ప్రశ్నలు అడుగుతూ కంగారు పెట్టేస్తుంది. ఇంత రసవత్తరంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో నేటి ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో… ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందాం..

ఏసీపీ ఇంటికి వెళ్ళిన దీప,మోనితను రోషిని వివిధ రకాల ప్రశ్నలు అడుగుతూ కంగారు పెట్టేస్తుంది. ఈ క్రమంలోనే హిమ ఎవరు? హిమ నీకు తెలుసా? హిమ ఎలా చనిపోయింది అంటూ ప్రశ్నలు కురిపించారు. హిమ కు నీకు ఏమైనా పగ ఉందా? అని రోషిని ప్రశ్నించగా అందుకు..మోనిత ఏమీ లేదు అని సమాధానం చెబుతుంది. ఇంతలో దీప కలుగజేసుకొని ఆరోజు నడిరోడ్డులో నా ఫోన్, అంజి ఫోన్ ఎందుకు పగలగొట్టావ్.. మేమిద్దరం రోడ్డుపై మాట్లాడుకుంటే నువ్వెందుకు కంగారు పడ్డావు అంటూ నిలదీస్తుంది. దీప మాటలకు సమాధానం చెబుతూ.. అంజిని చూసి నేను ఎందుకు భయపడతాను. నువ్వు ఒక డాక్టర్ భార్యవి అలా డ్రైవర్ తో రోడ్డుపై మాట్లాడితే నాకు నచ్చలేదు అందుకే హెచ్చరించానని మోనిత సమాధానం చెబుతుంది.

ఈ విధంగా వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటే ఏసీపీ జోక్యం చేసుకుని ఇంతకు హిమ ఎవరు దీప అని రోషిని అడగటంతో.. హిమ మా ఆయన ప్రేమించిన వ్యక్తి. అందుకే మా పాపకు ఆ పేరే పెట్టాము. హిమ నీకు తెలుసా అని అడగడంతో మోనిత… నేను ,కార్తీక్, హిమ ముగ్గురం కలిసి చదువుకున్నాం. హిమ ఆక్సిడెంట్ లో చనిపోయింది. తనని నేనే అంజి చేత యాక్సిడెంట్ చేయించి చంపానని దీప నాపై నింద మోపుతోంది. హిమ కు యాక్సిడెంట్ చేస్తే ఆ కారులో కార్తీక్ కూడా ఉన్నాడు. కార్తీక్ ను ఎందుకు చంపించాలని అనుకుంటాను అంటూ
మోనిత సమాధానం చెబుతుంది. హిమను చంపించడానికి కంటే ముందుగా నువ్వు కార్తీక్ ను ప్రేమించావా? అని అడగడంతో అవునని సమాధానం చెబుతుంది మోనిత. ఈ మాట విన్న ఏసిపి ఇక నువ్వు వెళ్ళవచ్చు అనడంతో నన్ను వెళ్ళమని చెప్పిన ఏసిపి దీపతో మాట్లాడుతోంది అని కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్తుంది.

ఇక మోనిత బయటకు వెళ్లగానే ఏసీపీతో దీప మాట్లాడుతూ…మోనితను పిలిపించారు అంటే అంజి ఆచూకీ దొరికిందా మేడం అని అడగడంతో ఆ మాటలు విన్న మోనిత అంటే రిజిస్టర్ ప్రసాద్ కి ఫోన్ చేసి పెళ్లికి అభ్యంతరం చెప్పింది అంజి కాదా… ఇదంతా దీప ఆడుతున్న నాటకమా.. ?ఒసేయ్ దీప ఇంత నాటకం ఆడతావా.. ?చూస్తా.. నీ అంతు చూస్తా అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక అంజి దొరకలేదన్న ఆనందంతో మోనిత ఇంటికి వెళ్లి చికెన్ బిర్యాని తింటూ పార్టీ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే దీప కార్తీక్ అక్కడికి వెళ్లి ఆమెకు షాక్ ఇస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది తరువాత ఎపిసోడ్ లో చూడాలి.

నువ్వు చెల్లివి అవుతావో… చంచల్ గూడ ఖైదీవి అవుతావో.. అంటూ మోనితకు షాక్ ఇచ్చిన దీప!

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు
1105 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఈ సీరియల్ లో కార్తీక్,మోనితకు పెళ్లి జరుగుతుందా..? లేదా? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ క్రమంలోనే గత ఎపిసోడ్ లో భాగంగా మోనితకు రిజిస్టర్ నుంచి ఫోన్ రావడం, పెళ్లికి అభ్యంతరం చెప్పడం, ఏసిపి రోషిని నుంచి ఫోన్ రావడంతో మోనితకు తెగ కంగారు పడుతుంది. అసలు ఏం జరుగుతుంది అంటూ ఆలోచిస్తుండగానే మోనిత ఇంటికి దీపా ఎంట్రీ ఇచ్చి మరింత కంగారు పెడుతుంది. దీపని చూసి మరింత కంగారుకు గురైన మోనితను చూసి నా ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నావేంటి.. అంటూ దీప షాక్ ఇస్తుంది.

అక్క వచ్చి కాఫీ అడుగుతుంటే అలా నిల్చోని చూస్తున్నావ్ ఏంటి అంటూ ప్రియమణిపై మోనిత మండి పడటంతో అక్క అంటే నీ శరీరంలో ఒక ముక్క కూడా మిగలదని నీకు ఇంకా అర్థం కాలేదా? గుంట నక్కలకు అక్కలు చెల్లెల్లు ఉండరు పిచ్చిదానా అంటూ మోనిత తలపై మొటిక్కాయ వేయడానికి దీప చెయ్యి పైకెత్తితే భయంతో సోఫాలో పడిపోతుంది. ఈ క్రమంలోనే మోనిత మదిలో రిజిస్టర్ దుర్గాప్రసాద్, ఏసీపీ ఫోన్ కాల్, అంజి గురించి ఏవేవో ఆలోచనలు మెదులుతున్న క్రమంలో నీకు ఫోన్ వచ్చిందా.. అని దీప అడగడంతో మోనితకు కంగారు పడుతుంది. అప్పుడే రోషిని ఫోన్ రావడంతో కంగారుపడిన మోనిత ఫోన్ లిఫ్ట్ చేయగానే బయల్దేరావా.. అంటూ సీరియస్ గా ఏసిపి రోషిని అడుగుతుంది. కంగారుగా ఆ.. బయలుదేరాను మేడమ్ వస్తున్నా.. నీ కోసం కూడా నేను వెయిట్ చేయాలా త్వరగా రా అంటూ ఫోన్ కట్ చేస్తుంది.

ఫోన్ కట్ చేసిన తర్వాత మోనిత ఏసీపీ దగ్గరికి వెళ్తున్న మీ అందరి అంతు తేలుస్తా.. అనడంతో దీప చిటికెలు వేసే వెళ్తున్నా… కాదు వెళ్తున్నాం.. ఏసీపీ గారు నాకు ఫోన్ చేసి రమ్మన్నారు అంటూ రామ్మా.. చిలకమ్మా నీ చిలకపలుకులు అక్కడ వినిపిద్దువు. అక్కడ అంజి నీ పాత కథల గురించి ఏం చెబుతున్నాడో… ఏమో.. నువ్వు నువ్వు నాకు చెల్లెలివి అవుతావో… లేక చంచల్ గూడ ఖైదీవీ అవుతావో అంటూ మోనిత మెడ పట్టుకుని అక్కడి నుంచి లాక్కొని వెళ్తుంది. ఇలా ఇద్దరూ కలిసి రోషిని ఇంటికి వెళ్లడంతో రోషిని ఇద్దరికీ వెల్కమ్ చెబుతుంది. ఈ క్రమంలోనే మీ ఇద్దరిలో ఎవరు ఎవరిని ఇక్కడికి తీసుకు వచ్చారనీ అడగటంతో మోనిత ఇంటికి వెళ్తే మీ ఫోన్ వచ్చింది.. అందుకే ఇద్దరు కలిసి వచ్చాము అంటూ దీప సమాధానం చెబుతుంది. ఈ క్రమంలోనే
మోనిత చెప్పండి మేడం అర్జెంట్గా రమ్మన్నారు అని అడగడంతో.. అంజి అని ఏసీపీ చెప్పగా మోనిత ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఈక్రమంలోనే ప్రశ్నలపై ప్రశ్నలు అంజి గురించి అడుగుతూ రోషిని మోనితలో కంగారు పుట్టిస్తుంది. మరి రోషిని ప్రశ్నలకు మోనిత ఎలా సమాధానం చెబుతుంది? ఆ తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాలి.

మోనితాకు షాక్ ల మీద షాక్ లు.. ఏం జరిగిందంటే..?

కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఎప్పుడో సీరియల్ ను క్లోజ్ చేస్తారని అనుకున్న వారందరికీ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే 1104 ఎపిసోడ్‌లో జరిగిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే.. మోనిత ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న ప్రియమణికి మోగుతున్న ఫోన్లతో కంగారు పడిపోయింది. దీంతో మోనిత పడుకొని ఉండగా.. ఆమెను లేపింది. ఏంటి అంటూ కసురుకుంటూ ప్రియమణిని అడిగింది. అమ్మా.. మీకు ఫోన్లు వస్తున్నాయి అని అంటుండగానే మరో ఫోన్ మోగింది.

దీంతో అందులో ఒక ఫోన్ మ్యారేజ్ రిజిస్ట్రార్ నుంచి వచ్చింది. అందులో అతడు మోనితాకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. అంజి అనే వ్యక్తి 25న మీ పెళ్లికి అభ్యంతరం చెప్పాడని.. అతడిని ఒప్పిస్తేనే పెళ్లి జరుగుతుందని చెప్పడంతో ఒక్కసారిగా ఆమె కంగారు పడిపోయింది. తన పెళ్లిని కచ్చితంగా దీపానే అడ్డుకుంటుందని అనుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన పెళ్లిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న దీపపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ఎలాగైనా పెళ్లిని క్యాన్సిల్ చేసే ప్రయత్నాలు తిప్పి కొట్టాలని భావించింది. తర్వాత వెంటనే తనతో మోనిత పెళ్లికి అంజి అభ్యంతరం తెలపడంపై కార్తీక్‌లో ఆలోచనలు మొదలయ్యాయి.

గతంలో మోనిత గురించి ఏదో చెప్పడానికి ప్రయత్నించగా కొట్టిన విషయాలు గుర్తొచ్చాయి. అలాంటిది మోనిత పెళ్లిని ఎందుకు అడ్డుకొంటున్నాడు. నేను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయా అంటూ కార్తీక్ ఆలోచనల్లో పడిపోయారు. అంజిని దీప కలిసిందా అనే అనుమానం.. మోనితా మదిలో మెదిలింది. వెంటనే మరో ఫోన్ రాగానే ఆమె లిఫ్ట్ చేసింది. అటు ఫోన్ చేసింది రోషిణి. మోనితాను ఒకసారి కలవాలని ఆమె ఫోన్ లో చెప్పింది. ఎందుకు తనను కలవాలి అంటుందో అర్థం కాక.. ఇంకా కొత్త ఆలోచనలు ఆమెకు మొదలయ్యాయి.

ఈ గజిబిజి సమయంలో నే పనిమనిషి ప్రియమణిపై కోపం తెచ్చుకుంది. ఎప్పుడు కాఫీ అంటూ గొడవ ఏమిటి? నేను కాఫీ కోసమే పుట్టానా అంటూ కసురుకుంటుండగా.. అటు నుంచి దీపా నాకు ఇవ్వు నేను తాగుతా అని చెప్పింది. దీంతో మోనితా షాక్ కు గరయ్యింది. మోనితా ఇంట్లోకి దీపా ఎంట్రీ ఇవ్వడంతో ఏం జరుగుతుందోనని ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేపింది. ఇక వీరిద్దరి మధ్య ఎలాంటి వార్ చోటుచేసుకోనుందో చూడాలి..

కార్తికదీపం : “మీ అందరినీ బజారుకీడుస్తా…” అంటూ దీపపై రెచ్చిపోయిన మోనిత !

స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గత ఎపిసోడ్ ప్రేక్షకులలో ఎంతో ఉత్కంఠతను నెలకొల్పింది. ఈ క్రమంలోనే నేడు1103 ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. మరి ఈరోజు సీరియల్ ఎలా జరిగింది ఈరోజు ఎపిసోడ్ లోని హైలెట్స్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం… హాస్పిటల్ లో కార్తీక్ కోసం క్యారేజ్ తీసుకువెళ్లిన మోనిత కార్తీక్ నన్ను పెళ్లి చేసుకో అంటూ నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పిచ్చి పట్టిన దానిలాగా మన పెళ్లి కోసం సూటు తెచ్చాను… ఉంగరం తెచ్చాను 25న మన పెళ్లి.. ఇప్పుడు పెళ్లి చేసుకోనంటావేంటి డార్లింగ్.. పెళ్లి చేసుకోనంటే ఎలా కోరుకుంటాను అంటూ బెదిరిస్తుంది. ఈ క్రమంలోనే కార్తీక్ నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్పడంతో మోనిత పిచ్చిదాని లాగా ప్రవర్తిస్తుంది. ఈ క్రమంలోనే దీపను పట్టుకొని నీ భర్త అంటే నాకు పిచ్చి… అర్థం చేసుకోవే దీప..కావాలంటే నీ పిల్లల బాధ్యతలను నేనే తీసుకుంటాను అంటూ దీపను కుదిపేస్తోంది.

ఈ విధంగా మోనిత కార్తీక్ పై పిచ్చి ప్రేమను చూపిస్తూ.. పిచ్చి పట్టినదానిలా ప్రవర్తిస్తోంది. తన ప్రవర్తన చూసి భాగ్యం, ఆదిత్య, ఎంతో విస్తుపోతారు. ఈ క్రమంలో కార్తీక్ నిన్ను నేను ప్రేమించడం లేదు.. పెళ్లి చేసుకోను అని ఖరాఖండిగా చెప్పడంతో మోనిత షాక్ అవుతుంది. ఈ మాటలు విన్న మోనిత మరి నా గర్భం సంగతేంటి కార్తీక్? మరి నేను ఎలా ఉండిపోతాం అంటూ బెదిరించే ప్రయత్నం చేయడంతో షటప్ మోనిత అంటూ గట్టిగా అరుస్తాడు. ఒక పెళ్లైన వ్యక్తిని, ఇద్దరు పిల్లలు ఉన్న తండ్రిని ప్రేమించడమే కాకుండా… తన భార్య ముందు ఇలా అవమానిస్తావా? అని కార్తీక్ అనడంతో నేను నిన్ను ఇష్టపడుతున్నాను.. నువ్వు అవమానించావని పదేళ్లపాటు నీ భార్య నీకు దూరంగా ఉంది.కానీ మీరందరూ నన్ను ఎంత అవమానించిన, కొట్టినా, అసహ్యించుకున్న పదహారేళ్ల నుంచి నీకు దగ్గరగా ఉన్నా.. ఎవరి నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారు అంటూ కార్తీక్ ను నిలదీస్తుంది.

ఈ క్రమంలోనే మోనిత దీపతో మాట్లాడుతూ.. నువ్వైనా చెప్పమ్మా..నా తలరాతను మార్చమని చెప్పవే అంటూ బతిమాలాడుతుంది. నేనేమైనా మీ ఆస్తులు అడిగానా కార్తీక్.. కేవలం ఒక్క తాడు నా మెడలో వేయమని చెప్పాను అంతే కదా.. ఆ తాడు వేస్తే నీ భార్య నవ్వుతాను అంటూ ప్రాధేయపడుతోంది. అయినా ఒక తాడు మనల్ని శాసించడం ఏంటి అని మోనిత అడగడంతో దీప తాళికి ఉన్న విలువను చెబుతుంది. ఎంతో పవిత్రమైన ఇలాంటి తాళిని దానం చేయడానికి ఏ మహిళ ఒప్పుకోదు నీ ఉన్మాదం భరించేవారు ఎవరూ ఇక్కడ లేరు అంటూ దీప చెబుతూ కార్తీక్ ను అక్కడి నుంచి బయటకు వెళ్ళమని చెబుతుంది.

దీంతో కార్తీక్ బయటకు వెళ్లగానే మోనిత అందరిపై రెచ్చిపోయి మిమ్మల్ని బజారుకి ఈడుస్తాను… మీ పై దుమ్మెత్తి పోస్తాను అంటూ తిడుతూ అక్కడి నుంచి వెళ్తుంది. ఇక బాధతో బయట కూర్చుని ఆలోచిస్తున్న కార్తీక్ దగ్గరకు వెళ్లి భోజనం చేద్దాం రండి అని పిలుస్తుంది. ఆ సమయంలో కార్తీక్ మాట్లాడుతూ ఇలాంటి సమయంలో నాకు తోడుగా ఉండి నన్ను ఎంతో అర్థం చేసుకున్నావు.. నేను నిన్ను అర్థం చేసుకోలేక పోయాను అంటూ దీప రెండు చేతులు పట్టుకొని దండం పెడతాడు. ఆవేశంతో ఇంటికి వెళ్ళిన మోనిత ఆ తర్వాత ఏం చేస్తుందనే విషయాన్ని తర్వాత ఎపిసోడ్ లో చూడవచ్చు.