Movie News

నువ్వు చెల్లివి అవుతావో… చంచల్ గూడ ఖైదీవి అవుతావో.. అంటూ మోనితకు షాక్ ఇచ్చిన దీప!

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు
1105 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఈ సీరియల్ లో కార్తీక్,మోనితకు పెళ్లి జరుగుతుందా..? లేదా? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ క్రమంలోనే గత ఎపిసోడ్ లో భాగంగా మోనితకు రిజిస్టర్ నుంచి ఫోన్ రావడం, పెళ్లికి అభ్యంతరం చెప్పడం, ఏసిపి రోషిని నుంచి ఫోన్ రావడంతో మోనితకు తెగ కంగారు పడుతుంది. అసలు ఏం జరుగుతుంది అంటూ ఆలోచిస్తుండగానే మోనిత ఇంటికి దీపా ఎంట్రీ ఇచ్చి మరింత కంగారు పెడుతుంది. దీపని చూసి మరింత కంగారుకు గురైన మోనితను చూసి నా ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నావేంటి.. అంటూ దీప షాక్ ఇస్తుంది.

అక్క వచ్చి కాఫీ అడుగుతుంటే అలా నిల్చోని చూస్తున్నావ్ ఏంటి అంటూ ప్రియమణిపై మోనిత మండి పడటంతో అక్క అంటే నీ శరీరంలో ఒక ముక్క కూడా మిగలదని నీకు ఇంకా అర్థం కాలేదా? గుంట నక్కలకు అక్కలు చెల్లెల్లు ఉండరు పిచ్చిదానా అంటూ మోనిత తలపై మొటిక్కాయ వేయడానికి దీప చెయ్యి పైకెత్తితే భయంతో సోఫాలో పడిపోతుంది. ఈ క్రమంలోనే మోనిత మదిలో రిజిస్టర్ దుర్గాప్రసాద్, ఏసీపీ ఫోన్ కాల్, అంజి గురించి ఏవేవో ఆలోచనలు మెదులుతున్న క్రమంలో నీకు ఫోన్ వచ్చిందా.. అని దీప అడగడంతో మోనితకు కంగారు పడుతుంది. అప్పుడే రోషిని ఫోన్ రావడంతో కంగారుపడిన మోనిత ఫోన్ లిఫ్ట్ చేయగానే బయల్దేరావా.. అంటూ సీరియస్ గా ఏసిపి రోషిని అడుగుతుంది. కంగారుగా ఆ.. బయలుదేరాను మేడమ్ వస్తున్నా.. నీ కోసం కూడా నేను వెయిట్ చేయాలా త్వరగా రా అంటూ ఫోన్ కట్ చేస్తుంది.

ఫోన్ కట్ చేసిన తర్వాత మోనిత ఏసీపీ దగ్గరికి వెళ్తున్న మీ అందరి అంతు తేలుస్తా.. అనడంతో దీప చిటికెలు వేసే వెళ్తున్నా… కాదు వెళ్తున్నాం.. ఏసీపీ గారు నాకు ఫోన్ చేసి రమ్మన్నారు అంటూ రామ్మా.. చిలకమ్మా నీ చిలకపలుకులు అక్కడ వినిపిద్దువు. అక్కడ అంజి నీ పాత కథల గురించి ఏం చెబుతున్నాడో… ఏమో.. నువ్వు నువ్వు నాకు చెల్లెలివి అవుతావో… లేక చంచల్ గూడ ఖైదీవీ అవుతావో అంటూ మోనిత మెడ పట్టుకుని అక్కడి నుంచి లాక్కొని వెళ్తుంది. ఇలా ఇద్దరూ కలిసి రోషిని ఇంటికి వెళ్లడంతో రోషిని ఇద్దరికీ వెల్కమ్ చెబుతుంది. ఈ క్రమంలోనే మీ ఇద్దరిలో ఎవరు ఎవరిని ఇక్కడికి తీసుకు వచ్చారనీ అడగటంతో మోనిత ఇంటికి వెళ్తే మీ ఫోన్ వచ్చింది.. అందుకే ఇద్దరు కలిసి వచ్చాము అంటూ దీప సమాధానం చెబుతుంది. ఈ క్రమంలోనే
మోనిత చెప్పండి మేడం అర్జెంట్గా రమ్మన్నారు అని అడగడంతో.. అంజి అని ఏసీపీ చెప్పగా మోనిత ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఈక్రమంలోనే ప్రశ్నలపై ప్రశ్నలు అంజి గురించి అడుగుతూ రోషిని మోనితలో కంగారు పుట్టిస్తుంది. మరి రోషిని ప్రశ్నలకు మోనిత ఎలా సమాధానం చెబుతుంది? ఆ తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

8 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

9 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

16 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

17 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

17 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

1 day ago