Tag Archives: pan india

Actor Harish Kumar: ఒకప్పటి హీరో హరీష్ గుర్తున్నాడా? పాన్ ఇండియా హీరో కావాల్సిన హరీష్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?

Actor Harish Kumar: సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు. అయితే మంచి గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో నిలబడాలి అంటే అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. అయితే ఇండస్ట్రీకి బాలా నటుడిగా ఎంట్రీ ఇచ్చి అనంతరం వరుస తెలుగు తమిళ మలయాళం హిందీ భాషలలో సినిమాలు చేస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న వారిలో నటుడు హరీష్ ఒకరు.

ఇలా ఒకప్పుడు భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో సినిమాలు చేస్తున్నటువంటి ఈయన ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అన్ని భాషలలో కలిపి సుమారు 250కి పైగా సినిమాలలో నటించిన హరీష్ కుమార్ ఇండస్ట్రీకి దూరం కావడంతో ఎంతోమంది ఈయన ఇండస్ట్రీకి దూరమవ్వడానికి కారణం ఏంటి అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఒకప్పుడు అన్ని భాషలలో సినిమాలు చేసినటువంటి ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకోవాల్సి ఉండగా ఈయన మాత్రం ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఈయన హీరోగా అన్ని భాషలలో అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే ఈయనపై థర్డ్ గ్రేడ్ హీరో అనే ముద్రపడింది. ఈయన మలయాళంలో డైసీ సినిమా తర్వాత ఈయన వరుసగా ఐదారు ఇలాంటి చిత్రాలలో నటించడం వల్ల ఈయనకు థర్డ్ గ్రేడ్ హీరో అనే ముద్ర పడింది.

Actor Harish Kumar: థర్డ్ గ్రేడ్ హీరో అనే ముద్ర వేయించుకున్నారు…

ఇలా ఈయన పై ఇలాంటి ముద్ర ఉండడంతో అవకాశాలు రావడం కూడా క్రమక్రమంగా తగ్గిపోయాయి. ఇక తన వ్యక్తిగత కారణాల వల్ల కూడా సినిమాలలో నటించకుండా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఈయన ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం మలయాళంలో ఆయన నటించిన సినిమాలే కారణమని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం ఈయన తన భార్య పిల్లలతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు.

ఇక తెరపై సందడి చేయలేను సంచలన వ్యాఖ్యలు చేసిన నటి చార్మి..!

ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న నటీమణులలో నటి చార్మి ఒకరు. ఎన్నో సినిమాలలో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈమె ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉంటూ తెరవెనుక బాధ్యతలను చేపట్టారు. నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం నిర్మాతగా బాధ్యతలను చేపట్టారు. ఈమె పూరి జగన్నాథ్ తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్ తో కలిసి సంయుక్తంగా చిత్రాల నిర్మిస్తోంది.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండ అనన్య పాండే జంటగా పాన్ ఇండియా స్థాయిలో లైగర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సినిమాలలో హీరోయిన్ గా నటించాలంటే కేవలం ఫిట్ నెస్ పై దృష్టి పెడితే చాలని, అదే నిర్మాతగా బాధ్యతలు చేపట్టి మాత్రం ఎంతో కష్టపడాల్సి ఉంటుందని తెలిపారు.

నిర్మాతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి ఒక్క బాధ్యత మనపై ఉంటుంది. ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుందని ఈమె తెలిపారు. బాధ్యతలు చేపట్టాలని అంటే ఎంతో కష్టంతో కూడుకున్నది ఈమె తెలిపారు. అయితే తనకు నిర్మాణంలో ఎలాంటి ఇబ్బంది లేదని ఈమె తెలిపారు.

తను ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఈమెకు అవకాశాలు వస్తున్నాయనీ, అయితే తనకు నటించాలనే కోరికలేదని ఇకపై తాను నటించనని, ఇకపై ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతానని ఈ సందర్భంగా ఛార్మి తెలియజేశారు.

దుబాయ్ లో అల్లు అర్జున్.. అందుకే వెళ్లాడా..?

అప్పటి వరకు స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్.. పాన్ ఇండియా మూవీ పుష్ఫతో ‘ఐకాన్ స్టార్’ గా మారిపోయాడు. అల్లు అర్జున్ ఇక నుంచి ఐకాన్ స్టార్ అంటూ దర్శకుడు సుకుమార్ ఓ ఫంక్షన్ లో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పుష్ఫ సినిమా విడుదల కోసం ప్రతీ ఒక్కరూ ఎంతగానో ఎదురు చేస్తున్నారు.

మొదట ఒకే పార్ట్ గా విడుదల చేద్దామనకుకున్నా రెండు పార్ట్ లు తీయాల్సి వచ్చిందని దర్శకుడు సుకుమార్ అన్నారు. ఈ ఏడాది చివరకు మొదటి పార్ట్ ‘పుష్ప: ది రైజ్‌’ విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నారు. అందుకే షూటింగ్‌ త్వరగా పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇలా వృత్తి పరంగా ఎంతో బిజీ ఉన్న అర్జున్ వ్యక్తిగత జీవితానికి కూడా తగిన సమయాన్ని కేటాయిస్తున్నాడు.

తన కుటుంబంతో కలిసి ఈ మధ్య దుబాయ్ కు వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ పిక్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అధికారికంగా మాత్రం తెలియదు కానీ.. అతడు అక్కడే ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఎంతో యాక్టివ్ గా ఉంటాడన్న విషయం తెలిసిందే. అయితే పాన్ ఇండియా లెవల్లో తీస్తున్న ఈ పుష్ప సినిమాపై ప్రేక్షకులే కాకుండా సినీ ప్రముఖులు కూడా భారీగా అంచనా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప సినిమా హ్యట్రిక్ ది. ముందు ఆర్య, తర్వాత ఆర్యా2 తర్వాత మళ్లీ ఇలా ఈ సినిమా ద్వారా కలిశారు. అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి అయినా తనకు యూత్ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టిన సినిమా ‘ఆర్య’ అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు.

విజయ్ సేతుపతితో సందీప్ కిషన్ పాన్ ఇండియా చిత్రం.. దర్శకుడు ఎవరంటే?

ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి స్టామినా ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తమిళంతో పాటు, తెలుగులో కూడా ఎంతో ప్రేక్షకాదరణ పొందిన విజయ్ సేతుపతి హీరో సందీప్ కిషన్ తో ఓ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రంజిత్‌ జయకొడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది వరకు విడుదలైన “ది ఫ్యామిలీ మెన్”,  ‘స్త్రీ’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజ్‌ అండ్‌ డీకే ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికీ దర్శకుడు వీరితో కలిసి సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నటించడానికి ఇద్దరు హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమాకు లైన్ క్లియర్ అయింది. ఈ క్రమంలోనే అక్టోబర్ నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది.

ఇదివరకే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ మెన్ ఫస్ట్ సిరీస్ లో సందీప్ కిషన్ నటించారు. అదే విధంగా రాజ్‌ అండ్‌ డీకే డైరెక్షన్‌లో రానున్న “సన్నీ”(వర్కింగ్ టైటిల్) వెబ్ సిరీస్ లో విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు వేరువేరు చిత్రాల ద్వారా పరిచయమైన ఈ హీరో లిద్దరినీ ఒకే సినిమాలో చూపించబోతున్నారు.

ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న టువంటి ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ లో షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.

బిజీ బిజీగా ‘ప్రభాస్’.. 2025 వరకు అస్సలు ఖాళీ లేదట..??

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా చెలామణి అవుతున్న సంగతి తెలిసిందే..ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా మారుతున్న హీరోల్లో మన డార్లింగ్ ముందు వరుసలో ఉంటాడు…ప్రస్తుతం టాలీవుడ్లో వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను చేసుకుంటూ పోతున్న ప్రభాస్‌.. 2025 వరకు ఫుల్ బిజీగా ఉండనున్నాడు. ఇప్పుడిదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాహుబలి సినిమాతో ప్రభాస్‌ కు వచ్చిన క్రేజ్‌ కారణంగా అతనితో పరభాషా దర్శకులు, ముఖ్యంగా బాలీవుడ్ డైరెక్టర్స్ సినిమా చేయడానికి అత్యంత ఆసక్తి చూపుతున్నారు. దానికి తోడు ప్రభాస్‌ కూడా తనకు నచ్చిన స్క్రిప్ట్స్ కు ఓకే చెబుతూ వెళుతున్నాడు. దీంతో మరో మూడు, నాలుగేళ్ళ వరకూ ప్రభాస్‌ ఖాళీగా ఉండని పరిస్థితి ఏర్పడింది.ఇక ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ మూవీ ‘రాధేశ్యామ్’ తుదిమెరుగులు దిద్దుకుంటూ ఉండగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘సలార్’ సెట్స్ పై ఉంది.

అటు బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ త్రీడీ మూవీ ‘ఆదిపురుష్’ ఇటీవలే మొదలైంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ఈ ఏడాది చివరికి గానీ పూర్తి అయ్యేలా లేవు.అలాగే వచ్చే ఏడాది అంతా ప్రభాస్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో నాగ అశ్విన్ చేయబోతున్న చిత్రానికి డేట్స్ ఇస్తున్నాడని తెలుస్తోంది. ఈ సోషియో ఫాంటసీ సైంటిఫిక్ మూవీకీ భారీ డేట్స్ కేటాయించాల్సి ఉందట. దీనితో పాటే హిందీ ఫిల్మ్ మేకర్ సిద్ధార్థ్ ఆనంద్ తో సినిమా చేయడానికి కూడా ప్రభాస్ అంగీకారం తెలిపాడని బీ టౌన్ లో టాక్‌ వినిపిస్తోంది.

వీటితో పాటు సలార్‌ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మరో సినిమాకు… సుధా కొంగర డైరెక్షన్‌లో ఇంకో సినిమాకు ప్రభాస్‌ కమిట్ అయ్యాడని టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ల లిస్ట్ చూస్తుంటే… ప్రభాస్‌ 2025 వరకు మరే డైరెక్టర్ కు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. కాగా, ఈ విషయం తెలిసి అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.. మరి ఈ సినిమాలన్నీ ఎక్కువ గ్యాప్ లేకుండా విడుదలైతే ఇక డార్లింగ్ ఫ్యాన్స్ కి పండగే మరి..!!

మరో పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రానా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనదైన శైలిలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలో కూడా నటిస్తూ ఎంతో గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే రానా విరాటపర్వం అనే సినిమాలో ఓ విలక్షణమైన పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా రానా నటించిన అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో అడవి, అడవి జంతువుల నేపథ్యంలో వాటి హక్కులు రక్షణ గురించి చర్చించారు. ఇక ఆయన ప్రస్తుతం విరాటపర్వం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే రానా మరో పాన్ ఇండియా చిత్రాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది.

రానా హీరోగా పాన్ ఇండియా తరహాలో విశ్వశాంతి పిక్చర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ సినిమాను సీహెచ్ రాంబాబుతో కలిసి విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఆచంట గోపినాథ్ నిర్మించనున్నారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ చిత్రంగా ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా తర్వాత రానా ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొన్నట్లు సమాచారం.

గతంలో ఈ నిర్మాణ సంస్థలో బాలకృష్ణ టాప్ స్టొరీ, దేవుడు, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన జంబలకడిపంబ అనే బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించారు. ఈ సినిమా విషయానికి వస్తే మంత్ర తంత్రాలు.. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ మూవీగా దీనిని తెరకెక్కనున్న ఈ చిత్రానికి గృహం ఫేమ్‌ డైరెక్టర్ మిలింద్ రావ్ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం.ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం తెలియజేసింది.