Tag Archives: parents

Amardeep: తండ్రి కాబోతున్న బిగ్ బాస్ అమర్.. అసలు విషయం లీక్ చేసిన శ్రీముఖి?

Amardeep: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అమర్ దీప్ చౌదరి ఒకరు. ఈయన ఈ కార్యక్రమాల ద్వారా రన్నర్ గా నిలిచి బయటకు వచ్చారు. ఇక బిగ్ బాస్ పూర్తి అయినా అనంతరం ఈయన వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా కూడా బిజీ అయ్యారు.

బిగ్ బాస్ కార్యక్రమానికి రాకముందు బుల్లితెర నటుడిగా ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ ఉన్నటువంటి అమర్ ప్రస్తుతం వెళ్లి తెరపై హీరోగా సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక అమర్ మరొక బుల్లితెర నటి తేజస్విని గౌడ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరి జంట ఎంతో చూడముచ్చటగా ఉండటంతో వీరిని అనుసరించే వారి సంఖ్య కూడా అధికమైంది.

ఇకపోతే తాజాగా వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాలెంటైన్స్ డేను పురస్కరించుకొని స్టార్ మా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమర్ తేజ ఇద్దరు కూడా రొమాంటిక్ పర్ఫామెన్స్ చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు బుల్లితెర సెలబ్రిటీ కపుల్స్ హాజరై సందడి చేశారు.

తల్లిదండ్రులు కాబోతున్నారు..

ఈ క్రమంలోనే అమర్ తేజు గురించి శ్రీముఖి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి వీరిద్దరూ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారని వీరిద్దరూ బేబీకి జన్మనివ్వబోతున్నారు అంటూ శ్రీముఖి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి నిజంగానే అమర్ తేజు తల్లిదండ్రులు కాబోతున్నారా లేకపోతే శ్రీముఖి సరదాగా మాట్లాడారా అన్న విషయం తెలియదు కానీ ఈ విషయం వైరల్ గా మారడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Rashmika: నా విషయంలో వారు గర్వపడాలంటే.. నేను ఇంకా సాధించాల్సి ఉంది:రష్మిక

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక … ఈ పేరు గురించి తెలియని వారంటూ ఉండరు. కన్నడ సినిమా ద్వారా హీరోయిన్ గా మారిన రష్మిక ఇప్పుడు ఇటు సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఛలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రష్మిక ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకొని హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది.

ఇక గతేడాది విడుదలైన పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలలో నటించి అందరినీ మెప్పింది. పుష్ప సినిమా తో పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ ఇంటర్వ్యులో ఆమె మాట్లాడుతూ…” నటిగా నేను ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా నా విషయంలో నా తల్లి తండ్రులు ఇంకా గర్వపడలేదు.

చిత్ర పరిశ్రమలో నేనేం చేస్తున్నానో వారికి తెలియదు. ఎందుకంటె వారు మొదటి నుండి సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. అయితే నా నటనకు అవార్డులు వచ్చినప్పుడు మాత్రం వారు ఆనందిస్తారు అంటూ చెప్పుకొచ్చింది. అలాగే నా పని గురించి వారికి పూర్తి అవగాహన లేకపోయినా కూడా నాకు అవసరమైనవి అన్ని సమకూరుస్తున్నారు అని రష్మీక తెలిపింది. అందుకే నేను వారిని గర్వపడేలా చేయటానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది” అని తెలిపింది.

Rashmika: తల్లిదండ్రుల కష్టం చూసాను…

నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందిన రష్మీక ఇటీవల ఐఎండిబీ రూపొందించిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ లిస్టులో మూడవ స్థానంలో నిలిచింది. ఇక రష్మీక సినిమాల విషయానికి ప్రస్తుతం తెలుగులో పుష్ప 2 సినిమాతో పాటు మరో రెండు సినిమాలలో నటిస్తోంది. అలాగే హిందీలో కూడా ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తోంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉండే ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

Subba Raju: ఆ కేసు వల్ల అందరూ నా పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టారు… షాకింగ్ కామెంట్స్ చేసిన సుబ్బరాజు!

Subba Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు మాత్రమే కాకుండా చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి గుర్తింపు పొందారు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన వారిలో నటుడు సుబ్బరాజు కూడా ఒకరు. ఖడ్గం సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుబ్బరాజు ఆ తర్వాత పోకిరి, ఖలేజా, దేశముదురు, మిర్చి వంటి ఎన్నో సినిమాలలో పాజిటివ్ నెగిటివ్ పాత్రలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందాడు.

ఇలా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన సుబ్బరాజు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుబ్బరాజు తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇంటర్వ్యూలో ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నా మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని యాంకర్ ప్రశ్నించగా…సుబ్బరాజు మాట్లాడుతూ..” తనకి పెళ్లి చేసుకోవలసిన అవసరం రాలేదని అందువల్ల ఇప్పటికే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయానని చెప్పుకొచ్చాడు.

ఇక తన కుటుంబం గురించి మాట్లాడుతూ తన తండ్రి చాలా స్ట్రిక్ట్ అని సైకిల్ స్పీడ్ గా తొక్కినా కూడా ఎందుకు అంత స్పీడ్ గా తొక్కావని ప్రశ్నించేవాడని, గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అని అడిగేవాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తనకి మొహమాటం ఎక్కువని, అందుకే అవకాశాల కోసం డైరెక్టర్స్ ని అడగలేను అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా తన వల్ల తన తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే డ్రగ్స్ కేసులో పలుమార్లు విచారణకు హాజరైన సంగతి అందరికీ తెలిసిందే.

Subba Raju: డ్రగ్స్ కేసు వల్ల ఇబ్బందులు పడ్డాను…

ఈ కేసు గురించి మాట్లాడుతూ… డ్రగ్స్ కేసులో చిక్కుకున్నప్పుడు తాను ఇబ్బందులకు గురయ్యానని తెలిపాడు. సమాజంలో నా పరువు పోతుందన్న బాధ కన్నా ఈ విషయం వల్ల తన తల్లితండ్రులు చాలా ఇబ్బంది పడతారనే బాధ తనకు ఎక్కువగా ఉండేదని తెలిపారు.ఈ కేసు విషయం తెలిసిన తర్వాత చాలామంది మా ఇంటికి వచ్చి మీ అబ్బాయి డ్రగ్స్ కేసులో ఉన్నారట కదా అంటూ తన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే వారిని సుబ్బరాజు వెల్లడించాడు.

Lesbian Love: వివాహ బంధంతో ఒక్కటైన ఇద్దరు అమ్మాయిలు..! పెద్దల రియాక్షన్ ఇదే!

Lesbian Love: ఈ మధ్య కాలంలో మనదేశంలోనూ అమ్మాయి-అమ్మాయిలు, అబ్బాయిలు-అబ్బాయిలు, స్వలింగ సంపర్కుల వివాహాలు పెరుగుతున్నాయి. ఇప్పటికి వరకు విదేశాల్లోనే ఉన్న ఈ పోకడలు దేశంలోనూ పెరుగుతున్నాయి. ఇలాంటి అరుదైన ఘటన ఇటీవల జార్ఖండ్ లో చోటుచేసుకుంది.

Lesbian Love: వివాహ బంధంతో ఒక్కటైన ఇద్దరు అమ్మాయిలు..! పెద్దల రియాక్షన్ ఇదే!

మేజర్లయిన ఇద్దరు యువతులు తాము ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నామని ఇంట్లో నుంచి పారిపోయారు. సమీపంలోని ఓ గుడికి వెళ్లి వివాహం చేసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి తాము జీవితాంతం కలిసి ఉంటామని, మాకు రక్షణ కావాలని కోరారు. పోలీసులు వారివురి పెద్దలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి వారితో పంపించారు.

Lesbian Love: వివాహ బంధంతో ఒక్కటైన ఇద్దరు అమ్మాయిలు..! పెద్దల రియాక్షన్ ఇదే!

జార్ఖండ్ రాష్ర్టం ధన్ బాద్ జిల్లా జోరఖ్​పుర్ పోలీస్​ స్టేషన్ పరిధిలోని జామాడోబాలో రాఖి మిర్ధా(24), కరిష్మా రావత్​(23) అనే ఇద్దరు యువతులు నివాసముంటున్నారు. వీరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు అమ్మాయిలే కావడంతో పెద్దలు వారి పెళ్లికి అంగీరించరని భావించి ఆదివారం ఇంటి నుంచి పారిపోయారు.

వారికి దగ్గర్లోని ఓ దేవాలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం జోరఖ్ పుర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తాము జీవింతాంతం కలిసి ఉంటామని చెప్పారు. పోలీసులు వారి పెద్దలను పిలిపించారు. వారి తమ కూతుళ్లకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు ఒప్పుకోలేదు. చివరికి వారిని ఎలాగోలా ఒప్పించి ఇళ్లకు తీసుకెళ్లారు.

కానీ ఆర్టికల్ 15 ప్రకారం…

ఇటీవల ధన్ బాద్ ప్రాంతంలో ఇలాంటి వివాహాలు ఎక్కువయ్యాయి. మన దేశంలో లెస్బియన్, స్వలింగ సంపర్కులు, ఒకే లింగం కలిగిన వారి వివాహాలకు చట్టబద్ధత లేదు. కానీ ఆర్టికల్ 15 ప్రకారం వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకుండా ఉండేలా రక్షణ ఉంది. వారి అభిప్రాయాలను గౌరవిస్తూనే వారి సంక్షేమానికి, వారు జీవించేందుకు అవసరమైన రక్షణను 2019 చట్టం ప్రకారం కల్పిస్తుంది.

పిల్లలలో కోపం,చిరాకు ,మొండితనానికి కారణం తల్లిదండ్రులని మీకు తెలుసా….?

ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు డబ్బు సంపాదన ఉరుకుల పరుగుల జీవితంతో పిల్లల్ని పట్టించుకోవడం మానేశారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని వారికి మంచి జీవితాన్ని ఇవ్వటానికి కష్టపడుతూ వారి బాగోగులు కూడా చూడకుండా డబ్బు సంపాదన పడిపోయారు. కానీ డబ్బు సంపాదిస్తే భవిష్యత్తులో పిల్లలకి మంచి జీవితాన్ని ఇవ్వగలం అనుకుంటే అది పొరపాటే.

తల్లిదండ్రులు రాత్రి పగలు ఉద్యోగాలు అంటూ పిల్లల్ని కేర్ టేకెర్స్ దగ్గర వదిలి వెళ్లడం, వారి చదువు కోసం పిల్లల్ని ఉదయమే స్కూల్ కి పంపించడం రాగానే మరి ట్యూషన్ కి పంపడం వారితో సమయమే గడపకుంటే మీ పిల్లల మొండి తనానికి ,చిరాకుకి మీరే కారణం అవుతారు.

ఉద్యోగాల పనిలో పడి పిల్లలతో సమయం గడపకుండా ఉంటున్నాము. కానీ మన పనిని కాస్త పక్కన పెట్టి వారితో ప్రేమగా ఉండాలి. అప్పుడప్పుడు పిల్లలతో సమయం కేటాయిస్తూ వారిని బయటికి తీసుకుని వెళుతూ ఉండాలి. రోజుకి కొద్ది సమయం పిల్లలతో గడిపి వారి బాగోగులు వారి ఇబ్బందులు గురించి తెలుసుకోవాలి.

పిల్లలతో తల్లిదండ్రులు ప్రేమగా బాధ్యతగా ఉంటే పిల్లలు తల్లిదండ్రులతో వారి సమస్యలు గురించి మాట్లాడుతూ వారితో సమయాన్ని గడుపుతూ ఉంటే వారు ఎటువంటి ఒంటరితనాన్ని ఫీలవకుండా ఉంటారు. అలాగే తల్లిదండ్రుల పై ఎలాంటి కోపం చిరాకు లేకుండా మనతో ఎంతో స్నేహభావం గా ఉంటారు.

షణ్ముఖ్, దీప్తి పెళ్లి గురించి కండీషన్ పెట్టిన షన్ను తల్లిదండ్రులు..!

దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబర్స్ గా ఫేమస్ అయినా వీరిద్దరు ఎన్నో వీడియో సాంగ్స్ వెబ్ సిరీస్ లో నటిస్తూ బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇకపోతే వీరు తరచూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండటం వల్ల వీరికి సంబంధించిన విషయాల గురించి షేర్ చేయటం వల్ల వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని సందేహాలు వ్యక్తం చేశారు.

ఇటీవల ఈ విషయాన్ని వీరిద్దరూ బహిర్గతం చేశారు. ఇక ఒకరినొకరు ప్రేమించుకుంటున్న ఈ జంట త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై షణ్ముఖ్ తల్లిదండ్రులు స్పందించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా షన్ను పేరెంట్స్ మాట్లాడుతూ…

వీరిద్దరూ ప్రేమలో ఉన్న సంగతి మాకు తెలియదని మేము కూడా టీవీ షో లో చూసి ప్రేమించుకున్నట్లు తెలుసుకున్నామని ఈ సందర్భంగా షణ్ముఖ్ తల్లిదండ్రులు వెల్లడించారు. ఇక వీరు పెళ్లి గురించి మాట్లాడుతూ వీరి పెళ్లి విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదని అయితే దీప్తి సునయన తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుందని ఈ సందర్భంగా షణ్ముఖ్ తల్లి వెల్లడించారు. ఒకవేళ వారు ఒప్పుకున్న దీప్తి సునయన పెళ్లి ఇప్పుడే చేయమని ఇంకా షణ్ముఖ్ అన్నయ్య ఉన్నారని తనకు పెళ్లి అయిన తర్వాతే పెళ్లి చేస్తామని క్లారిటీ ఇచ్చారు.

తల్లిదండ్రులు చిన్నారులపై తరచూ చేసుకుంటున్నారా.. అయితే మీరు బాధ పడాల్సిందే!

ఇప్పుడు జనరేషన్ లో పిల్లలు ఎంత చలాకీగా ఉంటారో అందరికీ తెలిసిందే. మంచి లేదా చెడు ఏదైనా పిల్లలు తొందరగా నేర్చుకుంటారు. దానివల్ల కొన్ని సందర్భాల్లో పిల్లలు తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతుంటారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు కోపం వచ్చి వారిపై చేయి చేసుకుంటారు. కానీ పిల్లల్ని కొట్టడం వల్ల వారిలో మార్పు రాకపోవడం సరి మీపై నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది.

తాజాగా ఈ విషయం గురించి అధ్యయనం చేయటం వల్ల తేలిన విషయం ఏమిటంటే పిల్లల్ని కొట్టడం వల్ల వారిలో మార్పు రాకపోగా వారి బుద్ధి మందగిస్తుంది. అలాగే పిల్లల్లో తల్లిదండ్రుల మీద నమ్మకం పోయి ఇన్ సెక్యూరిటీ ఫీల్ అవుతారు.

మన భారతదేశం మరియు ఇతర 30 దేశాలలో పిల్లలను కొట్టటం నేరం కాదు. కానీ 62 దేశాలలో పిల్లల్ని కొట్టడం నేరంగా పరిగణిస్తారు. యునిసెఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం 25 కోట్ల మంది రెండు నుండి 4 సంవత్సరాలలోపు పిల్లలు శారీరక హింసకు గురవుతున్నారు.

పిల్లలు మనకి ఇబ్బంది కలిగించే పనులు చేసినప్పుడు కోపం వచ్చి వారిని కొట్టడం మంచిది కాదు. అలా చేయటం వల్ల వారు మన మాట వినకుండా ఇంకా మొండిగా తయారవుతారు. పిల్లలకి మంచి, చెడు గురించి వివరించి ఇంకొకసారి అటువంటి ఇబ్బంది కలిగించే పనులు చేయకుండా వారికి నచ్చచెప్పాలి. అలా కాకుండా వారిపై చేయి చేసుకోవడం ఏమాత్రం సరి అయినది కాదు.

దోశకు డబ్బులు ఇవ్వలేదని.. ఆత్మహత్య చేసుకున్నాడు బీటెక్ విద్యార్థి..

ఈ మధ్య కాలంలో చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు విద్యార్థులు. మరికొందరు ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు వంటి ఇతర బలమైన కారణాలతో జీవితంపై విరక్తితో బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. కానీ ఇక్కడ ఓ యువకుడు ఏ కారణంచేత ఆత్మహత్య చేసుకున్నాడో తెలిస్తే.. షాక్ అవుతారు. కేవలం కోడి గుడ్డు దోశకు డబ్బులు ఇవ్వలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాకాల మండలం తలారివారిపల్లికి చెందిన సాయి కిరణ్(21) కొత్తకోట సమీపంలోని వేము ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారు. అతడికి చిన్న తనంలోనే తన తండ్రి చనిపోయాడు. దీంతో తన తల్లి వద్దే పెరిగాడు. ఒక్కడే కొడుకు కాబట్టి ఆమె కూడా అతడిని ఎంతో గారాబంగా పెంచింది.

చదువులో కూడా అందరికంటే ముందుండేవాడు. అయితే అతడు తన తల్లిని కోడి గుడ్డు దోశ తినాలని ఉంది.. డబ్బులు ఇవ్వమని అడిగాడు. డబ్బులు ఇవ్వక పోవడంతో మనస్తాపానికి గురైన సాయికిరణ్ ఇంట్లో గోడవ పడి తన మొబైల్ ఫోన్‌ను ఇంటిలోనే వదిలి పెట్టి బయటకు వెళ్ళారు. కోపంతో బయటకు వెళ్తున్నాడు.. మళ్లీ వస్తాడులే అని ఆమె అనుకుంది.

కానీ అక్కడ జరిగింది వేరు. అతడు అలాగే నడుచుకుంటూ వెళ్లి గ్రామ సమీపంలోని గుర్రప్పకుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడ అతడిని కాపాడేందుకు కూలీలు ఎంతగానో ప్రయత్నించారు. కానీ అతడు అప్పటికే మృతి చెంది ఉండడంతో పోలీసులకు,‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కొడుకు మందుల కోసం 300 కిమీలు సైకిల్ తొక్కిన తండ్రి..?

కన్న పిల్లల కోసం తమ తల్లిదండ్రులు ఎంతటి సాహసానికైనా ఒడిగడతారు.తమ బిడ్డల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే తమ ప్రాణాలను సైతం అడ్డువేసి తమ బిడ్డలను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు. అచ్చం ఇలాంటి ప్రయత్నమే కన్నపేగు చేసింది. తన కొడుకు అనారోగ్యంతో బాధ పడుతున్న క్రమంలోతన కొడుకు మందుల కోసం ఏకంగా 300 కిలోమీటర్ల దూరం సైకిల్ పై ప్రయాణం చేసి మందులు తీసుకు వచ్చిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే….

బన్నూరు సమపీంలోని గనిగానకొప్పల్ గ్రామంలో నివసిస్తున్న ఓ వ్యక్తి నిర్మాణ సంస్థలో కూలి పనులు చేసుకుంటున్న తన కుమారుడు ఆరోగ్యం చూసుకునేవాడు. ఈ క్రమంలోనే అతడికి తన గ్రామం నుంచి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ (NIMHANS) వైద్యులు గత పదేళ్లుగా అతడి చికిత్స అందిస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రతి రెండు నెలలకు ఒకసారి ఆస్పత్రికి వెళ్లి తన కొడుకుకు మందులు తీసుకువచ్చే వాడు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ పరిస్థితులు తలెత్తడంతో మందులు తీసుకురావడానికి ఎంతో ఇబ్బంది కలిగింది.ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో తన కొడుకు మందులు వాడకపోతే ఎంతో ప్రమాదం కలుగుతుందని వైద్యులు సూచించడంతో ఎలాగైనా తన కొడుకు ప్రాణాలను నిలబెట్టుకోవాలని ఆ తండ్రి ఏకంగా సైకిల్ పై తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు.

ఈ క్రమంలోనే మే 23న సైకిల్ పై గనిగానకొప్పల్ గ్రామం నుంచి బయలుదేరిన ఆ వ్యక్తి మే 26న తిరిగి గ్రామానికి చేరుకున్నారు.సుమారు రానుపోను మూడు వందల కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించి తన కొడుకు కావలసిన మందులను తీసుకువచ్చాడు.

ఈ క్రమంలోనే సదరు వ్యక్తి మాట్లాడుతూ…18 సంవత్సరాలు పూర్తి అయ్యేవరకు తన కొడుకుకు మందులు ఇవ్వాలని..మందులు ఆపేస్తే తన కొడుకు మూర్ఛ వ్యాధితో మరణించే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెప్పడంతో ఈ విధంగా సైకిల్ మీదే అక్కడికి చేరుకొని తన కొడుకు కావలసిన మందులను తీసుకొచ్చానని, ఈ విషయం తెలిసిన ఆస్పత్రి యాజమాన్యం తనకు వెయ్యి రూపాయలు ఇచ్చి పంపినట్లు ఆ తండ్రి తెలిపారు.

ఈ స్టార్ హీరోయిన్ ప్రేమకు పెద్దలే విలన్లు అంట..?

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కైరా అద్వానీ. తెలుగులో నటించిన తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమెకు స్టార్ స్టేటస్ దక్కింది. హిందీ సినిమాల ద్వారా కెరీర్ ప్రారంభించిన కైరాకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎం ఎస్ ధోనీ, లస్ట్ స్టోరీస్ పేరు, గుర్తింపు తెచ్చిపెట్టాయి. తెలుగులో భరత్ అనే నేను సక్సెస్ కావడంతో కియారాకు వినయ విధేయ రామ సినిమాలో ఛాన్స్ దక్కగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

ఎలాంటి పాత్రలోనైనా నటించి తన నటనతో మెప్పించే కైరా అద్వానీ తన టీనేజ్ లవ్ విశేషాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో పేరెంట్స్ కోసం తన ప్రేమను త్యాగం చేయాల్సి వచ్చిందని ఈమె వెల్లడించింది. ప్లస్ 2 చదివే విషయంలో తనకు చదువు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదని అదే సమయంలో ఒక అబ్బాయిపై ప్రేమ కలిగిందని తెలిపింది. పాఠాలు కూడా వినకుండా ఆ అబ్బయినే చూసేదానినని అతడంటే అంత ఇష్టం ఉండేదని పేర్కొంది.

సెలవు రోజుల్లో అతని కోసం ఇంట్లో అబద్ధాలు చెప్పి కలవడానికి వెళ్లేదానినని.. అతనంటే అంత ఇష్టమని తెలిపింది. తల్లిదండ్రులు చదువుకోవాలని ఎంత చెప్పిన చదువు బుర్రకెక్కేది కాదని పేర్కొంది. అయితే చదువు, తల్లిదండ్రుల కోసం ప్రేమను త్యాగం చేశానని.. మొదట్లో బాధగా అనిపించినా ఆ తర్వాత మారానని కైరా తన క్యూట్ లవ్ స్టోరీ గురించి చెప్పించారు. కియారా లవ్ స్టోరీ గురించి నెటిజన్లు మీది కూడా మాలా బ్రేకప్ లవ్ స్టోరీనేనా…? అని కామెంట్లు చేస్తున్నారు.

తెలుగులో కైరాకు ఆఫర్లు లేకపోయినా బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో కైరా బిజీగా ఉంది. కైరా నటించిన లక్ష్మీ బాంబ్, ఇందూ కీ జవానీ సినిమాలు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా షేర్ షా, భోల్ బులియా 2 సినిమాలలో కైరా నటిస్తోంది.