General News

దోశకు డబ్బులు ఇవ్వలేదని.. ఆత్మహత్య చేసుకున్నాడు బీటెక్ విద్యార్థి..

ఈ మధ్య కాలంలో చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు విద్యార్థులు. మరికొందరు ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు వంటి ఇతర బలమైన కారణాలతో జీవితంపై విరక్తితో బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. కానీ ఇక్కడ ఓ యువకుడు ఏ కారణంచేత ఆత్మహత్య చేసుకున్నాడో తెలిస్తే.. షాక్ అవుతారు. కేవలం కోడి గుడ్డు దోశకు డబ్బులు ఇవ్వలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాకాల మండలం తలారివారిపల్లికి చెందిన సాయి కిరణ్(21) కొత్తకోట సమీపంలోని వేము ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారు. అతడికి చిన్న తనంలోనే తన తండ్రి చనిపోయాడు. దీంతో తన తల్లి వద్దే పెరిగాడు. ఒక్కడే కొడుకు కాబట్టి ఆమె కూడా అతడిని ఎంతో గారాబంగా పెంచింది.

చదువులో కూడా అందరికంటే ముందుండేవాడు. అయితే అతడు తన తల్లిని కోడి గుడ్డు దోశ తినాలని ఉంది.. డబ్బులు ఇవ్వమని అడిగాడు. డబ్బులు ఇవ్వక పోవడంతో మనస్తాపానికి గురైన సాయికిరణ్ ఇంట్లో గోడవ పడి తన మొబైల్ ఫోన్‌ను ఇంటిలోనే వదిలి పెట్టి బయటకు వెళ్ళారు. కోపంతో బయటకు వెళ్తున్నాడు.. మళ్లీ వస్తాడులే అని ఆమె అనుకుంది.

కానీ అక్కడ జరిగింది వేరు. అతడు అలాగే నడుచుకుంటూ వెళ్లి గ్రామ సమీపంలోని గుర్రప్పకుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడ అతడిని కాపాడేందుకు కూలీలు ఎంతగానో ప్రయత్నించారు. కానీ అతడు అప్పటికే మృతి చెంది ఉండడంతో పోలీసులకు,‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago