Tag Archives: pawan kalyan

Pawan Kalyan: గ్లాస్ డైలాగుపై మరోసారి స్పందించిన పవన్.. మీరు ఒప్పుకోవాలంటూ రియాక్ట్ అయిన హరీష్?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ప్రకటించి పూర్తిగా రాజకీయాల పైన ఫోకస్ పెట్టారు. ఇలా రాజకీయాల పరంగా ఈయన ఎంతో బిజీగా ఉండడంతో తన సినిమా షూటింగ్లన్నీ కూడా వాయిదా పడిన సంగతి మనకు తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమాలలో బిజీ అవుతున్నటువంటి తరుణంలో ఆయన నటిస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఇటీవల భగత్స్ బ్లేజ్ అంటూ ఒక వీడియో విడుదలైన సంగతి మనకు తెలిసిందే.

ఈ వీడియోలో భాగంగా పవన్ కళ్యాణ్ గ్లాస్ డైలాగులు అదిరిపోయాయని చెప్పాలి. పగిలే కొద్ది గ్లాస్ కి పదును ఎక్కువ.. గ్లాస్ అంటే సైజు కాదు అది కనిపించని సైన్యం అంటూ చెప్పినటువంటి ఈ డైలాగ్స్ భారీ స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ డైలాగు పట్ల తాజాగా పవన్ కళ్యాణ్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

తనకు సినిమాలలో ఇలాంటి డైలాగులు చెప్పడం అంటే ఇష్టం ఉండదని నేను హరీష్ శంకర్ దగ్గర చెప్పాను ఎందుకు ఇలాంటి డైలాగ్స్ పెట్టారని అడగగా అందుకు హరీష్ సమాధానం చెబుతూ మీకు తెలియదు మా బాధలు మాకు ఉన్నాయి ఇలాంటి డైలాగ్స్ రాకపోతే అభిమానులు ఊరుకోరు అంటూ హరీష్ సమాధానం చెప్పారని పవన్ వెల్లడించారు.

అభిమానులు ఊరుకోరు..
ఇలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వీడియో పై డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందిస్తూ.. మీ ప్రేమకు ధన్యవాదాలు సర్కార్ మీరు అంగీకరించాలే కానీ ఇలాంటివి ఇంకా రాస్తాము అంటూ ఈ సందర్భంగా హరీష్ శంకర్ చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

AP politics: పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు.. పవన్ స్ట్రాంగ్ వార్నింగ్!

AP politics: రేపు ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఎలాంటి పొత్తు లేకుండా ఎన్నికల బరిలోకి దిగిపోతుంది కానీ తెలుగుదేశం పార్టీతో జనసేన బిజెపి పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే ఇలా కూటమిగా ఏర్పడి ఎన్నికలలో గెలిచి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపించాలని ధ్యేయంగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు వెల్లడించారు.

ఇలా ఈ మూడు పార్టీల కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగుతున్నటువంటి తరుణంలో కొన్ని నియోజకవర్గాలలో పార్టీల కోసం ఎంతో కష్టపడినటువంటి వారికి సీట్లు రాకపోవడంతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోనే జనసేనలోనూ కూడా అభ్యర్థులు అలకలు మొదలుపెట్టారు. ఇటీవల బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడ వెస్ట్ సీటు జనసేన పార్టీకే కేటాయిస్తారని, పార్టీ తరపున తనకే సీటు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న పోతిన మహేష్ ఈ సీటు బీజేపీకి వెళ్లిపోవడంతో చాలా అసంతృప్తికి గురయ్యారు.

ఇలా బిజెపికి సేటు కేటాయించడంతో మహేష్ ఏకంగా జనసేన పార్టీ కార్యాలయం ముందు రెండు గంటల పాటు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈయనని పవన్ కళ్యాణ్ పిలిపించుకొని తనని బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు పదవి తప్పకుండా ఇస్తామని చెప్పిన మహేష్ మాత్రం తనకు టికెట్ కావాలని కోరారు.

పొత్తు ధర్మాన్ని పాటించండి..
ఇలా అభ్యర్థులు సహకరించకపోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.పొత్తు ధర్మాన్ని పాటిద్దామని కూటమిని గెలిపిద్దామంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. ఆ పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

Pitapuram: పవన్ ను ఓడించే అందుకు కోట్లు ఖర్చు చేస్తున్న వైసీపీ… పవన్ గెలుపును ఒప్పుకున్నట్టేగా?

Pitapuram: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో అందరి చూపు పిఠాపురం వైపే ఉంది పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు. అలాగే పొత్తులో భాగంగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అందరి చూపు పిఠాపురం పైనే ఉంది.

పిఠాపురంలో గ్రౌండ్ లెవెల్ లో చూస్తే కనుక పవన్ కళ్యాణ్ కు మెజారిటీ ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆయనకు పోటీగా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వంగ గీతాను జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దింపారు. అంతేకాకుండా ఎలాగైనా ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు కూడా రచిస్తున్నారు.

ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా ఆ నియోజకవర్గంలో మండలాల వారిగా ఇన్చార్జిలను కేటాయిస్తూ పార్టీ విజయానికి దోహదపడేలా కృషి చేస్తున్నారు. అంతేకాకుండా ఒక ఓటుకు పదివేలు చొప్పున డబ్బు కూడా పంచుతున్నారని ఇంటికి లక్ష రూపాయలు చొప్పున డబ్బును అందిస్తున్నట్టు సమాచారం.

ఓటుకు నోట్లు…
పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగా వైసిపి ముందడుగులు వేస్తున్నారు. ఇలా భారీ స్థాయిలో డబ్బును పంచుతున్నటువంటి తరుణంలో ఓటమి లక్ష్యంగా వైసిపి ముందడుగులు వేస్తున్నారు. ఇలా భారీ స్థాయిలో డబ్బును పంచుతున్నారని వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ నియోజకవర్గంపై ఆసక్తి నెలకొంది. ఇక వైసిపి ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గెలుపును వీరు ఒప్పుకున్నట్లేనని ఆయనకు భయపడే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది.

Pitapuram: పిఠాపురం పై ఫోకస్ చేసిన వైసీపీ అధిష్టానం.. పవన్ ఓటమి లక్ష్యమా?

Pitapuram: ఏపీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో వైసిపి అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టిందని తెలుస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో భాగంగా వైసిపి పార్టీ నుంచి వంగా గీత ఎన్నికల బరిలోకి రాబోతున్నారు కూటమి నుంచి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి రాబోతున్నారు.

ఎలాగైనా పిఠాపురం నియోజకవర్గం నుంచి వంగా గీత గెలుపొందే దిశగా వైసీపీ అధిష్టానం వ్యూహాలు రచిస్తుంది.ఇప్పటికే పిఠాపురంపై ఫోకస్ పెట్టాలని మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కన్నబాబు, ముద్రగడ పద్మనాభం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రీజనల్ కో- ఆర్డినేటర్ మిథున్ రెడ్డిలను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. మండలాల వారిగా నేతలకు బాధ్యతలు కూడా అప్పగించారు. ఇక నేడు ముద్రగడ్డ పద్మనాభం వంగ గీతా నేడు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు.

కాపు ఓట్లే లక్ష్యంగా..
పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నటువంటి తరుణంలో టిడిపి పార్టీకి చెందిన వారందరినీ కూడా వైసిపి పార్టీలోకి చేరే విధంగా దృష్టి పెట్టాలా చర్యలు చేపట్టాలని జగన్ ఆదేశించినట్లు తెలుస్తుంది. నియోజకవర్గంలో కాపు ఓటు బ్యాంకును వైసీపీ వైపుకు మళ్లించేలా సీఎం జగన్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో 90వేలకుపైగా కాపు ఓటర్లు ఉన్నారు. మెజార్టీ కాపు ఓటర్లను వైసీపీకి వైపుకు మళ్లిస్తే గీత గెలుపు ఖాయం అవుతుందని భావిస్తున్నారు ఎలాగైనా ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగా అధిష్టానం అడుగుల ముందుకు వేస్తున్నారని తెలుస్తుంది.

Janasena: పవన్ ప్రచార సభలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తెదేపా నాయకులు.. అందుకే పొత్తు పెట్టుకున్నారంటూ?

Janasena జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో పొత్తు కలిపిన సంగతి మనకు తెలిసిందే.వీళ్ళ పొత్తుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ 21 ఎమ్మెల్యే సీట్లను తీసుకొని ఎన్నికల బరిలోకి రాబోతున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ 21 ఎమ్మెల్యే స్థానాలలో పోటీ చేస్తున్నటువంటి తరుణంలో పలువురు ఈయనపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే ఎన్నికలు దగ్గర్లోనే రాబోతున్నాయి కానీ ఇప్పటివరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రచార సభను కూడా ఏర్పాటు చేయలేదు. పిఠాపురంలో మాత్రం కొన్ని సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇక నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు వచ్చారు. ఇటీవల చిలకలూరిపేట సభకు హాజరయ్యారు తప్ప ఎక్కడ కూడా ఆయన సభ ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు.

ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి వస్తున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఇలా ప్రచార కార్యక్రమాల విషయంలో మౌనం వహించడం ఏమాత్రం బాలేదంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక సభ నిర్వహించాలంటే భారీ స్థాయిలో ఖర్చు చేయాల్సి ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పార్టీ గెలుపు కోసం ఏమాత్రం కష్టపడటం లేదు.

రూపాయి ఖర్చు లేదు..
తన పార్టీని తెలుగుదేశం పార్టీలోకి పొత్తు కలిపి ఈయన మాత్రం రిలాక్స్ అవుతున్నారని, ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోకుండా ఎన్నికల బరిలోకి రాబోతున్నారని కామెంట్లు చేస్తున్నారు
ఇలాగైతే విజయం ఎలా వరిస్తుంది అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.మీరు ఇలా మౌనంగా ఉండటంతోనే మీరు పొత్తు ఎందుకు పెట్టుకున్నారనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. పొత్తులో భాగంగా డబ్బు ఖర్చు చేయకుండా ఎన్నికలలో పోటీ చేయవచ్చన్న ఆలోచనతోనే పొత్తుకు వచ్చారని అంతకుమించి పార్టీని గెలిపించుకోవాలన్నా నేపథ్యంలో పొత్తు పెట్టుకోలేదు అంటూ పలువురు పవన్ వ్యవహార శైలి పై విమర్శలు చేస్తున్నారు.

Pawan Kalyan: పవన్ మాటలకు యూటర్న్ తీసుకున్న పిఠాపురం రాజకీయం.. మొదలైన కొత్త తలనొప్పి!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా కొన్నిసార్లు ఆయన చేసే వ్యాఖ్యలు తనకు తలనొప్పిగా మారుతున్నాయి తాజాగా పిఠాపురంలో నిర్వహించినటువంటి సభలో భాగంగా ఈయన తాను కేంద్రం ఆదేశిస్తే కాకినాడ ఎంపీగా పోటీ చేయడానికి కూడా సిద్ధమేనంటూ కామెంట్లు చేశారు. నిజానికి ఇక్కడ జనసేన అభ్యర్థికి టికెట్ ఇవ్వడం లోకల్ టిడిపి నేత వర్మకు ఏమాత్రం ఇష్టం లేదు.

పవన్ కళ్యాణ్ కు టికెట్ ప్రకటించడంతో తాను టిడిపి పార్టీ నుంచి తప్పుకొని ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రకటించారు కానీ చంద్రబాబు నాయుడు పిలిచి తనని బుజ్జగించి ఎమ్మెల్సీలో పదవి ఇస్తానని చెప్పి జనసేనకు సపోర్ట్ చేయాలని కోరారు. దీంతో వర్మ జనసేనకు మద్దతుగా తెలుపుతున్నారు. ఇద్దరు కలిసి ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తాను కాకినాడ ఎంపీగా కూడా పోటీ చేయవచ్చు అంటూ కామెంట్లు చేశారు.

పిఠాపురం టికెట్ నాదే..
ఒకవేళ నేను కాకినాడ వెళ్లాల్సి వస్తే ఈ ప్లేస్ లో ఉదయ్ పోటీ చేస్తారు అంటూ ఈయన తెలిపారు. దీంతో వర్మ యూటర్న్ తీసుకున్నారు. ఒకవేళ ఈ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ తప్పుకుంటే ఈ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా వేరే వాళ్ళు నిలబడటానికి లేదని తానే పోటీ చేస్తాను అంటూ భీష్ముంచుకు కూర్చున్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే పవన్ కళ్యాణ్ కోసం సీటును త్యాగం చేసినట్లు చెప్పుకొచ్చారు. ఎంతో బాధతో స్థానాన్ని వదులుకున్నానని.. ఒకవేళ పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా పోటీచేస్తే పిఠాపురం టికెట్ తనదేనని అన్నారు.

Pawan Kalyan: నిర్మాతల డబ్బుతో పార్టీ ప్రచారం… గ్లాస్ డైలాగ్స్ పై నెటిజెన్స్ సెటైర్స్?

Pawan Kalyan: ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసే వారు. ఇక అభిమానుల సంగతి చెప్పాల్సిన పనిలేదు పెద్ద ఎత్తున అభిమానులు పవన్ కళ్యాణ్ సినిమా వస్తే చేసే హంగామా మాటల్లో వర్ణించలేనిది అయితే ఇటీవల కాలంలో ఈయన ఫోకస్ పూర్తిగా తగ్గిపోయిందని చెప్పాలి.

పవన్ కళ్యాణ్ సినిమాలను సినిమాలుగా కాకుండా రాజకీయాలను రాజకీయాలుగా కాకుండా రెండిటిని కలిపి చేయటంతో ఎటు కాకుండా పోతున్నారు. ఈయన సినిమాలలో తన రాజకీయ పార్టీకి సంబంధించిన డైలాగ్స్ పెడుతూ ప్రజలచేత చీ కొట్టించుకుంటున్నారు. ఇలా అటు సినిమాలకు ఇటు రాజకీయాలకు కాకుండా ఉన్నారు.

ఇకపోతే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలలో ఎక్కువగా రాజకీయానికి సంబంధించినటువంటి సన్నివేశాలు అధికమవుతున్నాయి. ఇటీవల బ్రో సినిమాల్లో కూడా ఈయన తన ప్యాకేజీ పాలిటిక్స్ చూపించారు అయితే తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా మరోసారి ప్యాకేజీ పాలిటిక్స్ చూపించారు.

గ్లాస్ అంటే సైన్యం..
గ్లాస్ పగిలే కొద్ది పదునెక్కువ గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అంటూ ఈయన చెప్పిన డైలాగ్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నేటిజన్స్ ఈ డైలాగ్ లు వేస్తున్నారు అసలు ఇది సినిమా కోసం చేసావా లేకుంటే నీ పార్టీ ప్రచారం కోసం చేసుకున్నారా అంటూ కామెంట్లో చేస్తున్నారు. ఆయన పాలిటిక్స్ విషయంలో పవన్ కి ఎవరు సాటిరారని తన సొంత డబ్బు ఖర్చు కాకుండా నిర్మాతల చేత డబ్బు ఖర్చు పెట్టి పార్టీ ప్రచారం చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.

Pawan Kalyan: అతని బాధ భరించలేక గ్లాస్ డైలాగు చెప్పాను.. ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పరంగా బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు అయితే ఇటీవల ఊహించని విధంగా ఈయన నటించిన ఉస్తాద్ సినిమా నుంచి చిన్నపాటి టీజర్ వీడియోని విడుదల చేశారు ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్ లో అదిరిపోయే లుక్ లో కనిపించారు. అంతేకాకుండా ఒక సన్నివేశంలో గ్లాస్ కిందకు పడేస్తూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ అభిమానులను పెద్ద ఎత్తున సందడి చేసాయి.

ఓ సన్నివేశంలో గ్లాస్ కింద పడేస్తూ గ్లాస్ పగిలే కొద్దీ దానికి పదును ఎక్కువ.. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అంటూ ఈయన చెప్పిన డైలాగ్స్ భారీ స్థాయిలో పేలాయి. అయితే ఈ డైలాగ్ చెప్పడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని కానీ హరి శంకర్ బాధ చూడలేకే తాను ఈ డైలాగ్స్ చెప్పానంటూ పవన్ కళ్యాణ్ ఈ డైలాగ్స్ గురించి వివరణ ఇచ్చారు.

పిఠాపురంలో నిర్వహించినటువంటి ఓ సమావేశంలో భాగంగా ఈ డైలాగ్ గురించి మాట్లాడుతూ.. హరీష్ నాకు కథ చెప్పేటప్పుడు ఈ సీన్ ఎందుకు పెడుతున్నావు అని అడగగా చాలామంది మీరు ఓడిపోయారు ఓడిపోయారు అంటూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది సర్ కానీ గాజు గ్లాస్ లక్షణం ఏంటో తెలుసా అది పగిలేకొద్ది పదును ఎక్కువ అందుకే ఈ డైలాగ్స్ పెడుతున్నాను అంటూ ఆయన చెప్పారని పవన్ తెలిపారు.

పార్టీ ప్రచారం కోసమా
ఇలాంటి డైలాగ్స్ చెప్పడానికి నేను పెద్దగా ఇష్టపడను నాకు సినిమాలలో ఈ విధమైనటువంటి డైలాగ్స్ నచ్చవు కానీ హరీష్ శంకర్ బాధ చూసి తాను చెప్పాల్సి వచ్చిందని తెలిపారు.ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది ఇది సినిమా ప్రమోషన్ల కోసం చేసినట్టు లేదని కేవలం తన పార్టీ ప్రచార కార్యక్రమాల కోసం చేసినట్టు ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Pawan Kalyan: జగన్ సారా వ్యాపారి.. వచ్చేది రామ రాజ్యమే.. సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్!

Pawan Kalyan: టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో చిలకలూరిపేట స‌మీపంలోని బొప్పూడిలో నిర్వ‌హించిన ప్రజాగళం భారీ సభను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాబోయే కురుక్షేత్ర సమరం తర్వాత ఏపీలో రాబోయేది రామ రాజ్యమేనని తెలిపారు. ప్రస్తుతం రావణాసురు పాలన సాగుతుందని త్వరలోనే రామరాజ్యం వస్తుందని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి అధికారం డబ్బు అండతో విర్రవీగిపోతున్నారని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి రేటు పూర్తిగా పడిపోయిందని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఒక సంక్షేమం లేదని అభివృద్ధి జరగలేదని నిరుద్యోగం పెరిగిపోయిందని తెలిపారు. ఈ కురుక్షేత్ర యుద్ధం తర్వాత రామరాజ్యం రాబోతుందని తెలిపారు. ఇక దేశమంతా డిజిటల్ రంగంలో ముందుకు దూసుకుపోతూ ఉండగా జగన్మోహన్ రెడ్డి మాత్రం మద్యం దుకాణాల వద్ద ఇంకా నగదు బదిలీ చేపడుతూ భారీగా దోచుకుంటున్నారని తెలిపారు. ఈయన ఒక సారా వ్యాపారి అంటూ పవన్ ఎద్దేవా చేశారు.

డ్రగ్స్ రాజధాని..
కేవలం మద్యం విషయంలో మాత్రమే కాదు ఇసుక తవ్వకాలలో కూడా జగన్ బినామీలు సుమారు 40 వేల కోట్ల వరకు దోచుకున్నారని పవన్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రాజధానిగా మారిపోయింది అంటూ జగన్ పరిపాలనపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు కురిపిస్తూ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అంటూ ఈ సందర్భంగా పవన్ తమ గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేశారు.