Tag Archives: pfizer vaccine

భారత్ వేరియంట్ పై సమర్థవంతంగా పని చేస్తున్న రెండు వ్యాక్సిన్లు.. ఏవంటే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంతో తీవ్రరూపం దాలుస్తున్న కరోనా రెండవ దశ వేరియంట్ ను గత ఏడాది అక్టోబర్ లోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ క్రమంలోనే భారత్ లో తొలిసారిగా గుర్తించిన రెండు వేరియంట్లపై ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్‌లు సమర్ధవంతంగా పని చేస్తున్నట్లు అమెరికా పరిశోధకులు తెలియజేశారు.

ఎన్‌వైయూ గ్రూస్‌మెన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, ఎన్‌వైయూ లాంగోన్ సెంటర్ సంయుక్తంగా జరిపిన పరిశోధనలో భారత్ రకం వేరియంట్లపై ఈ ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్‌లు ఎంతో సమర్థవంతంగా పని చేస్తున్నట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఈ టీకాల వల్ల వేరియంట్ లకు వ్యతిరేకంగా పోరాడే యాంటీ బాడీస్ బలహీన పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ పరిశోధనలో భాగంగా ఈ రెండు రకాల వ్యాక్సిన్లు తీసుకున్న వారి నుంచి రక్తనమూనాలను సేకరించి స్పైక్ ప్రాంతంలో వేరియంట్లను సూడోవైరస్ ఇంజినీరింగ్ ద్వార వేరు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ల్యాబ్ లో పెరిగిన కణాలపై యాంటీబాడీలు ఏ విధంగా పని చేస్తున్నాయని పరిశీలించగా B.1.617 వేరియంట్‌ను తటస్థీకరించే యాండీబాడీల పరిమాణంలో దాదాపు నాలుగు రెట్లు తగ్గినట్లు గుర్తించారు.

కొన్ని రకాల యాంటీబాడీలు ఈ వేరియంట్‌లపై పనిచేయకపోయినా.. మిగతా యాంటీబాడీలు మాత్రం వాటిని సమర్ధంగా అడ్డుకున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. దీనిని బట్టి చూస్తే ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయని నిపుణులు భావిస్తున్నారు

ఆ దేశంలో ఫైజర్ టీకా తీసుకున్న వారికి గుండెల్లో మంట.. ఎందుకంటే?

ప్రస్తుతం కరోనా మహమ్మారిను అరికట్టడం కోసం ప్రపంచ దేశాలన్నింటిలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ ప్రక్రియలో ప్రపంచ దేశాలన్నింటిలో కన్నా ఇజ్రాయిల్ మొదటి స్థానంలో ఉంది. గత ఏడాది డిసెంబర్ 19న ఈ దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా ఏప్రిల్ 20 నాటికి 65 శాతం మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపింది.

ఇజ్రాయిల్ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జాబితాలో ఇజ్రాయేల్ టాప్‌లో ఉంది. అయితే, ఫైజర్- బయోఎన్‌టెక్ కోవిడ్ వ్యాక్సిన్‌ను ఆ దేశం వినియోగిస్తున్నారు. ఈ టీకా వేయించుకోవడం వల్ల పలువురి గుండెల్లో మంట, కండరాల వాపు వంటి సమస్యలు తలెత్తడంతో ఈ కేసులపై ఇజ్రాయిల్ ఆరోగ్య అధికారులు పరిశోధనలు జరిపినట్లు కరోనా కమిషనర్ నచ్‌మన్ యాష్ వెల్లడించారు.

టీకా వేసుకున్న వారిలో దాదాపు 62 మందిలో ఈ విధమైనటువంటి లక్షణాలు తలెత్తాయని, తాజాగా మరో 12 కేసులు నమోదయ్యాయని తెలిపారు.30 సంవత్సరాలు ఉన్న వారిలో ప్రతి 20 వేల మందిలో ఒకరికి ఈ విధమైనటువంటి లక్షణాలు తలెత్తుతున్నాయి. తాజాగా ఇద్దరు మృత్యువాత పడినట్లు తెలిపారు.

టీకా ప్రయోజనం చాలా గొప్పదిగా కనిపిస్తోంది. కొన్ని కేసులలో టీకాతో సంబంధం ఉన్నప్పటికీ, ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవడం సమర్ధనీయం కాదు’’ అని యాష్ తెలిపారు. ఇదే విషయం గురించి ఫైజర్ కంపెనీకు సమాచారం అందించగా వారు ఈ విషయంపై స్పందించి వ్యాక్సిన్ వల్ల కండరాలు నొప్పులు రావడం తమ దృష్టికి వచ్చిందని వెల్లడించారు.

ఫైజర్ టీకా వల్ల సాధారణ జనాభాలో ఊహించిన దానికంటే ఎక్కువగా మయోకార్డియల్ రేటును గమనించలేదు. వ్యాక్సిన్ కు మయోకార్డియల్ రేటుకు ఏమాత్రం సంబంధం లేదని,వ్యాక్సిన్ వల్లే ఈ విధమైనటువంటి సమస్య ఏర్పడిందని చెప్పడానికి ఏ విధమైనటువంటి ఆధారాలు లేవని ఫైజర్ పేర్కొంది.

అలర్జీ ఉన్నవాళ్లు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా..?

కొన్ని రోజుల క్రితం వరకు కరోనా వైరస్ గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి రాగా ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ల గురించి వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. బ్రిటన్ డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్స్ అలర్జీతో బాధ పడేవాళ్లు కరోనా వ్యాక్సిన్ ను తీసుకోవద్దని సూచనలు చేశారు. బ్రిటన్ ప్రభుత్వం నిన్న కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. నేషనల్‌ హెల్త్‌ సర్వీస్ కు చెందిన ఇద్దరు హెల్త్ వర్కర్లు వ్యాక్సిన్ ను తీసుకోగా వాళ్లు అస్వస్థతకు లోనయ్యారు.

దీంతో బ్రిటన్ కు చెందిన అధికారులు మందులు, ఆహార పదార్థాలకు అలర్జీ వచ్చే వాళ్లు ఫైజర్‌– బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్ ను తీసుకోకూడదని సూచనలు చేసింది. యూకే డ్రగ్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇద్దరికి ఒళ్లంతా దద్దుర్లు రావడంతో పాటు రక్తప్రసరణలో మార్పులు వచ్చినట్టు గుర్తించామని తెలిపింది. వైద్యులు వ్యాక్సిన్ ఇచ్చేముందు రోగుల మెడికల్ హిస్టరీని పరిశీలించాలని సూచనలు చేసింది.

మెడికల్ హిస్టరీలో ఎవరైనా అలర్జీతో బాధ పడుతున్నట్టు తేలితే వ్యాక్సిన్ ఇవ్వవద్దని సూచనలు చేసింది. సాధారణంగా కొత్తగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని.. మెడికల్ హిస్టరీని పరిశీలించి వ్యాక్సిన్ ఇవ్వాలో వద్దో నిర్ణయం తీసుకోవాలని అధికారులు వైద్యులకు సూచించారు. అయితే సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడ్డ వాళ్లు కోలుకుంటున్నారని.. వారికి ప్రాణాలకు ఎటువంటి అపాయం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రస్తుతం బ్రిటన్ దేశంలో వయస్సు పై బడిన వారికి మొదట కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. బ్రిటన్ ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతోంది. అయితే ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కొద్దిమందిలో మాత్రం బెలీ పాల్స్ సమస్యను గుర్తించామని వైద్యులు చెబుతున్నారు.