ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంతో తీవ్రరూపం దాలుస్తున్న కరోనా రెండవ దశ వేరియంట్ ను గత ఏడాది అక్టోబర్ లోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ క్రమంలోనే భారత్ లో తొలిసారిగా గుర్తించిన రెండు వేరియంట్లపై ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు సమర్ధవంతంగా పని చేస్తున్నట్లు అమెరికా పరిశోధకులు తెలియజేశారు.
ఎన్వైయూ గ్రూస్మెన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, ఎన్వైయూ లాంగోన్ సెంటర్ సంయుక్తంగా జరిపిన పరిశోధనలో భారత్ రకం వేరియంట్లపై ఈ ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు ఎంతో సమర్థవంతంగా పని చేస్తున్నట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఈ టీకాల వల్ల వేరియంట్ లకు వ్యతిరేకంగా పోరాడే యాంటీ బాడీస్ బలహీన పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ పరిశోధనలో భాగంగా ఈ రెండు రకాల వ్యాక్సిన్లు తీసుకున్న వారి నుంచి రక్తనమూనాలను సేకరించి స్పైక్ ప్రాంతంలో వేరియంట్లను సూడోవైరస్ ఇంజినీరింగ్ ద్వార వేరు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ల్యాబ్ లో పెరిగిన కణాలపై యాంటీబాడీలు ఏ విధంగా పని చేస్తున్నాయని పరిశీలించగా B.1.617 వేరియంట్ను తటస్థీకరించే యాండీబాడీల పరిమాణంలో దాదాపు నాలుగు రెట్లు తగ్గినట్లు గుర్తించారు.
కొన్ని రకాల యాంటీబాడీలు ఈ వేరియంట్లపై పనిచేయకపోయినా.. మిగతా యాంటీబాడీలు మాత్రం వాటిని సమర్ధంగా అడ్డుకున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. దీనిని బట్టి చూస్తే ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయని నిపుణులు భావిస్తున్నారు
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…