Featured

పోలీసుల ఎదుటే కరోనా శవాన్ని దారుణంగా.. చివరికి?

దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు అధికం అవుతున్న నేపథ్యంలో కరోనా శవాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి స్మశాన వాటికలో స్థలం లేకపోవడంతో ఎన్నో మృతదేహాలు గంగానదిలో కొట్టుకు వస్తున్న ఘటన చోటుచేసుకుంది. ఇప్పటికి కూడా గంగానది ఒడ్డుకు మృతదేహాలు కొట్టుకునే వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ విధంగా ఒడ్డుకు కొట్టుకు వచ్చిన మృతదేహాలు పట్ల ఉత్తరప్రదేశ్లో అమానవీయ చోటు చేసుకుంది.

యూపీలోని బలియాలో గంగానది ఒడ్డుకు కొట్టుకు వచ్చిన మృతదేహాన్నికోవిడ్ మృతదేహంగా భావించి అక్కడ ఉన్న స్థానికులు ఆ శవాన్ని కట్టెలపై ఉంచి పెట్రోల్, టైర్లు వేసి దహనం చేశారు. అయితే ఈ ఘటన ఐదుగురు పోలీసుల సమక్షంలో జరగడంతో ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గంగా నది ఒడ్డుకు కొట్టుకు వచ్చిన కరోనా మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిపించాలని,అందుకు తగిన ఆర్థిక సహాయం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేస్తుందని ఇదివరకే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపినప్పటికీ, పోలీస్ అధికారులు ఎంతో బాధ్యతారహితంగా మృతదేహం పట్ల ఈ విధంగా వ్యవహరించడంతో అధికారులు ఆ అయిదుగురు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై సస్పెన్షన్ వేటు వేశారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా గంగానది ఒడ్డుకు మృతదేహాలు కొట్టుకు వస్తున్నాయని, ఈ విధంగా మృతదేహాలు నీటిలో కలపడం వల్ల నీరు కలుషితంగా మారి మరి కొన్ని కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని, నీటి ద్వారా ప్రజల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

డైట్‌లో అవకాడో చేర్చారా? ఈ ప్రయోజనాలు తెలుసుకుంటే మిస్ కావడం అసాధ్యం!

ఆరోగ్యంపై దృష్టి పెడుతున్న ఈ రోజుల్లో, ఆహారంలో చిన్న మార్పులే పెద్ద ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఆరోగ్యకరమైన…

22 minutes ago

ఒక్క సమోసా తింటే 4 కి.మీ నడవాలా? బర్గర్, పిజ్జా తిన్నాక ఎంత వ్యాయామం చేయాలి? లెక్కలు ఇవే!

ఇప్పటి వేగవంతమైన జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వినియోగం గణనీయంగా పెరిగింది. సాయంత్రం అయ్యాక సమోసా, పానీపూరీ, బర్గర్,…

52 minutes ago

నైట్ డ్యూటీ చేస్తున్నవాళ్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఆరోగ్య చిట్కాలు!

ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో ఉద్యోగ సమయాలు కూడా పెద్దగా మారిపోయాయి. ఐటీ, హెల్త్‌కేర్, సర్వీస్ రంగాల్లో పని చేసే చాలా…

1 hour ago

కిడ్నీ వ్యాధి ముందస్తు సంకేతాలు ఇవే… రాత్రి తరచూ మూత్రం వస్తుందా? జాగ్రత్త… ఇది కిడ్నీ సమస్య కావచ్చు

మన శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తంలో ఉన్న వ్యర్థాలను తొలగించడమే కాకుండా, శరీరంలో ద్రవాల సమతుల్యతను…

2 hours ago

30 తర్వాత కండరాలు క్షీణిస్తున్నాయా? నడవడంలో ఇబ్బంది? ఇది సార్కోపీనియా సంకేతమా?

వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు సహజమే. అయితే ఇటీవల చాలా మందిలో కనిపిస్తున్న ఒక సమస్య నిపుణులను…

2 hours ago

ఒకసారి వాడిన నూనె మళ్లీ వాడుతున్నారా? ఇది తప్పక తెలుసుకోండి!

మన రోజువారీ వంటకాలలో నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు దాదాపు ప్రతి…

3 hours ago