Tag Archives: Photos going viral

Klin kaaraa: క్లీన్ కారా కోసం నైట్ డ్యూటీ చేస్తున్న… చెల్లి పై ఓ కన్నేసా… వైరల్ అవుతున్న రైమ్ ఫోటో!

Klin kaaraa: మెగా కోడలు ఉపాసన రాంచరణ్ లకు మూగజీవాలు అంటే ఎంత ప్రాణమో మనకు తెలిసిందే. ఇలా మూగజీవాలను సంరక్షణ చేపడుతూ ఇప్పటికే ఎన్నో జంతువులను తమ ఇంట్లో పెంచుతూ ఉండగా మరికొన్ని జంతువులను వీరు దత్తత తీసుకొని వాటి సంరక్షణ బాధ్యతలను కూడా తీసుకున్నారు.

ఈ విధంగా మూగజీవాలు అంటే ఎంతో ప్రాణం ఇచ్చే ఉపాసన రాంచరణ్ ప్రస్తుతం తమ బిడ్డ ఆలనా పాలన చూసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇలా తమకు కుమార్తె జన్మించినప్పటికీ మూగజీవాల పట్ల ఏమాత్రం ప్రేమ తగ్గలేదని చెప్పాలి. రామ్ చరణ్ ఉపాసనలకు ఎంతో ఇష్టమైనటువంటి పెట్ డాగ్ రైమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరు ఎక్కడికి వెళ్ళినా తమ వెంట రైమ్ ఉంటుంది.

ఇక ఈ రైమ్ కి ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. అంతేకాకుండా దీని కోసం ప్రత్యేకంగా ఒక ఇంస్టాగ్రామ్ కూడా ఓపెన్ చేశారు. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన అన్ని విషయాలను ఈ ఇంస్టాగ్రామ్ పేజ్ ద్వారా అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా రైమ్ కి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Klin kaaraa: చెల్లిపై ఓ కన్నేసాను…


ఉపాసన కుమార్తెను వదిలి రైమ్ ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారని తెలుస్తుంది. తను పడుకున్న కూడా తనకు కాపలాగా రైమ్ ఉన్నారని తాజాగా ఈ ఫోటో ద్వారా తెలుస్తుంది. చిన్నారి క్లీన్ కారా ఊయలలో పడుకొని ఉండగా రైమ్ మాత్రం తనని చూస్తూ ఉంది ఈ ఫోటోని షేర్ చేసిన అనంతరం ఈ ఫోటోకి నైట్ డ్యూటీ చేస్తున్నా.. చెల్లిపై ఓ కన్నేసాను అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

Samantha: ఆరోగ్యం బాగా లేకపోయినా ఆ పని మాత్రం విడిచిపెట్టనీ సమంత… వైరల్ అవుతున్న ఫోటోలు!

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సమంత ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. కేవలం తనకు వచ్చినటువంటి మయోసైటిస్ వ్యాధిని పూర్తిగా తగ్గించుకోవడం కోసమే ఈమె కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటూ చికిత్స తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ విధంగా సమంత సినిమాలకు విరామం ప్రకటించారు.


ఇలా సమంత సినిమాలకు దూరమవుతున్నా అని చెప్పడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందినప్పటికీ తాను ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు.ఇక ఇప్పటికే ఈమె కమిట్ అయినటువంటి సినిమా షూటింగ్ పనులు అన్నింటిని కూడా పూర్తి చేసుకున్నారు. త్వరలోనే చికిత్స నిమిత్తం ఈమె అమెరికా వెళ్లబోతున్నారు.

ఈ విధంగా సమంత ఆరోగ్యం బాగా లేకపోయినా సమంత మాత్రం తన వ్యాపారాలను భారీ స్థాయిలో ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈమె సాకీ అనే దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే.ఇలా వ్యాపారంతో వచ్చే లాభాలను సమంత తన ఫౌండేషన్ కోసం అలాగే తన సోషల్ మీడియా కార్యకలాపాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు.

Samantha: సాకీ బ్రాండ్ ప్రమోషన్లలో సమంత…


దీద్ధో తనకు ఆరోగ్యం బాగా లేకపోయినా తన బ్రాండెడ్ దుస్తులను ధరిస్తూ ఈమె భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా తన బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ సమంత షేర్ చేసినటువంటి ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తన ఆరోగ్యం బాగా లేకపోయినా తన వ్యాపారాన్ని మాత్రం ముందుకు తీసుకువెళ్లాలని ఎంతో కష్టపడుతున్నారు అంటూ పలువురు ఈ ఫోటోలపై కామెంట్స్ చేస్తున్నారు.

Bigg Boss 7: బిగ్ బాస్ సెవెన్ హోస్ట్ గా ఈసారి కూడా నాగార్జునే…. వైరల్ అవుతున్న ఫోటో!

Bigg Boss 7: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివిధ భాషలలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తుంది. అయితే తెలుగులో కూడా ఇప్పటికీ ఆరు సీజన్లను పూర్తి చేసుకుని ఏడవ సీజన్ ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు పొందడమే కాకుండా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ గురించి ఇప్పటికే లోగో ప్రోమో విడుదల చేయడంతో త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. ఇక త్వరలోనే ఈ కార్యక్రమానికి హోస్ట్ ఎవరు ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ ల గురించి కూడా తెలియజేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈసారి ఈ కార్యక్రమానికి నాగార్జున కాకుండా మరో స్టార్ హీరో వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారంటూ ఇన్ని రోజులు ఓ వార్త వైరల్ గా మారింది. అయితే ఇవన్నీ అవాస్తవమేనని ఈ సీజన్ కి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారంటూ తాజాగా ఓ ఫోటో వైరల్ గా మారింది. ఈ సీజన్ కి సంబంధించిన ఒక ప్రోమో వీడియోని విడుదల చేయడం కోసం ఇప్పటికే నాగార్జున ఫోటోషూట్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది.

Bigg Boss 7: అదిరిపోయిన నాగార్జున లుక్…


ఈ క్రమంలోనే నాగర్జునకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇందులో నాగార్జున మాస్ లుక్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ఈయన చేతి ద్వారా సెవెన్ అనే సింబల్ చూపిస్తూ ఈ ఫోటో ఉండడంతో ఈ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారక ప్రకటన కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది.

Kajal Aggarwal: భర్త కౌగిలిలో బందీ అయిన కాజల్ అగర్వాల్… రొమాంటిక్ మూడ్ లో చిల్ అవుతున్న నటి!

Kajal Aggarwal: వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీ లోకి వచ్చిన సమయం నుంచి ఇప్పటివరకు తన కెరియర్ ఏమాత్రం పడిపోకుండా చాలా బ్యాలెన్స్ గా ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈమె రెండు సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరమై తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చారు.

ఇక ఇండస్ట్రీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా కాజల్ అగర్వాల్ ఏమాత్రం అవకాశాలను కోల్పోకుండా వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న కాజల్ మరోవైపు వ్యక్తిగత జీవితంలో తన భర్త కొడుకుకు కూడా అదే ప్రాధాన్యత ఇస్తూ వారితో కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు.

ఇలా వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన జీవితంలో కూడా కాజల్ ఎంతో బిజీగా సంతోషంగా గడుపుతున్నారు. ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే తాజాగా కాజల్ తన భర్తతో కలిసి వెకేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసారు.

Kajal Aggarwal: రొమాంటిక్ కపుల్స్…


బోటింగ్ చేస్తూ ఎంతో చిల్ అవుతున్నటువంటి కాజల్ అగర్వాల్ తన భర్త కౌగిలిలో బందీ అయ్యారు. ఇలా తన భర్తతో కలిసి రొమాంటిక్ మూడ్ లో ఈమె దిగినటువంటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసినటువంటి ఎంతో మంది అభిమానులు క్యూట్ కపుల్స్ రొమాంటిక్ కపుల్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎప్పుడు ఇలాగే ఉండాలని మరికొందరు కోరుకుంటున్నారు.

Sunitha: ఇండస్ట్రీలో సింగర్ సునీత బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా… వైరల్ అవుతున్న ఫోటోలు!

Sunitha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా ఎన్నో అద్భుతమైన పాటలు పాడుతూ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు సింగర్ సునీత. ఇలా ఈమె సింగర్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి సునీత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.

ఒకానొక సమయంలో ఈమె సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నారు ఎప్పుడైతే ఈమె రామ్ వీరపనేని అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకున్నారో ఆ క్షణం నుంచి ఈమె తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. అదే విధంగా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ అయ్యారు. సునీత పెళ్లి సమయంలో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం ఈమె చాలా సంతోషంగా గడుపుతున్నారు.

ఇక ఇండస్ట్రీలో ఉన్న తర్వాత ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎంతోమంది స్నేహితులకు ఉండడం సర్వసాధారణం అయితే ఇండస్ట్రీలో సునీతకు మాత్రం ఒకే ఒకరు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారట తను ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఈమె తనతో కలిసి దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ప్రస్తుతం సునీత షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి సునీత బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనే విషయానికి వస్తే…

Sunitha:సుమ సునీత బెస్ట్ ఫ్రెండ్స్…


ఇండస్ట్రీలో సునీత బెస్ట్ ఫ్రెండ్ మరేవరో కాదు యాంకర్ సుమ. వీరిద్దరికి గత కొంతకాలం నుంచి పరిచయం ఉంది ఇలా వీరిద్దరి మధ్య ఏర్పడిన ఆ పరిచయం స్నేహంగా మారింది. ఇలా స్నేహితులుగా వీరిద్దరూ వీరికి సంబంధించిన అన్ని విషయాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు.ఇక సునీత రెండవ పెళ్లి సమయంలో కూడా సుమ చేసిన హంగామా గురించి మనకు తెలిసిందే.

Sai Pallavi: ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది…. బ్యూటిఫుల్ లొకేషన్లో క్యూట్ పిక్స్ షేర్ చేసిన సాయి పల్లవి!

Sai Pallavi: నేచురల్ బ్యూటీగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె వచ్చిన అవకాశాలన్నింటిని సద్వినియోగం చేసుకోకుండా ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటారు. ఇలా నటిగా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ సాధించారు.

ఇకపోతే సాయి పల్లవి గత కొంతకాలంగా ఎలాంటి తెలుగు సినిమాలకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. విరాటపర్వం సినిమా తర్వాత పూర్తిగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ప్రస్తుతం ఈమె కమల్ హాసన్ నిర్మాణంలో హీరో శివ కార్తికేయన్ తో కలిసి తమిళ సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి.

సాయి పల్లవి ప్రస్తుతం కాశ్మీర్ వెకేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా రెండు రోజులుగా ఈమె కాశ్మీర్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. తాజాగా తన వెకేషన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ సాయి పల్లవి షేర్ చేశారు. చుట్టూ మొక్కలతో ఎంతో ఆహారకరమైన వాతావరణంలో ఈమె దిగినటువంటి సింపుల్ ఫోటోని షేర్ చేశారు.

Sai Pallavi: నేచర్ ఎంజాయ్ చేస్తున్న నేచురల్ బ్యూటీ….

ఈ విధంగా సాయి పల్లవి ఈ ఫోటోలను షేర్ చేస్తూ ప్రకృతిని ఎంతో ఆస్వాదిస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా ఈ ఫోటోలను షేర్ చేసిన ఈమె ఇప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంది అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం సాయి పల్లవి షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఫోటో చూసిన నెటిజన్స్ నేచురల్ బ్యూటీ నేచర్ ను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Chiranjeevi: భార్య సురేఖతో కలిసి అమెరికా పర్యటనకు పయనమైన మెగాస్టార్… ఫోటోలు వైరల్!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత దూకుడు కనబడుస్తున్నారు. ఈయన వరుస సినిమా షూటింగులలో పాల్గొంటూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పాలి. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి చిరంజీవి తాజాగా భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

వాల్తేరు వీరయ్య సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి చిరు తన తదుపరి చిత్రాన్ని మెహర్ రమేష్ దర్శకత్వంలో చేశారు. ఇక ఈ సినిమా తాజాగా షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇక ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా పూర్తి చేశారు.

ఇలా ఈ సినిమాకు సంబంధించి తన పనులన్నీ పూర్తి కావడంతో చిరంజీవి కొద్ది రోజులపాటు వెకేషన్ లో సరదాగా గడపడం కోసం ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన భార్య సురేఖతో కలిసి అమెరికా వెళ్లారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ స్పెషల్ ఫ్లైట్లో అమెరికా వెళ్లారు.ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

Chiranjeevi: సుస్మిత నిర్మాణంలో చిరు..


ఇక ఈ వెకేషన్ పూర్తి అయిన తర్వాత తిరిగి ఇండియా చేరుకున్న అనంతరం చిరంజీవి భోళా శంకర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూనే మరోవైపు తన కొత్త సినిమాని కూడా ప్రారంభించబోతున్నారు ఇక తన తదుపరి సినిమాని కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తన పెద్ద కుమార్తె సుస్మిత నిర్మాణంలో నటించబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని విషయాలు అధికారికంగా తెలియజేయనున్నారు.

Pawan Kalyan: ఒక్క ఫోటోతో విడాకుల వార్తలకు చెక్ పెట్టిన పవన్ కళ్యాణ్… వైరల్ అవుతున్న ఫోటో!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయన తన వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు అయితే ఎక్కడికి వెళ్లినా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేస్తూ పలువురు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడంతో తరచూ ఆయన పెళ్లిళ్ల గురించి పలువురు విమర్శలు కురిపిస్తూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా తన మూడో భార్య అన్నా లేజినోవా మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. మెగా ఫ్యామిలీ లో ఏ కార్యక్రమం జరిగినా ఈమె రాకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని వార్తలు సృష్టించారు.

ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీకి అన్నా దూరంగా ఉండడంతో పవన్ కళ్యాణ్ మరోసారి విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలను పవన్ కళ్యాణ్ ఒక్క ఫోటోతో తిప్పి కొట్టారు. ఈయన తన భార్యతో కలిసి ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.

Pawan Kalyan: ఎడిటింగ్ ఫోటో అంటూ కామెంట్స్…


అంతేకాకుండా తన వారాహి యాత్ర మొదటి దశ ఎంతో విజయవంతంగా పూర్తి కావడంతో పవన్ కళ్యాణ్ తన భార్య అన్నాతో కలిసి పూజలు కూడా నిర్వహించారని తెలుస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది. ప్రస్తుతం పవన్ కి సంబంధించిన ఈ ఫోటో వైరల్ గా మారడంతో యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఇది ఎడిటింగ్ ఫోటో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Upasana :నేడే మెగా వారసురాలి బారసాల వేడుక… ఘనంగా జరుగుతున్న ఏర్పాట్లు.. ఫోటోలు వైరల్!

Upasana : మెగా కోడలు ఉపాసన ఈనెల 20వ తేదీ ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఈమె ఆడ బిడ్డకు జన్మనివ్వడంతో మెగా కుటుంబంలో ఎంతో సంతోషం వెల్లు విరిసింది. మెగా కోడలు ఉపాసన పది సంవత్సరాల తర్వాత తల్లిగా మారబోతుందన్న విషయం అందరినీ ఎంతో సంతోషానికి గురి చేసింది.

ఇలా మెగా వారసురాలు జన్మించిన తర్వాత బుల్లి మెగా వారసురాలిని చూడటం కోసం ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు చిన్నారి ఫేస్ మాత్రం బయటకు రివీల్ చేయలేదు.ఇక పాపకు పేరు కూడా ఫిక్స్ అయ్యామంటూ ఇదివరకే రామ్ చరణ్ తెలియజేసిన సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే నేడు పాపకు బారసాల వేడుకను నిర్వహించబోతున్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే బారసాల వేడుకకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయని ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఏర్పాట్లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ కుమార్తె పేరుతో పాటు తన ఫేస్ కూడా రివీల్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రామ్ చరణ్ ఉపాసన తన కుమార్తెకు ఏ పేరు పెట్టబోతున్నారన్న విషయం గురించి ఇదివరకే సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి.

Upasana : హాజరుకానున్న మెగా కుటుంబ సభ్యులు..


మరి మెగా వారసురాలికి ఏ పేరు ఫిక్స్ అయ్యారనే విషయం తెలియాలంటే మరి కొంత సమయం పాటు వేచి ఉండాలి. ఇక ఈ బారసాల వేడుకకు మెగా కుటుంబ సభ్యులతోపాటు అత్యంత సన్నిహితులు ఆప్తులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బారసాల వేడుక ఏర్పాట్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Anasuya: అనసూయా వేసుకొనే పొట్టిబట్టలపై ఆమె పెద్ద కొడుకు రియాక్షన్ ఏమిటో తెలుసా..?

Anasuya: బుల్లితెర గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా బుల్లితెర మీద ప్రసారమైన అనేక టీవీ షోలో యాంకర్ గా వ్యవహరిస్తూ అనసూయ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇలా యాంకర్ గా వచ్చిన గుర్తింపుతో సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకొని నటిగా మంచి గుర్తింపు పొందింది. బుల్లితెర మీద ప్రసారమైన టీవీ షోలో ఎంతో హాట్ గా కనిపించే అనసూయ సినిమాలలో మాత్రం వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ డి గ్లామర్ పాత్రలో ఎక్కువగా నటిస్తోంది.

అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే అనసూయ తరచూ తన గ్లామర్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచు వార్తల్లో నిలుస్తుంది. సోషల్ మీడియాలో అనసూయ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా అనసూయ వేసుకొని పొట్టి బట్టలకు సోషల్ మీడియాలో అనేక విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఈ అమ్మడు తగ్గేదేలే అన్నట్లు తనను విమర్శించిన వారి మీద ఫైర్ అవుతూ ఉంటుంది. ఇక ఇటీవల పెళ్ళి రోజు సందర్భంగా భర్త తో కలిసి సముద్రం ఒడ్డున బికినీ ధరించి అనసూయ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Anasuya: పొడవు దుస్తులు వేసుకోమని చెబుతాడు..


ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ తాను ధరించే బట్టల గురించి తన పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారో తెలిపింది. ఈ క్రమంలో అనసూయ మాట్లాడుతూ ‘ తాను ఎప్పుడైనా షాట్స్, మినీస్ లేదా బొడ్డు కనిపించే విధంగా బట్టలు ధరిస్తే తన పెద్ద కొడుకు ఎందుకు మమ్మీ ఇలా బట్టలు వేసుకుంటున్నావ్..కాస్త పెద్దవి వేసుకో అని మొహం మీద చెబుతున్నాడని తెలిపింది. అయితే తాను మాత్రం.. నా బట్టలు నా ఇష్టం. బట్టలు వేసుకోవడంలో నాకు స్వేచ్ఛ కావాలి అంటూ బట్టల విషయంలో మహిళలకు స్వేచ్ఛ ఉండాలని ఇప్పటినుండే తన పిల్లలకు పాఠాలు చెబుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఎప్పటిలాగే నెటిజెన్లు కూడా వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.