Tag Archives: photos viral

గోవా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న మెగా డాటర్.. ఫోటోలు వైరల్!

మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరియర్ మొదట్లో పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించిన నిహారిక ఆ తరువాత వెండి తెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈమె హీరోయిన్ గా రావడాన్ని మెగా అభిమానులు పూర్తిస్థాయిలో తిరస్కరించారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈమె నటించిన సినిమాలన్నీ కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

ఇదిలా ఉండగా వెండితెరపై కలిసి రాకపోవడంతో నిహారిక పలు వెబ్ సిరీస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఇండస్ట్రీలో తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకున్న నిహారిక గత ఏడాది డిసెంబర్లో జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

వివాహం తరువాత నిహారిక ఇండస్ట్రీకి దూరం అవుతుందని అందరూ భావించినప్పటికీ ఈమె పెళ్లి తర్వాత మరింత రెచ్చిపోతోంది.ఎక్కువగా తన గ్లామరస్ బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా నిహారిక గోవా వెళ్లినట్లు తెలుస్తోంది. గోవాలో సముద్రతీరాన ప్రకృతిని ఆస్వాదిస్తూ కూర్చుని ఉన్నటువంటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఎంతో గ్లామరస్ లుక్ లో ఉన్నటువంటి ఈ ఫోటోను షేర్ చేస్తూ తన భర్త చైతన్యకు థాంక్స్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిహారిక ఫోటోలు చూస్తుంటే మాత్రం ఈమె పెళ్లి తర్వాత మరింత అందాలను ఆరబోస్తూ గ్లామరస్ పాత్రలో కూడా నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెబుతున్నట్లు ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిహారిక గోవా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఘనంగా వైవా హర్ష వివాహం.. హాజరైన ప్రముఖులు.. ఫోటోలు వైరల్..!

సోషల్ మీడియా ను బాగా ఫాలో అవుతున్న వారికి వైవా హర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట వైవా సిరీస్ తో నటుడిగా గుర్తింపు తెచ్చుకొని, అనంతరం నటుడిగా, ఆ తరువాత యాంకర్ గా ఎంతో మంది ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు వైవా హర్ష. అంతేకాకుండా ఈయన యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి అందులో తనదైన శైలిలో కామెడీ పంచులు వేస్తూ ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.

కేవలం యూట్యూబ్ వీడియోలు ద్వారా సెలబ్రిటీస్ రేంజ్ లో క్రేజ్ కొట్టేసిన హర్ష.. ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు కూడా సాధించాడు. ఇటీవలే రిలీజ్ అయినా కలర్ ఫోటో సినిమాలో నటించిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో తన నటనతో అందరి మనసులలో స్థానం సంపాదించుకున్నాడు.ప్రస్తుతం మెగా డాటర్ సుస్మిత నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు.

తాజాగా వైవా హర్ష పెళ్లి చేసుకొని ఒక ఇంటి వారయ్యారు. నగరంలోని ఒక ప్రముఖ ఫంక్షన్ హాల్ లో అక్షర అనే అమ్మాయి తో వివాహం ఘనంగా జరిగింది. ఏడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో వధూవరులు కుటుంబ సభ్యులు స్నేహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం పాల్గొన్నారు.

ఈ పెళ్లి వేడుకకు దర్శకుడు మారుతి, నటుడు ప్రవీణ్, స్వాతి రెడ్డి, మహాతల్లి ఫేమ్ జాహ్నవి పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వైవా హర్ష కు సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన వైవా హర్ష అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక వైవా హర్ష పెళ్లి చేసుకున్న అమ్మాయి పూర్తి పేరు అక్షర రీసు. ఎం కామ్ పూర్తి చేసిన ఈ అమ్మాయి హర్ష తో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇక చివరికి పెద్దలను ఒప్పించి తాజాగా మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు

చిరకాల స్నేహితుడుని కలిసిన మెగాస్టార్… ప్రత్యేకమైన రోజు అంటూ ట్వీట్!

మెగాస్టార్ చిరంజీవికి చిత్ర పరిశ్రమలో ఏ విధమైనటువంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మెగాస్టార్ ప్రస్తుతం ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు.ఈ విధంగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన చిరంజీవి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెగా స్టార్ అనే పేరు సంపాదించుకున్నారు.ఈ విధంగా ఎన్నో సినిమాలలో నటిస్తూ కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ ఆ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుత హీరోలకు పోటీగా వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మెగాస్టార్ “ఆచార్య” సినిమాలో నటిస్తుండగా ఆ తర్వాత “గాడ్ ఫాదర్”, “భోళాశంకర్” వంటి సినిమాలలో కూడా నటిస్తున్నారు.ఇదిలా ఉండగా ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

మెగాస్టార్ పుట్టినరోజుకి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే చిరంజీవి తాజాగా తన చిరకాల మిత్రుడు, భారత దేశానికి మొట్టమొదటి సారిగా ప్రపంచ కప్ అందించిన క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ను కలుసుకున్నారు. ఈ సమావేశంలో చిరుతో పాటు ఆయన సతీమణి సురేఖ కూడా పాల్గొన్నారు. ఎన్నో రోజుల తర్వాత కలుసుకున్న వీరిద్దరూ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎంతో సరదాగా గడిపారు.

ఫలుక్ నామా ప్యాలెస్‏లో జరిగిన ఓ సమావేశంలో కపిల్ దేవ్ ను చిరు సతీసమేతంగా. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి ఇన్స్టాలో షేర్ చేస్తూ చాలా కాలం తర్వాత నా మిత్రుడిని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ ఈ క్రమంలోనే గతంలోకి వెళ్లి ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నామని ఇండియాకు ప్రపంచకప్ అందించిన హర్యానా హర్రీక్రేన్ అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారు ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తారక్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అర్ఆర్ఆర్” చిత్రంలో కొమురంభీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే ఎన్టీఆర్ గతంలో ఎంతో విలాసవంతమైన, ప్రత్యేక ఫీచర్స్ కలిగి ఉన్నటువంటి కారును బుక్ చేశారని అది త్వరలోనే హైదరాబాద్ చేరుతుందనే వార్తలు పెద్దఎత్తున వినిపించాయి.

తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బుక్ చేసినటువంటి
ఇటాలియన్ లగ్జరీ లాంబొర్కిని కారు హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. తారక్ ఎంతో ఇష్టంగా బుక్ చేసుకున్నటువంటి లగ్జరీ కారును ఏకంగా ఐదు కోట్లు పెట్టి కొన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన కొత్త కారును వేసుకుని తన స్నేహితుడు రామ్ చరణ్ ను కలవడం కోసం వెళ్లారని,ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన కొత్త కారును రామ్ చరణ్ ఇంటి ముందు పార్క్ చేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొత్త కార కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇకపోతే ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి “అర్ఆర్ఆర్” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే వీరిద్దరి మద్య స్నేహం పెరగడంతో ఎన్టీఆర్ తన కొత్త కారులో చెర్రీని కలవడం కోసం వెళ్లారని తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ “అర్ఆర్ఆర్” తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.

మేకప్ లేని యాంకర్ అనసూయను ఎప్పుడైనా చూశారా ?

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా పలు అవకాశాలను దక్కించుకుని తనదైన శైలిలో దూసుకుపోతున్న ఈ అమ్మడు కెరియర్ పరంగా ఎంతో బిజీ గా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా చురుగ్గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే అనసూయపై ఎన్నో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. తనపై వచ్చే నెగిటివ్ కామెంట్స్ కు దీటుగానే స్పందిస్తుంటారు.

అనసూయ బుల్లితెరపై లేదా వెండి తెరపై ఎంతో అందంగా కనబడుతూ అందరిని మంత్రముగ్దుల్ని చేస్తుంది. సోషల్ మీడియాలో సైతం ఆమె మేకప్ లేకుండా మనకు కనిపించడం చాలా అరుదు. అయితే తాజాగా అనసూయ మేకప్ లేకుండా ఉన్నటువంటి ఒక ఫోటో సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. మొహంపై మేకప్ లేకుండా తన మొహం పై వచ్చిన మొటిమలు గురించి తెలిపారు.

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ… అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. నా మొహం పై నాలుగు మొటిమలు వచ్చాయి అయితే ఒక దానిని గిల్లాను. మొటిమలను గిల్లడం మంచిది కాదు అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ విధంగా నా మొహం పై మొటిమలు రావడానికి గల కారణం ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేశాను.

మొహంపై మొటిమలు రావడానికి కారణం మామిడి పండ్లు తినడం వల్ల వచ్చాయని అనుకుంటున్నాను. అయితే మొటిమలు వస్తాయని మామిడిపండ్లు తినకుండా ఉండలేము. సంవత్సరానికి ఒక్కసారి ఈ సీజన్లో మాత్రమే లభించే మామిడి పండ్లను ఎవరు తినకుండా ఉండలేము కనుక ఏమాత్రం మొహమాట పడకుండా మామిడికాయలను తినండి నేను కూడా మీతోనే ఉన్నాను అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మేకప్ లేకుండా అనసూయ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ ఫోటో.. ట్రీ హౌస్.. ఫోటో చూస్తే షాక్..!

చాలా మందికి పర్యావరణాన్ని రక్షించడం, మొక్కలు నాటడం, నాటిన మొక్కలను రక్షించడం అంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే పర్యావరణంతో మమేకమై ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ విధంగా పర్యావరణ ప్రేమికులు పర్యావరణంతో కలిసి జీవించడం కోసం ఎంతకైనా సాహసం చేస్తారు. ఈ క్రమంలోనే వారు చేసే కొన్ని ప్రయత్నాలు ఎందరినో ఆశ్చర్యపరచే ఈ విధంగా ఉంటాయి. ప్రస్తుతం ఓ యువకుడు చేసిన అటువంటి ప్రయత్నానికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రాజస్థాన్‌లోని బికనేర్‌ జిల్లాకు చెందిన పంచు గగ్రామానికి చెందిన ఒక యువకుడు తన ఇంటి సమీపంలోనే ఒక ఎత్తయిన వృక్షం ఉంది. అయితే రాజస్థాన్లో వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా,ఈ వేడి నుంచి ఉపశమనం పొందడం కోసం ఆ యువకుడు సరికొత్త ఆలోచన చేసి ఏకంగా చెట్టుపైనే ఇంటి నిర్మించాడు.

ఈ విధంగా యువకుడు తన ఇంటి సమీపంలోనే ఉన్న చెట్టుపై ఏకంగా ఇంటిని నిర్మించి ఆ ఇంటిలోనే నివసిస్తున్నాడు. ఈ క్రమంలోని సదరు యువకుడు మాట్లాడుతూ ఈ ఎండల నుంచి తనకు చెట్టుపైనే ఉపశమనం కలిగిందని, అందుకోసమే ఈ విధంగా చెట్టుపై ఇంటిని నిర్మించుకునట్లు తెలిపాడు.ప్రస్తుతం ఈ యువకుడు నిర్మించిన హౌస్ ట్రీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకుంది. ఈ విధంగా యువకుడు చేసిన ప్రయత్నం ఎంతోమందిలో స్ఫూర్తిని నింపిందని చెప్పవచ్చు.

గడ్డంతో మాస్ లుక్ లో అందరిని ఆశ్చర్యపరిచిన నారా లోకేష్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన టిడిపి వారసుడిగా నారా లోకేష్ అందరికీ సుపరిచితమే. ఇదివరకు నారా లోకేష్ అంటే తెల్లని చొక్కా నిండుగా వేసుకుని, క్లీన్ షేవ్ తో ఎంతో నీటుగా, పద్ధతిగా కనిపించడమే గుర్తొస్తుంది. కానీ నారా లోకేష్ ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే తన లుక్ మొత్తం మార్చినట్లు తెలుస్తోంది. ఇంట్లో కూర్చొని నారా లోకేష్ హీరో లెవల్లో మాస్ లుక్ ట్రై చేశాడు.

ఈ విధంగా నారా లోకేష్ తన లుక్ మొత్తం చేంజ్ చేయడానికి గల కారణం ఏంటనే ప్రశ్న ప్రస్తుతం ఆశక్తికరంగా మారింది. తీరిక లేక ఈ విధంగా తయారయ్యాడా లేక మాస్ అభిమానులను ఆకట్టుకోవడం కోసం ఈ విధంగా తన లుక్ మార్చాడా అనే సంగతి తెలియడం లేదు.ఎప్పుడు క్లీన్ షేవ్ తో కనిపించే నారా లోకేష్ ఒక్కసారిగా గడ్డం పెంచి మాస్ లుక్ లో కనిపిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.

నారా లోకేష్ తన కొత్త లుక్ ద్వారా ప్రజలకు మరింత చేరువ కావడానికి ఈ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. లోకేష్ ఎప్పుడు క్లీన్ షేవ్ తో కనిపించడం వల్ల పెద్దగా ఫాలోయింగ్ సంపాదించుకోలేదు. అయితే ప్రస్తుతం తన మాస్ లుక్ ద్వారా అందరికీ దగ్గర కావాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా గడ్డం పెంచారని తెలుస్తోంది. అయితే ఎప్పుడు చొక్కాలో కనిపించే నారా లోకేష్ ఈసారి టీ షర్ట్ లో కనిపించడం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది.

తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది, ఇంటర్, డిగ్రీ పరీక్షలు యధావిధిగా నిర్వహిస్తున్నారని ప్రకటించడంతో ఈ విషయం పై నారా లోకేష్ స్పందించారు. కరోనా తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ విధంగా పరీక్షలను నిర్వహించడాన్ని నారా లోకేష్ వ్యతిరేకించాడు.ఈ విషయంలో విద్యార్థులకు మద్దతుగా విద్యార్థులను ఆకట్టుకోవడానికి నారా లోకేష్ ఈ లుక్ లో కనిపించినట్లు తెలుస్తోంది.