బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా పలు అవకాశాలను దక్కించుకుని తనదైన శైలిలో దూసుకుపోతున్న ఈ అమ్మడు కెరియర్ పరంగా ఎంతో బిజీ గా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా చురుగ్గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే అనసూయపై ఎన్నో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. తనపై వచ్చే నెగిటివ్ కామెంట్స్ కు దీటుగానే స్పందిస్తుంటారు.
అనసూయ బుల్లితెరపై లేదా వెండి తెరపై ఎంతో అందంగా కనబడుతూ అందరిని మంత్రముగ్దుల్ని చేస్తుంది. సోషల్ మీడియాలో సైతం ఆమె మేకప్ లేకుండా మనకు కనిపించడం చాలా అరుదు. అయితే తాజాగా అనసూయ మేకప్ లేకుండా ఉన్నటువంటి ఒక ఫోటో సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. మొహంపై మేకప్ లేకుండా తన మొహం పై వచ్చిన మొటిమలు గురించి తెలిపారు.
ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ… అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. నా మొహం పై నాలుగు మొటిమలు వచ్చాయి అయితే ఒక దానిని గిల్లాను. మొటిమలను గిల్లడం మంచిది కాదు అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ విధంగా నా మొహం పై మొటిమలు రావడానికి గల కారణం ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేశాను.
మొహంపై మొటిమలు రావడానికి కారణం మామిడి పండ్లు తినడం వల్ల వచ్చాయని అనుకుంటున్నాను. అయితే మొటిమలు వస్తాయని మామిడిపండ్లు తినకుండా ఉండలేము. సంవత్సరానికి ఒక్కసారి ఈ సీజన్లో మాత్రమే లభించే మామిడి పండ్లను ఎవరు తినకుండా ఉండలేము కనుక ఏమాత్రం మొహమాట పడకుండా మామిడికాయలను తినండి నేను కూడా మీతోనే ఉన్నాను అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మేకప్ లేకుండా అనసూయ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…