Tag Archives: politics entry

Ramyakrishna: రోజా బాటలోనే రాజకీయాలలోకి రాబోతున్న రమ్యకృష్ణ… క్లారిటీ ఇచ్చేసిన నటి!

Ramyakrishna: సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ స్టార్ హీరో హీరోయిన్లుగా గుర్తింపు పొందిన తర్వాత చాలామంది రాజకీయాలలోకి వెళ్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది ఇండస్ట్రీలో సక్సెస్ సాధించిన వారు రాజకీయాలలో కూడా కొనసాగుతున్నారు. అలాంటి వారిలో నటి రోజా ఒకరు.
ఇండస్ట్రీలో హీరోయిన్గా గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం రాజకీయాలలోకి వచ్చి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇలా రాజకీయాలలో కూడా ఎంతో సక్సెస్ అయినటువంటి రోజా బాటలోనే నటి రమ్యకృష్ణ కూడా రాజకీయాలలోకి రాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా రమ్యకృష్ణ పొలిటికల్ ఎంట్రీ గురించి వార్తలు రావడానికి కారణం లేకపోలేదు. గత కొద్ది రోజుల క్రితం రోజా ఇంటికి రమ్యకృష్ణ వెళ్లడంతో అప్పటినుంచి ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రమ్యకృష్ణ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ తాను రోజా ఇండస్ట్రీలో ఇద్దరు మంచి స్నేహితులమని తెలిపారు. అయితే అప్పటికి ఇప్పటికీ మేమిద్దరం ఇలాగే ఉన్నామని తెలిపారు. ఇకపోతే చాలా సంవత్సరాల తర్వాత నేను తిరుపతికి వెళ్లగా అక్కడ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది ఇలా స్వామివారి దర్శనం జరగడానికి రోజా కారణం కావడంతో తన ఇంటికి వెళ్లి తనకు కృతజ్ఞతలు తెలిపాను.

Ramyakrishna: రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశం లేదు…


రోజా ఇంటికి వెళ్లిన నేను ఎలాంటి సినిమాల గురించి రాజకీయాల గురించి మాట్లాడలేదు కేవలం మా ఇద్దరి పిల్లల గురించి మాత్రమే మాట్లాడుకున్నామని తెలిపారు. అయినా ఒకరిని చూసుకొని తాను రాజకీయాలలోకి రావాలనుకోలేదు. నాకు రావాలనిపిస్తేనే వస్తానని తెలిపారు.అయితే ప్రస్తుతం నాకు రాజకీయాలలోకి రావాలని ఆసక్తి ఏమాత్రం లేదని అలా వచ్చినప్పుడు నేను ఈ విషయాన్ని చెబుతాను అంటూ ఈ సందర్భంగా రమ్యకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Anasuya: రాజకీయాలలోకి ప్రముఖ యాంకర్ అనసూయ… వైరల్ అవుతున్న వేణుస్వామి కామెంట్స్!

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరమవుతూ వెండి తెర సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ క్షణం పాటు తీరిక లేకుండా ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ గురించి తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది.

ప్రముఖ సెలబ్రిటీల జాతకాలను చెబుతూ వార్తల్లో నిలిచే జ్యోతిష్యులు వేణు స్వామి గతంలో అనసూయ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈయన అనసూయ జాతకం గురించి చెబుతూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలను కనుక గమనిస్తే ఈమె త్వరలోనే రాజకీయాలలోకి కూడా రాబోతుందని తెలుస్తోంది. మరి అనసూయ గురించి వేణు స్వామి ఏం చెప్పారు అనే విషయానికి వస్తే…

ఈ సందర్భంగా వేణు స్వామి అనసూయ జాతకం గురించి మాట్లాడుతూ 2021 వ సంవత్సరం తర్వాత అనసూయ క్రేజ్ భారీగా పెరిగిపోతుందని తెలిపారు.ఆమెను ఇండస్ట్రీలో ఆపడం ఎవరి తరం కాదని ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకు ఉంటుందని తెలియజేశారు. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఈమె రాజకీయాలలోకి వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయని వేణు స్వామి తెలియచేశారు.

Anasuya: రాజకీయాలలోకి రంగమ్మత్త…


ఈ విధంగా వేణు స్వామి అనసూయ జాతకం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ నిజమే అవుతున్నాయని తెలుస్తోంది 2020 వరకు అనసూయ బుల్లితెర యాంకర్ గా మాత్రమే ఉండేవారు. ఆ తర్వాత వెండితెర సినిమా అవకాశాలను అందుకొని ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు ఇలా ఈయన చెప్పిన మాటలు నిజమే అవుతున్నాయని అయితే త్వరలోనే రాజకీయాలలోకి వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని పలువురు ఈ వ్యాఖ్యలపై కామెంట్స్ చేస్తున్నారు.

Rajinikanth: రజనీకాంత్ రాజకీయాలలోకి వచ్చిన చేసేదేం లేదు… రజిని సోదరుడు కామెంట్స్ వైరల్!

Rajinikanth: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాలలోకి రాబోతున్నారంటూ గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఆ సమయంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త క్షీణించడంతో రాజకీయాలలోకి రావాలన్న ఆలోచనను విరమించుకున్నారు. ఇలా ఈయన రాజకీయాలలోకి రాకపోయినా ఏదో ఒక పార్టీకి మద్దతు తెలపాలని కూడా పలువురు కోరుకున్నారు.

ఈ క్రమంలోనే రజినీకాంత్ రాజకీయాల గురించి ఆయన సోదరుడు సత్యనారాయణ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తిరుచెందూర్ కుమార స్వామి వారిని దర్శించుకున్నటువంటి సత్యనారాయణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ రజనీకాంత్ రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ…

రజనీకాంత్ రాజకీయాలలోకి రావాలని చాలామంది కోరుకుంటున్నారు అయితే ఆయన రాజకీయాలలోకి వచ్చిన చేసేదేమీ లేదని సత్యనారాయణ తెలియజేశారు. అయితే తాను ఇలా మాట్లాడటానికి గల కారణాలను కూడా సత్యనారాయణ తెలియజేశారు. ప్రస్తుతం రజనీకాంత్ గారికి 70 సంవత్సరాల వయసు ఈ వయసులో ఆయన రాజకీయాలలోకి వచ్చిన ఎలాంటి ప్రయోజనాలు ఉండవని సత్యనారాయణ తెలిపారు.


Rajinikanth: ఆరోగ్యంగా ఉంటే చాలు…


ఆయన రాజకీయాలలోకి రాకపోయినా సంతోషంగా ఎంతో ఆరోగ్యంగా నిండు నూరేళ్లు ఉండాలని ఆయన సోదరుడు కోరుకున్నారు. ఇలా రజనీకాంత్ రాజకీయాలు గురించి ఆలోచన విరమించుకున్న అనంతరం ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారని ఈ సినిమా త్వరలోనే విడుదల కానందని సత్యనారాయణ పేర్కొన్నారు.

Naga Babu -Chiranjeevi: చిరంజీవి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారా… క్లారిటీ ఇచ్చిన నాగబాబు?

Naga Babu -Chiranjeevi: మెగా బ్రదర్ నాగబాబు ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా కొనసాగినప్పటికీ ఈయన నటుడిగానూ నిర్మాతగానూ ఇండస్ట్రీలో గుర్తింపు పొందలేకపోయాడు.తన తల్లి అంజనా దేవి పేరుపై అంజన ప్రొడక్షన్స్ స్థాపించిన నాగబాబు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈయన సక్సెస్ సాధించలేకపోయారు.

Naga Babu -Chiranjeevi: చిరంజీవి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారా… క్లారిటీ ఇచ్చిన నాగబాబు?

ఈ విధంగా ఎంతోమందికి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన మెగాహీరోలు ఇంటిలో ఉన్నప్పటికీ నాగబాబు వారితో ఒక్క హిట్ అందుకోకపోవడం నిజంగా దురదృష్టకరం.ఈ విధంగా నాగబాబు నిర్మాతగా వ్యవహరించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీసు వద్ద చతికిల బడటంతో ఈయన పూర్తిగా నిర్మాణ రంగానికి దూరం అయ్యారు.

Naga Babu -Chiranjeevi: చిరంజీవి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారా… క్లారిటీ ఇచ్చిన నాగబాబు?

ఈ క్రమంలోనే బుల్లితెరపై పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ మరోవైపు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే తాజాగా నాగబాబు మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలలోకి రీ ఎంట్రీ గురించి స్పందించారు.ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని ఆయనకు సినిమారంగంలోనే ప్రశాంతంగా ఉందని తనని రాజకీయాల్లోకి రమ్మని కోరవద్దని చెప్పినట్లు నాగ బాబు ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇండస్ట్రీలోనే ప్రశాంతత ఉంది…

సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 18 సీట్లను గెలుపొందారు. ఈ క్రమంలోనే ఈయన తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర పర్యాటక శాఖామంత్రిగా మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. అనంతరం ఈయన రాజకీయాలకు దూరమవుతూ తిరిగి ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. తనకు సినిమా ఇండస్ట్రీలోనే ప్రశాంతంగా ఉందని చిరంజీవి వెల్లడించినట్లు నాగబాబు తెలియజేశారు.