Ramyakrishna: సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ స్టార్ హీరో హీరోయిన్లుగా గుర్తింపు పొందిన తర్వాత చాలామంది రాజకీయాలలోకి వెళ్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది ఇండస్ట్రీలో సక్సెస్ సాధించిన వారు రాజకీయాలలో కూడా కొనసాగుతున్నారు. అలాంటి వారిలో నటి రోజా ఒకరు.
ఇండస్ట్రీలో హీరోయిన్గా గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం రాజకీయాలలోకి వచ్చి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇలా రాజకీయాలలో కూడా ఎంతో సక్సెస్ అయినటువంటి రోజా బాటలోనే నటి రమ్యకృష్ణ కూడా రాజకీయాలలోకి రాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా రమ్యకృష్ణ పొలిటికల్ ఎంట్రీ గురించి వార్తలు రావడానికి కారణం లేకపోలేదు. గత కొద్ది రోజుల క్రితం రోజా ఇంటికి రమ్యకృష్ణ వెళ్లడంతో అప్పటినుంచి ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రమ్యకృష్ణ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ తాను రోజా ఇండస్ట్రీలో ఇద్దరు మంచి స్నేహితులమని తెలిపారు. అయితే అప్పటికి ఇప్పటికీ మేమిద్దరం ఇలాగే ఉన్నామని తెలిపారు. ఇకపోతే చాలా సంవత్సరాల తర్వాత నేను తిరుపతికి వెళ్లగా అక్కడ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది ఇలా స్వామివారి దర్శనం జరగడానికి రోజా కారణం కావడంతో తన ఇంటికి వెళ్లి తనకు కృతజ్ఞతలు తెలిపాను.
రోజా ఇంటికి వెళ్లిన నేను ఎలాంటి సినిమాల గురించి రాజకీయాల గురించి మాట్లాడలేదు కేవలం మా ఇద్దరి పిల్లల గురించి మాత్రమే మాట్లాడుకున్నామని తెలిపారు. అయినా ఒకరిని చూసుకొని తాను రాజకీయాలలోకి రావాలనుకోలేదు. నాకు రావాలనిపిస్తేనే వస్తానని తెలిపారు.అయితే ప్రస్తుతం నాకు రాజకీయాలలోకి రావాలని ఆసక్తి ఏమాత్రం లేదని అలా వచ్చినప్పుడు నేను ఈ విషయాన్ని చెబుతాను అంటూ ఈ సందర్భంగా రమ్యకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…