Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య యూట్యూబర్ గాను, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ఏకంగా సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. తాజాగా ఈమె నటించిన బేబీ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.
సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వీరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఏకంగా 90 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఇలా థియేటర్లో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ సినిమా ప్రస్తుతం ఆహాలో ప్రసారమవుతూ ఇక్కడ కూడా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఆహాలో ప్రసారమవుతున్నటువంటి నేపథ్యంలో ఆహా ఓటీటీ ‘వాట్సాప్ బేబీ’ పేరుతో వైష్ణవి చైతన్య వీడియోను పంచుకుంది.
ఇందులో భాగంగా నేటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే వైష్ణవి చైతన్యను నేటిజన్స్ ప్రశ్నిస్తూ మీకు కనుక వీరాజ్ అశ్విన్ లేదా ఆనంద్ దేవరకొండ వీరిద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని చెబితే ఎవరిని చేసుకుంటారంటూ ఈమెకు ఒక్క ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు వైష్ణవి చైతన్య సమాధానం చెబుతూ తాను ఇద్దరినీ పెళ్లి చేసుకోనని తెలిపారు.
ఇక వీరిద్దరిలోను కొన్ని క్వాలిటీస్ నాకు చాలా బాగా నచ్చుతాయని ఈమె తెలియజేశారు. బేబీ సినిమాలో వైష్ణవి చేసినది కరెక్టేనా అంటూ మరొక ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. మనం నటించే సమయంలో ఇలాగే ఉండాలి అని పరిమితులు పెట్టుకుంటే సరిపోదని కథ పాత్ర ఆధారంగా ఆ క్షణం మనం మనల్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది అంటూ వైష్ణవి చైతన్య చెప్పినటువంటి సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…