Tag Archives: puneeth raj kumar

Puneeth Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మాల ధరించనున్న అభిమానులు… వైరల్ అవుతున్న న్యూస్!

Puneeth Raj Kumar: కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా మాత్రమే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా ఎందరికో ఎన్నో సహాయ సహకారాలు చేస్తూ మంచి మనసున్న వ్యక్తిగా పేరు సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ 2021 అక్టోబర్ 29వ తేదీ గుండెపోటుతో మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈయన మరణ వార్త నుంచి ఇప్పటికి కన్నడ అభిమానులు బయటపడలేకపోతున్నారు.

ఇక మార్చి 17వ తేదీ పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు కావడంతో అభిమానులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా ఎందరికో ఎన్నో విధాలుగా సహాయం చేయడంతో కన్నడ నాట అభిమానులు ఈయనని దేవుడిగా భావించారు. దీంతో ఈయన పుట్టినరోజు సందర్భంగా మార్చి 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అభిమానులు అప్పు మాల ధరించాలని భావించారు. ఈ క్రమంలోనే ఓ కరపత్రం కూడా విడుదల చేశారు.

హోస్పేటలోని పునీత్ రాజ్‌కుమార్ సర్కిల్‌లో పూలమాలలు ధరించి, వ్రతాన్ని ఆచరించి, ప్రత్యేక పూజలు చేసి, మార్చి 18న ఆయన మందిరానికి వెళ్లి దర్శనం చేసుకున్న తర్వాత హంపి పుణ్య నదిలో స్నానం ఆచరించి అనంతరం విరూపాక్షేశ్వర స్వామికి పూజలు చేసి పూలమాల వేయాలని కరపత్రంలో సూచించారు. దీంతో పాటు మాల వేసుకున్న తర్వాత ఎలాంటి నియమాలను పాటించాలో కూడా ఇందులో పేర్కొన్నారు.


Puneeth Raj Kumar: అప్పు మాల దీక్షలో అభిమానులు….

అప్పు పై ఉన్న అభిమానంతో కొందరు 11 రోజులపాటు కొందరు ఐదు రోజులపాటు లేదా ఒక్కరోజు పాటు కూడా మాల ధరించవచ్చని సూచించారు. ఈ మాల ధరించిన వారు కాషాయపు రంగు చొక్కా పంచె కండువా ధరించాలి.ఉదయం సూర్యోదయానికి ముందు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తప్పనిసరిగా స్నానం చేసి ఆయన ఫోటోకి పూజ చేసుకున్న అనంతరమే వారి అల్పాహారం చేయాలని తెలిపారు.
ఈ విధంగా అప్పు మాల ధరించినటువంటి భక్తులు ఎవరు కూడా చెడు అలవాట్ల అంటే మద్యం తాగడం, సిగరెట్ కాల్చడం, మాంసం తినడం వంటివి చేయకూడదని సూచించారు.

Jr NTR: ఎన్టీఆర్ ఇంట్లో తారకరత్న పునీత్ ఫోటోలు… ఎమోషనల్ అవుతున్న అభిమానులు!

Jr NTR: తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటించిన ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయినటువంటి తారకరత్న గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇండస్ట్రీలో సక్సెస్ సాధించలేనటువంటి ఈయన రాజకీయాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు .అయితే రాజకీయాలలోకి అడుగుపెట్టిన క్షణమే ఈయనకు గుండెపోటు రావడంతో మరణించారు.

ఇలా తారకరత్న మరణించి కొన్ని రోజులు గడుస్తున్న ఇంకా అభిమానుల మాత్రం ఈయన మరణ వార్త నుంచి బయటపడలేకపోతున్నారు. ఇక తారకరత్న మరణించిన మూడు రోజులకే తన పుట్టినరోజు రావడంతో ఈ విషయం అభిమానులను మరింతగా కృంగదీస్తోంది.ఇలా తారకరత్న మరణించడంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ తనకు నివాళులు అర్పిస్తున్నారు.

ఇక తారకరత్న మొదటి జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఇంట్లో ఆయన ఫోటో దర్శనమిచ్చింది. ఎన్టీఆర్ ఇంట్లో నందమూరి తారకరత్న కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు కనిపించడంతో అభిమానులు ఈ ఫోటోలను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ ఎమోషనల్ అవుతున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ కూడా గుండెపోటుతో మరణించిన సంగతి మనకు తెలిసిందే.

Jr NTR: వాయిదా పడిన ఎన్టీఆర్ సినిమా షూటింగ్…

ఈ విధంగా పునీత్ రాజ్ కుమార్ ఫోటో గత కొద్ది రోజులుగా తారక్ ఇంట్లో ఉంది. అయితే తారకరత్న మరణించిన తర్వాత ఎన్టీఆర్ ఇంట్లో తారకరత్న ఫోటో కూడా ఉండడంతో అభిమానులు ఈ ఫోటోని షేర్ చేస్తూ ఎంతో ఎమోషనల్ అవుతున్నారు.ఇక ఈయన మరణించడంతో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న సినిమా కూడా మరికొన్ని రోజులు వాయిదా పడింది.

Puneeth raj Kumar: తెలుగులో విడుదల కానున్న పునీత్ సివిల్ ఇంజనీర్… ట్రైలర్ చూసి ఎమోషనల్ అవుతున్న తారక్ ఫ్యాన్స్?

Puneeth raj Kumar: కన్నడ పవర్ స్టార్ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రముఖ సినీ నటుడు రాజ్ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పునీత్ రాజ్ కుమార్ హీరోగా మాత్రమే కాకుండా మానవతావాదిగా ఎన్నో సహాయ సహకారాలు చేశారు.ఇలా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది 29వ తేదీ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన విషయం తెలిసిందే.

ఇలా ఈయన మరణ వార్తను ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పునీత్ రాజ్ కుమార్ మరణించినప్పటికీ ఆయన నటించిన సినిమాలను విడుదల చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఇకపోతే పునీత్ రాజ్ కుమార్ కు కేవలం కన్నడ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోనే పునీత్ రాజ్ కుమార్ 2016 వ సంవత్సరంలో నటించిన
చక్ర వ్యూహ సినిమాని తెలుగులో సివిల్ ఇంజనీర్ అనే పేరుతో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ దసరా కానుకగా విడుదల చేయగా ట్రైలర్ దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేశారు. సమాజంలో బర్నింగ్ ఇష్యూ పై హీరో పోరాడి ఎలాంటి మార్పు తీసుకొచ్చారు అనే విషయంపై ఈ సినిమా సివిల్ ఇంజనీర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక పాటను పాడి ప్రేక్షకులను సందడి చేశారు. ఎన్టీఆర్ తల్లి గారిది కర్ణాటక కావడంతో చిన్నప్పటినుంచి కన్నడ ఎంతో స్పష్టంగా వచ్చిన ఎన్టీఆర్ ఈ సినిమాలో  ‘గెలయా గెలయా’ అనే సాంగ్ పాడాడు. 

Puneeth raj Kumar: పాట పాడిన ఎన్టీఆర్..


ఈ విధంగా ఎన్టీఆర్ ఈ పాట పాడటంతో ఒకవైపు కనడ ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకుల సైతం ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా ట్రైలర్ అత్యంత అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ చూసినటువంటి ఎంతోమంది పునీత్ ఫ్యాన్స్ తారక్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Puneeth Rajkumar: కన్నడ నటుడు పునీత్ భార్య ఓ మధ్య తరగతి అమ్మాయా.. పునీత్‌తో ప్రేమ పెళ్లి ఎలా జరిగాయో తెలుసా?

Puneeth Rajkumar: తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎలాగో కన్నడ చిత్ర పరిశ్రమకు రాజ్ కుమార్ అలా.కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడు రాజ్ కుమార్ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈయన కుమారులు ఇండస్ట్రీలోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇలా రాజ్ కుమార్ చిన్న కుమారుడు పునీత్ రాజ్ కుమార్ బాల నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

 

ఈయన బాల నటుడుగానే కాకుండా హీరోగా ఎన్నో సినిమాలలో నటించి విశేషమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. కేవలం సినిమాల పరంగా మాత్రమే కాకుండా పునీత్ తన మంచి మనస్తత్వంతో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు. అయితే ఆయన బ్రతికున్నప్పుడు ఏ ఒక్కటి బయటకు చెప్పుకోలేదు. ఆయన మరణాంతరం ఈ విషయాలు తెలియడంతో పునీత్ అంటే కూడా తెలియని వారు సైతం ఈయన అభిమానులుగా మారిపోయారు.

గత ఏడాది అక్టోబర్ 29వ తేదీ గుండెపోటుతో మరణించిన పునీత్ మరణ వార్తను ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం సినిమా షూటింగ్ పనులు పూర్తి అయిన తర్వాత తన కుటుంబంతో సంతోషంగా గడుపుతూ వివాదాలకు దూరంగా ఉండే పునీత్ తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి కూడా ఇష్టపడరు. అందుకే ఈయనకు సంబంధించిన చాలా విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు.

సొంత కూతురిలా ఆదరించిన రాజ్ కుమార్…

ఇకపోతే పునీత్ భార్య అశ్విని గురించి చాలామందికి తెలియదు. పునీత్ భార్య ఓ ధనవంతులు కుటుంబానికి చెందిన అమ్మాయి అనుకుంటే పొరపాటే ఈమె ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఓ కార్యక్రమంలో భాగంగా ఫ్రెండ్ ద్వారా పునీత్ అశ్విని మధ్య పరిచయం ఏర్పడింది. ఇలా ఈ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు కూడా వారి కుటుంబ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.అశ్విని ఆ ఇంటికి చిన్న కోడలుగా అడుగుపెట్టగా తనకన్నా ఇద్దరు కోడలు ధనవంతుల కుటుంబం నుంచి రావడంతో ఈమె ఆ కుటుంబంతో కలవలేకపోయింది.అయితే పునీత్ తన కుటుంబ సభ్యులకు గురించి వివరించగా మెల్లిమెల్లిగా ఈమె కూడా ఆ కుటుంబ సభ్యులతో కలిసిపోయి అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు.అయితే ప్రస్తుతం పునీత్ వారి మధ్య లేకపోయిన రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు తనను సొంత మనిషిగానే భావిస్తున్నారని అశ్విని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.

Puneeth Raj Kumar Wife: ఆ కారణం వల్లే పునీత్ చివరి సినిమా చూడలేదు… పునీత్ భార్య అశ్విని షాకింగ్ కామెంట్స్!

Puneeth Raj Kumar Wife: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఈయన మరణ వార్తను ఇప్పటికి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే పునీత్ రాజ్ కుమార్ చివరిసారిగా నటించిన సినిమా జేమ్స్. ఈ సినిమా ఆయన మరణాంతరం విడుదల కావడం విశేషం. అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటిరోజు ఎంతో పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.

Puneeth Raj Kumar Wife: ఆ కారణం వల్లే పునీత్ చివరి సినిమా చూడలేదు… పునీత్ భార్య అశ్విని షాకింగ్ కామెంట్స్!

ఇక తన అభిమాన నటుడిని చివరిసారిగా నటించిన సినిమా కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్ కి వెళ్లి పునీత్ నటించిన జేమ్స్ సినిమాని చూడటమే కాకుండా ఆయన లేరనే విషయాన్ని తెలుసుకొని ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. ఇక పునీత్ నటించిన చివరి సినిమాని తన ఇద్దరు కూతుర్లతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా వీక్షించారు.

Puneeth Raj Kumar Wife: ఆ కారణం వల్లే పునీత్ చివరి సినిమా చూడలేదు… పునీత్ భార్య అశ్విని షాకింగ్ కామెంట్స్!

అయితే పునీత్ జేమ్స్ సినిమాని ఇప్పటి వరకు ఆయన భార్య అశ్విని చూడలేదు. అయితే అశ్విని ఈ సినిమా ఎందుకు చూడలేదనే విషయాన్ని తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని మాట్లాడుతూ…ఈ సినిమా ఎంతో అద్భుతంగా వచ్చిందని ప్రతి ఒక్కరు చెబుతున్నారు కానీ ఈ సినిమా నేను చూడలేదు.

ఆయనని బ్రతికించారు….

ఈ సినిమా చూడడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే అందరి మాదిరి ఈ సినిమాని నేను చూడలేకపోవచ్చు అంటూ తెలియజేశారు.ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇందులో యాక్షన్ సన్నివేశాలు గురించి నా దగ్గర ఎన్నో సార్లు చెప్పారు. అలాగే ఈ సినిమా కోసం ఉపయోగించిన టెక్నాలజీ గురించి కూడా తన దగ్గర ఎన్నోసార్లు వివరించారని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.పునీత్ నటించిన చివరి సినిమా విడుదలైన తర్వాత ఎంతోమంది అప్పు అభిమానులు నేత్రదానం, రక్తదానం, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించారు.ఇలా అప్పు పై ఉన్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకొని ఆయనను తిరిగి బ్రతికించారంటూ అశ్విని మరోసారి తన భర్త పునీత్ రాజ్ కుమార్ ను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.

James : చివరి సారిగా పునీత్ ను చూస్తూ.. అభిమానుల కన్నీళ్ళతో తడిసి ముద్దవుతున్న దియేటర్లు..!

కన్నడ పవర్ స్టార్‌ పునీత్ రాజ్ కుమార్ నటుడే కాదు.. ఎన్నో సేవా కార్యక్రమాలలో భాగస్వాముడు కూడా. ఆయన ఆధ్వర్యంలో 26 అనాథాశ్రమాలు, 25 పాఠశాలలు, 15 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు నడుస్తున్నాయి. 1800 మంది పేద విద్యార్ధులకు ఆయన చదువు చెప్పిస్తున్నారు. మైసూరులో బాలికా విద్యార్ధినులతో కూడిన శక్తి ధామ అనే ఓ అతిపెద్ద స్వచ్ఛంద సంస్థను కూడా ఆయన నడుపుతున్నారు. ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అయినా ఆ సేవలను ప్రచారం చేసుకోవడానికి అతడు ఏ మాత్రం ఇష్టపడలేదు. ఇంత గొప్ప వ్యక్తి మరణం ఎవరినీ జీర్ణించుకోలేక చేసింది.

ఇక పునీత్ నటించిన చివరి సినిమా జేమ్స్. ఈరోజు అయన పుట్టినరోజు సందర్భంగా మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా 4 వేల థియేటర్లలో సుమారు 5 భాషల్లో “జేమ్స్” చిత్రాన్ని విడుదల చేసారు. పునీత్ చనిపోకముందు చివరగా నటించిన సినిమా కావడంతో అభిమానులంతా భావోద్వేగానికి గురవుతున్నారు. చివరిసారిగా స్కీన్ పై పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను చూసి బరువెక్కిన హృదయంతో కన్నీరు మున్నేరు అవుతున్నారు. ఈ నేపద్యంలో ఇప్పటికే మార్చి 17 నుంచి 24 వరకు ఈ వారం రోజులు కర్ణాటకలోని అన్ని సినిమా ధియేటర్స్ లో “జేమ్స్” సినిమానే ప్రదర్శిస్తామని డిస్టిబ్యూటర్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఎక్కడ చూసిన పునీత్ గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియా మొత్తం పునీత్ రాజ్ కుమార్ పోస్టులతో హోరెత్తిస్తున్నారు. ఈరోజు పునీత్ రాజ్ కుమార్ పుట్టిన రోజు కూడా కావడంతో అయన అభిమానులు మరింత ఎమోషనల్ అవుతూ ఆయనను చివరిగా చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.