కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటుడే కాదు.. ఎన్నో సేవా కార్యక్రమాలలో భాగస్వాముడు కూడా. ఆయన ఆధ్వర్యంలో 26 అనాథాశ్రమాలు, 25 పాఠశాలలు, 15 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు నడుస్తున్నాయి. 1800 మంది పేద విద్యార్ధులకు ఆయన చదువు చెప్పిస్తున్నారు. మైసూరులో బాలికా విద్యార్ధినులతో కూడిన శక్తి ధామ అనే ఓ అతిపెద్ద స్వచ్ఛంద సంస్థను కూడా ఆయన నడుపుతున్నారు. ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అయినా ఆ సేవలను ప్రచారం చేసుకోవడానికి అతడు ఏ మాత్రం ఇష్టపడలేదు. ఇంత గొప్ప వ్యక్తి మరణం ఎవరినీ జీర్ణించుకోలేక చేసింది.
ఇక పునీత్ నటించిన చివరి సినిమా జేమ్స్. ఈరోజు అయన పుట్టినరోజు సందర్భంగా మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా 4 వేల థియేటర్లలో సుమారు 5 భాషల్లో “జేమ్స్” చిత్రాన్ని విడుదల చేసారు. పునీత్ చనిపోకముందు చివరగా నటించిన సినిమా కావడంతో అభిమానులంతా భావోద్వేగానికి గురవుతున్నారు. చివరిసారిగా స్కీన్ పై పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను చూసి బరువెక్కిన హృదయంతో కన్నీరు మున్నేరు అవుతున్నారు. ఈ నేపద్యంలో ఇప్పటికే మార్చి 17 నుంచి 24 వరకు ఈ వారం రోజులు కర్ణాటకలోని అన్ని సినిమా ధియేటర్స్ లో “జేమ్స్” సినిమానే ప్రదర్శిస్తామని డిస్టిబ్యూటర్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఎక్కడ చూసిన పునీత్ గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియా మొత్తం పునీత్ రాజ్ కుమార్ పోస్టులతో హోరెత్తిస్తున్నారు. ఈరోజు పునీత్ రాజ్ కుమార్ పుట్టిన రోజు కూడా కావడంతో అయన అభిమానులు మరింత ఎమోషనల్ అవుతూ ఆయనను చివరిగా చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…
చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…
ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్ను వదిలి…
తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…
సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…