Puneeth Raj Kumar Wife: ఆ కారణం వల్లే పునీత్ చివరి సినిమా చూడలేదు… పునీత్ భార్య అశ్విని షాకింగ్ కామెంట్స్!
Puneeth Raj Kumar Wife: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఈయన మరణ వార్తను ఇప్పటికి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే పునీత్ రాజ్ కుమార్ చివరిసారిగా నటించిన సినిమా జేమ్స్. ఈ సినిమా ఆయన మరణాంతరం విడుదల కావడం విశేషం. అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటిరోజు ఎంతో పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.
ఇక తన అభిమాన నటుడిని చివరిసారిగా నటించిన సినిమా కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్ కి వెళ్లి పునీత్ నటించిన జేమ్స్ సినిమాని చూడటమే కాకుండా ఆయన లేరనే విషయాన్ని తెలుసుకొని ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. ఇక పునీత్ నటించిన చివరి సినిమాని తన ఇద్దరు కూతుర్లతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా వీక్షించారు.
అయితే పునీత్ జేమ్స్ సినిమాని ఇప్పటి వరకు ఆయన భార్య అశ్విని చూడలేదు. అయితే అశ్విని ఈ సినిమా ఎందుకు చూడలేదనే విషయాన్ని తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని మాట్లాడుతూ…ఈ సినిమా ఎంతో అద్భుతంగా వచ్చిందని ప్రతి ఒక్కరు చెబుతున్నారు కానీ ఈ సినిమా నేను చూడలేదు.
ఈ సినిమా చూడడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే అందరి మాదిరి ఈ సినిమాని నేను చూడలేకపోవచ్చు అంటూ తెలియజేశారు.ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇందులో యాక్షన్ సన్నివేశాలు గురించి నా దగ్గర ఎన్నో సార్లు చెప్పారు. అలాగే ఈ సినిమా కోసం ఉపయోగించిన టెక్నాలజీ గురించి కూడా తన దగ్గర ఎన్నోసార్లు వివరించారని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.పునీత్ నటించిన చివరి సినిమా విడుదలైన తర్వాత ఎంతోమంది అప్పు అభిమానులు నేత్రదానం, రక్తదానం, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించారు.ఇలా అప్పు పై ఉన్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకొని ఆయనను తిరిగి బ్రతికించారంటూ అశ్విని మరోసారి తన భర్త పునీత్ రాజ్ కుమార్ ను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.
మన శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తంలో ఉన్న వ్యర్థాలను తొలగించడమే కాకుండా, శరీరంలో ద్రవాల సమతుల్యతను…
వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు సహజమే. అయితే ఇటీవల చాలా మందిలో కనిపిస్తున్న ఒక సమస్య నిపుణులను…
మన రోజువారీ వంటకాలలో నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు దాదాపు ప్రతి…
మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…
గుజరాత్లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…