Puneeth Rajkumar: తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎలాగో కన్నడ చిత్ర పరిశ్రమకు రాజ్ కుమార్ అలా.కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడు రాజ్ కుమార్ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈయన కుమారులు ఇండస్ట్రీలోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇలా రాజ్ కుమార్ చిన్న కుమారుడు పునీత్ రాజ్ కుమార్ బాల నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
ఈయన బాల నటుడుగానే కాకుండా హీరోగా ఎన్నో సినిమాలలో నటించి విశేషమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. కేవలం సినిమాల పరంగా మాత్రమే కాకుండా పునీత్ తన మంచి మనస్తత్వంతో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు. అయితే ఆయన బ్రతికున్నప్పుడు ఏ ఒక్కటి బయటకు చెప్పుకోలేదు. ఆయన మరణాంతరం ఈ విషయాలు తెలియడంతో పునీత్ అంటే కూడా తెలియని వారు సైతం ఈయన అభిమానులుగా మారిపోయారు.
గత ఏడాది అక్టోబర్ 29వ తేదీ గుండెపోటుతో మరణించిన పునీత్ మరణ వార్తను ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం సినిమా షూటింగ్ పనులు పూర్తి అయిన తర్వాత తన కుటుంబంతో సంతోషంగా గడుపుతూ వివాదాలకు దూరంగా ఉండే పునీత్ తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి కూడా ఇష్టపడరు. అందుకే ఈయనకు సంబంధించిన చాలా విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు.
ఇకపోతే పునీత్ భార్య అశ్విని గురించి చాలామందికి తెలియదు. పునీత్ భార్య ఓ ధనవంతులు కుటుంబానికి చెందిన అమ్మాయి అనుకుంటే పొరపాటే ఈమె ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఓ కార్యక్రమంలో భాగంగా ఫ్రెండ్ ద్వారా పునీత్ అశ్విని మధ్య పరిచయం ఏర్పడింది. ఇలా ఈ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు కూడా వారి కుటుంబ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.అశ్విని ఆ ఇంటికి చిన్న కోడలుగా అడుగుపెట్టగా తనకన్నా ఇద్దరు కోడలు ధనవంతుల కుటుంబం నుంచి రావడంతో ఈమె ఆ కుటుంబంతో కలవలేకపోయింది.అయితే పునీత్ తన కుటుంబ సభ్యులకు గురించి వివరించగా మెల్లిమెల్లిగా ఈమె కూడా ఆ కుటుంబ సభ్యులతో కలిసిపోయి అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు.అయితే ప్రస్తుతం పునీత్ వారి మధ్య లేకపోయిన రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు తనను సొంత మనిషిగానే భావిస్తున్నారని అశ్విని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఫిట్నెస్, క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వెల్లడించారు.…
అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రామకృష్ణ ఐలా (యూఎస్ఏ)…
మన రోజువారీ జీవితంలో సులభంగా దొరికే పండ్లలో అరటిపండు ఒకటి. పండగలు, శుభకార్యాలు, ఇంటి వేడుకలు ఏవి జరిగినా ముందుగా…
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలై విద్యార్థుల్లో ఆనందం నింపాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ఫలితాలను ప్రకటిస్తూ, ఈ…
ఆహారంలో రంగు, వాసన కోసం మాత్రమే ఉపయోగించే కుంకుమపువ్వు నిజానికి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయం చాలా మందికి తెలియదు.…
హైదరాబాద్లో ప్రేమ పేరుతో జరిగిన ఓ దొంగతనం కేసు తాజాగా బయటకు రావడం సంచలనంగా మారింది. ప్రియుడికి బర్త్డే గిఫ్ట్…