Venu Thottempudi: సాధారణంగా ఒక సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు ఎక్కువ శాతం వారి సినిమాలకు వారి డబ్బింగ్ చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే కొంతమంది హీరోలు మాత్రం తమ సినిమాలకు డబ్బింగ్ చెప్పుకోరు. ఇలాంటి కోవకు చెందిన వారే వేణు తొట్టెంపూడి.
ఈయన ఇప్పటివరకు సుమారు పాతిక సినిమాల వరకు నటించారు. అయితే ఏ ఒక్క సినిమాలో కూడా ఆయన సొంతంగా డబ్బింగ్ చెప్పలేదు. వేణు సినిమాలలో నటించినప్పటికీ ఈయనకు మాత్రం గత కొంతకాలం నుంచి వాయుపుత్ర నాగార్జున గారు డబ్బింగ్ చెబుతున్నారు. ఈయన వృత్తి రీత్యా కాలేజ్ ప్రొఫెసర్ అయినప్పటికీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలకు వారి బాడీ లాంగ్వేజ్ కి అనుగుణంగా డబ్బింగ్ చెప్పేవారు.
ఈయన ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు ఎంతో మంది ఆర్టిస్టులకు ఇలా డబ్బింగ్ చెబుతూ ఉన్నప్పటికీ ఈయన పేరు మాత్రం తెర వెనకే ఉండిపోయింది. ఈ విధంగా డబ్బింగ్ ఆర్టిస్టులకు తెరపై ఏమాత్రం గుర్తింపు రాలేదని చెప్పాలి. ఇకపోతే నాగార్జున గారు కూడా ఎప్పుడు తనకు పేరు ప్రఖ్యాతలు రావాలని, తాను ఫలానా హీరోలకు డబ్బింగ్ చెబుతున్నారని ఎక్కడ చెప్పుకోలేదు.
ఈ విధంగా తొట్టెంపూడి వేణు గత అన్ని సినిమాలకు వాయుపుత్ర నాగార్జున గారు డబ్బింగ్ చెప్పగా తాజాగా ఈయన నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో మాత్రం మొదటిసారి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేస్తున్న వేణు ఇలా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం వల్ల తన పాత్రను తాను ఓన్ చేసుకోగలుగుతున్నాను అంటూ సమాధానం చెప్పారు. ఇలా మొదటిసారి డబ్బింగ్ చెప్పుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వేణు వెల్లడించారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…