Tag Archives: radha

Radha: ఆ పాటకు చిరుతో డాన్స్ చేయాలంటే కష్టంగా అనిపించింది: రాధా

Radha: తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రాధా ఒకరు. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించినటువంటి రాధ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే బుల్లితెరపై నీతోనే డాన్స్ కార్యక్రమానికి ఈమె జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి రాధా ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి. మీ మొదటి సినిమా చిరంజీవి గారితో ఏది అనే ప్రశ్న ఆలీ అడగడంతో రాధా సమాధానం చెబుతూ చిరంజీవి గారితో కలిసి గుండా అనే సినిమాలో మొదటిసారి నటించానని తెలిపారు.

నిజాయితీపరులు..

ఇక ఆయనతోపాటు నేను సమానంగా డాన్స్ చేసేదాన్ని నిర్మాతల డబ్బు నష్టపోకూడదు అన్న ఉద్దేశంతోనే సింగిల్ టేక్ లో ఎలాంటి స్టెప్స్ అయినా కూడా చేసేస్తానని తెలిపారు. కానీ యముడికి మొగుడు సినిమాలో అందం హిందోళం అధరం తాంబూలం పాటకి మాత్రం చిరంజీవితో పాటు డ్యాన్స్ చేయడం కష్టంగా అనిపించినట్లు రాధ గుర్తు చేసుకుంది. చిరంజీవి మంచివారు మాత్రమే కాదు నిజాయితీపరులు. మా ఇద్దరి మధ్య ఎప్పుడూ డ్యాన్స్ విషయంలో పోటీ ఉండేదని ఆ పోటీ ఉన్నప్పుడే సినిమా కూడా అద్భుతంగా వస్తుందంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Chiranjeevi: చిరంజీవి మనసు దోచుకున్న హీరోయిన్ తనే.. ఏకంగా మంచి కెమిస్ట్రీ ఉందంటూ?

Chiranjeevi: గత మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో మంచి మార్కులు సంపాదించుకున్న ఈయన ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు. ఆ తరం హీరోయిన్ల నుంచి ఈ తరం హీరోయిన్ల వరకు అందరితో నటించాడు చిరంజీవి. ఈయనతో పాటు ఈయన ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

నటుడుగా కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు చిరంజీవి. ఎంతోమందికి సహాయం చేసి మంచి మనసున్న వ్యక్తిగా నిలిచాడు. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చాలా విషయాలు పంచుకున్నాడు. శ్రీదేవి, విజయశాంతి, రాధ, రాధిక లలో ఎవరు బెస్ట్ అని ప్రశ్న ఎదురవటంతో వెంటనే చిరంజీవి ఈ ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేదని తప్పించుకున్నాడు.

కానీ ఈ హీరోయిన్లతో అద్భుతమైన కెమిస్ట్రీ ఉండేదని.. అంతేకానీ వాళ్లలో ఎవరు బెస్ట్ అని అడిగితే చెప్పలేను అని అన్నాడు. ఇక ఒక్కో హీరోయిన్లలో ఒక్కో స్పెషాలిటీ ఉందని అన్నాడు. రాధిక సహజంగా, సులువుగా నటిస్తుంది అని.. రాధ అద్భుతంగా డాన్స్ చేస్తుంది అని.. విజయశాంతి పర్ఫెక్ట్ అని తెలిపాడు. ఇక తన ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి అని మనసులో మాట బయటపెట్టాడు.

Chiranjeevi:

ఇక శ్రీదేవి గురించి కొన్ని విషయాలు బయట పెట్టాడు. ఆమె తనకు వృత్తిపరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా రిలేషన్ ఉందని.. తనతో పని చేసిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని అన్నాడు. అంతేకాకుండా తమది ఉత్తమ జంటగా కూడా ప్రేక్షకులు భావిస్తూ ఉంటారని.. తామిద్దరూ కలిసి నటించిన సినిమాలన్నీ బాగా హిట్ అయ్యాయని.. నటన విషయంలో, విషయంలో శ్రీదేవి చాలా బెస్ట్ అని తెలిపాడు.

Kutty Padmini: నాకు రెండో పెళ్లి జరిగినా మొదటి భర్తను కూడా ఇంట్లో పెట్టుకొని చూసుకున్నాను… నటి పద్మని కామెంట్స్ వైరల్!

Kutty Padmini: చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కుట్టి పద్మిని ప్రస్తుతం నిర్మాతగా మారారు.మూడు నెలల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె అనంతరం బాలనటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఉత్తమ బాలనటిగా అవార్డులు కూడా అందుకున్నారు. పద్మిని తల్లి రాధ కూడా నటి కావడంతో ఈమె మూడు నెలల వయసులోనే సినిమాలలో నటించారు.

ఇలా తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలలో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినా కుట్టిపద్మిని ప్రస్తుతం వైష్ణవి ఫిలింస్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ అనే బ్యానర్ ద్వారా సీరియల్స్ నిర్మిస్తూ నిర్మాతగా మారిపోయారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన సినీ కెరియర్ గురించి పలు విషయాలు తెలిపారు.తనకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు వచ్చింది అలాగే తనకు హీరోయిన్గా అవకాశాలు కూడా వచ్చాయని అయితే అడ్జస్ట్ కావాలని
అడగటంతో సినిమా అవకాశాలను కూడా వదులుకున్నానని తెలిపారు.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ కుమార్తె అర్హ నటించిన భరతుడి పాత్ర తాను కూడా ఎన్టీఆర్ హీరోగా నటించిన శకుంతల సినిమాలో భరతుడు పాత్రలో నటించానని అప్పుడు తాను నిజమైన పులిపై వచ్చానని ఈమె ఆ పాత్ర గురించి గుర్తు చేసుకున్నారు. ఇక సినిమా విషయాలు మాత్రమే కాకుండా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడుతూ…తాను మొదట వివాహం చేసుకున్న తర్వాత తన భర్త తాగుడుకు బానిస కావడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయామని తెలిపారు.


Kutty Padmini: ఆరోగ్యం బాగా లేకపోతే నేనే చూసుకున్నా.

ఇలా మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత రెండవ వివాహం చేసుకున్నాను. తనకు ఇద్దరు పిల్లలు జన్మించారని తెలిపారు.అయితే తన మొదటి భర్త ఎలాంటి ఉద్యోగం లేకుండా తీవ్ర అనారోగ్య సమస్యలకు గురి కావడంతో ఆయనను తీసుకువచ్చి మా ఆఫీస్ కింద ప్రత్యేకంగా గది నిర్మించి అక్కడ పెట్టి తనని చూసుకున్నానని తెలిపారు. ఇక నా రెండో భర్త తన సెక్రటరీని రెండవ వివాహం చేసుకొని వెళ్లిపోయారని ప్రస్తుతం తాను తన పిల్లలతో ఒంటరిగా గడుపుతున్నానని తెలిపారు.రెండో పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి భర్తతో బెడ్ షేర్ చేసుకోకూడదు కానీ తన అవసరాలు తీర్చడంలో నాకు తప్పనిపించలేదని అందుకే తన మొదటి భర్తను తన ఇంట్లోనే పెట్టి చూసుకున్నానంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Shriya Saran: మొదటిసారి కూతురి ఫేస్ రివీల్ చేసిన నటి శ్రియ… ఎంతో క్యూట్ గా ఉన్న రాధ వైరల్ అవుతున్న ఫోటోలు !

Shriya Saran: టాలీవుడ్ సినీ ప్రేమికులకు నటి శ్రీయ గురించి పరిచయం అవసరం లేదు. ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన నటించి ఎంతో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకుంది.ఇలా అగ్ర హీరోలు అందరు సరసన సూపర్ హిట్ సినిమాలలో నటించిన శ్రియ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా పలు సినిమాలలో చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ విధంగా సినీ కెరియర్ లో ఎంతో బిజీగా ఉన్న ఈమె తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇకపోతే ఈమె ఎవరికీ తెలియకుండా రహస్యంగా 2018లో ఆండ్రీ అనే వ్యక్తిని పెళ్లాడి తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా అభిమానులు ఇక పెళ్లి విషయమే కాకుండా తన ప్రెగ్నెన్సీ విషయాన్నీ కూడా సీక్రెట్ గా ఉంచారు.

ఇలా వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న శ్రియ 2021లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు తెలిపి అందరిని మరోసారి ఆశ్చర్యపరిచారు.ఇకపోతే తనకు కూతురు పుట్టిన విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఇప్పటివరకు తన కూతురి ఫోటోలను షేర్ చేసినప్పటికీ ఈమె ఎక్కడ తన కూతురి ఫేస్ మాత్రం కనపడకుండా జాగ్రత్త పడ్డారు.

Shriya Saran: భర్త పుట్టిన రోజు సందర్భంగా…

అయితే తాజాగా తన భర్త పుట్టినరోజు సందర్భంగా శ్రియ తన కూతురి ఫోటోలను షేర్ చేశారు. ఇలా మొదటిసారి ఈమె తన కూతురు ఫేస్ కూడా రివీల్ చేయడంతో ఈమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే శ్రియ కూతురి ఫోటోలు చూసిన అభిమానులు రాధా ఎంతో క్యూట్ గా ఉందంటూ కామెంట్ లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Mahesh Babu-Radha: మహేష్ బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న ఒకప్పటి తార రాధ!

Mahesh Babu-Radha: సూపర్ స్టార్ మహేష్ బాబు చివరి సినిమా విడుదలై దాదాపు చాలా రోజులు అవుతుంది. ప్రస్తుతం అతడు హీరోగా నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. దీనికి సంబంధించి ఇటీవల మూవీ మేకర్స్ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు.

Mahesh Babu-Radha: మహేష్ బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న ఒకప్పటి తార రాధ!

ఇదిలా ఉండగా.. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ బాబుకు సర్జరీ అవ్వడం.. కరోనా పాజిటివ్ రావడం లాంటివి జరగడంతో సినిమా షూటింగ్ లో పాల్గొనలేకపోయాడు. ఎట్టకేలకు మళ్లీ షూటింగ్ పనులు మొదలు పెట్టేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మూవీ మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ (Keerthi Suresh) హీరోయిన్‏గా నటిస్తుండగా.. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Mahesh Babu-Radha: మహేష్ బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న ఒకప్పటి తార రాధ!

అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. దీంతో ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది.

త్రివిక్రమ్ కు ఇలా చేయడం అలవాటే..

ఈ సినిమాలో ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ రాధ కీలక పాత్రలో కనిపించనుందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మహేష్ బాబుకు తల్లి క్యారెక్టర్ లో ఆమె పాత్రను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను మూవీ చిత్ర బృందం సంప్రదించినట్లు సమాచారం. ఇక 90వ దశకంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన రాధా వివాహం తర్వాత దాదాపు సినిమాలకు దూరం అయ్యారు. ఈ చిత్రంతో మళ్లీ వెండితెరపై కనువిందు చేయనుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. ఆమె అభిమానులు మాత్రం ఖుషీ ఖుషీగా ఉన్నారు. తమ అభిమాను హీరోయిన్ ను మళ్లీ సినిమాల్లో ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. ఇక సీనియర్ హీరోయిన్లను తన సినిమాల్లో అవకాశం ఇవ్వడం త్రివిక్రమ్ కు మొదటి నుంచి కూడా అలవాటే. అత్తారింటికి దారేదిలో నదియాకు,
అజ్ఞాతవాసిలో ఖుష్బూ, అల వైకుంఠపురములో టబులకు అవకాశం ఇచ్చారు.

టూ టౌన్ రౌడీ సినిమాలో హీరోయిన్‌ గా ఐశ్వ‌ర్య‌ను అనుకుని.. ఎందుకు తప్పించారో తెలుసా?

దాసరి నారాయణరావు దర్శకత్వంలో.. విక్టరీ వెంకటేశ్ హీరోగా వచ్చిన సినిమా ‘టూ టౌన్ రౌడీ’. ఇందులో వెంకటేష్, రాధ ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్-కోటి సంగీతం సమకూర్చారు. ఇది హిందీ చిత్రం తేజాబ్కు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరీ అంత హిట్ కాకపోయినా యావరేజ్ సినిమాగా ఆడింది.

ఇదిలా ఉండగా.. హీరోయిన్ గా రాధను మొదట అనుకోలేదట. ఆమె కాకుండా సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి కూతురు ఐశ్వ‌ర్య‌ను అనుకున్నారట. ఆమెకు మొదట ఈ సినిమాలోనే అవకాశం వచ్చిందట. కానీ నటి లక్ష్మి వల్ల ఆ ఛాన్స్ మిస్ చేసుకోగా.. జగపతిబాబు సరసన అడ‌విలో అభిమ‌న్యుడు అనే సినిమాలో నటించారు ఐశ్వర్య. నటి లక్ష్మి ఆ ఆఫర్ ను మిస్ చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే..

టూ టౌన్ సినిమాలో హీరోయిన్ ఓ సీన్ లో స్విమ్మింగ్ డ్రస్ వేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఐశ్వర్య ఓకె చెప్పినా.. నటి లక్ష్మి మాత్రం దానికి ఒప్పుకోలేదు. దీంతో ఆమె టూటౌన్ రౌడీ సినిమాలలో నటించకుండా అయిపోయింది. లేదంటే ఆమెకు అదే మొదటి సినిమా అయ్యేది. ఐశ్వర్య అంతకముందే హోస‌కావ్య అనే క‌న్న‌డ మూవీలో నటించేందుకు ఒప్పుకుందట..

ఆ కారణంగానే నటి లక్ష్మిని తన సినిమాలో నటించేందుకు డి. రామానాయుడు అడిగినట్లు తెలుస్తోంది. ఇక సినిమాకు ఓకె చెప్పిన తర్వాత.. ఈ స్విమ్మింగ్ డ్రస్ కు సంబంధించి సీన్ రావడంతో ఆమె ఆ పాత్ర నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.. అలా అని అనకుండా ఐశ్వర్య తల్లి లక్ష్మినే తప్పించారని చెప్పవచ్చు.