Kutty Padmini: చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కుట్టి పద్మిని ప్రస్తుతం నిర్మాతగా మారారు.మూడు నెలల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె అనంతరం బాలనటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఉత్తమ బాలనటిగా అవార్డులు కూడా అందుకున్నారు. పద్మిని తల్లి రాధ కూడా నటి కావడంతో ఈమె మూడు నెలల వయసులోనే సినిమాలలో నటించారు.
ఇలా తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలలో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినా కుట్టిపద్మిని ప్రస్తుతం వైష్ణవి ఫిలింస్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ అనే బ్యానర్ ద్వారా సీరియల్స్ నిర్మిస్తూ నిర్మాతగా మారిపోయారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన సినీ కెరియర్ గురించి పలు విషయాలు తెలిపారు.తనకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు వచ్చింది అలాగే తనకు హీరోయిన్గా అవకాశాలు కూడా వచ్చాయని అయితే అడ్జస్ట్ కావాలని
అడగటంతో సినిమా అవకాశాలను కూడా వదులుకున్నానని తెలిపారు.
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ కుమార్తె అర్హ నటించిన భరతుడి పాత్ర తాను కూడా ఎన్టీఆర్ హీరోగా నటించిన శకుంతల సినిమాలో భరతుడు పాత్రలో నటించానని అప్పుడు తాను నిజమైన పులిపై వచ్చానని ఈమె ఆ పాత్ర గురించి గుర్తు చేసుకున్నారు. ఇక సినిమా విషయాలు మాత్రమే కాకుండా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడుతూ…తాను మొదట వివాహం చేసుకున్న తర్వాత తన భర్త తాగుడుకు బానిస కావడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయామని తెలిపారు.
ఇలా మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత రెండవ వివాహం చేసుకున్నాను. తనకు ఇద్దరు పిల్లలు జన్మించారని తెలిపారు.అయితే తన మొదటి భర్త ఎలాంటి ఉద్యోగం లేకుండా తీవ్ర అనారోగ్య సమస్యలకు గురి కావడంతో ఆయనను తీసుకువచ్చి మా ఆఫీస్ కింద ప్రత్యేకంగా గది నిర్మించి అక్కడ పెట్టి తనని చూసుకున్నానని తెలిపారు. ఇక నా రెండో భర్త తన సెక్రటరీని రెండవ వివాహం చేసుకొని వెళ్లిపోయారని ప్రస్తుతం తాను తన పిల్లలతో ఒంటరిగా గడుపుతున్నానని తెలిపారు.రెండో పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి భర్తతో బెడ్ షేర్ చేసుకోకూడదు కానీ తన అవసరాలు తీర్చడంలో నాకు తప్పనిపించలేదని అందుకే తన మొదటి భర్తను తన ఇంట్లోనే పెట్టి చూసుకున్నానంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…
తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…
హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…
సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…
ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…