Tag Archives: rajastan

Younger Sarpanch: కోడలిగా అత్తారింటిలోకి అడుగు పెట్టి గ్రామాన్నే మార్చిన యువతి.. ఎందరికో ఆదర్శం!

Younger Sarpanch: సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నా, సమాజంలో మార్పు తీసుకురావాలన్న ముందు మన ఆలోచనా ధోరణి మారాలి. అప్పుడే ఎంతటి కష్టమైన పనిని కూడా ఎంతో సునాయసంగా చేయవచ్చు. ఇలా మన ఆలోచనల్లో మార్పు వస్తే సమాజాన్ని మార్చడం పెద్ద కష్టమైన పని కాదని నిరూపించారు ప్రియాంక తివారీ. గ్రామ సర్పంచ్ గా ఏడాదిలోపు తన గ్రామ రూపు రేఖలను మార్చి ఎందరితో ప్రశంసలు అందుకుంటున్నారు.

రాజస్థాన్‌లో పుట్టి ఢిల్లీలో పెరిగిన 29 ఏళ్ల ప్రియాంక తివారీ మాస్‌ కమ్యునికేషన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసింది. 2019లో ఉత్తరప్రదేశ్ లోని రాజ్ పూర్ గ్రామానికి చెందిన ఒక వ్యాపారవేత్తతో వివాహం జరగడంతో ఈమె ఉత్తరప్రదేశ్ లోని రాజ్ పూర్ గ్రామానికి కోడలిగా అడుగుపెట్టింది. ఢిల్లీలో పెరిగిన ప్రియాంకకు ఆ గ్రామ వాతావరణం ఏమాత్రం నచ్చలేదు. ఎలాగైనా తన గ్రామ రూపురేఖలను మార్చాలనే ఆలోచన చేసింది.

అదే సమయంలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడంతో తమ కోడలి ఆలోచనలను తెలుసుకున్న వారి అత్తమామలు తనని గ్రామ సర్పంచ్ గా ఎన్నికలలో పోటీ చేయమన్నారు.ఈమె తన ఆలోచనలన్నింటినీ గ్రామ ప్రజలకు అర్థమయ్యేలా వివరించి పంచాయతీ ఎన్నికలలో సర్పంచిగా ఎన్నికయ్యారు. ఈమె సర్పంచిగా ఎన్నికవడంతోనే గ్రామంలో ముందుగా ప్లాస్టిక్ నిషేధాన్ని అమలులోకి తీసుకు వచ్చారు.

అభివృద్ధి పథంలో రాజాపూర్ గ్రామం..


గ్రామంలో ప్లాస్టిక్ ఎక్కడ ఉపయోగించకూడదని పంచాయతీ నుంచి బట్టతో తయారు చేసిన బ్యాగులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇలా దాదాపు ఏడాది లోపే 75% ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేశారు. ఇలాప్లాస్టిక్ నిషేధాన్ని ప్రోత్సహించడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈమెను ప్రోత్సహిస్తూ తొమ్మిది లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. ఆ డబ్బులను కూడా ఈమె గ్రామ అభివృద్ధి కోసం ఉపయోగిస్తూ రాష్ట్రం మొత్తం గ్రామం వైపు చూసేలా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు.ఈ విధంగా ఆ ఊరికి కోడలిగా వచ్చిన ప్రియాంక గ్రామ ప్రజలలో వారి ఆలోచనలో మార్పు తీసుకువచ్చి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఎందరికో ఆదర్శంగా ఉన్నారు.

అంగరంగ వైభవంగా కత్రినా – విక్కీ కౌశల్ వివాహం.. ఫోటోలు వైరల్!

బాలీవుడ్ ప్రేమపక్షులు కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ జంట గురించి గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నప్పటికీ వీరి పెళ్లి విషయం గురించి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవైపు పెళ్లి ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి కానీ ఈపెళ్లి గురించి ఈ జంట చెప్పక పోవడం విశేషం.

ఇదిలా ఉండగా కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో చాలా ఘనంగా వీరి వివాహాన్ని జరుపుకున్నారు. ఎంతో కట్టుదిట్టమైన భద్రత సిబ్బంది నేపథ్యంలో వీరి వివాహాన్ని జరుపుకున్నారు.ఇకపోతే కత్రిన వివాహ వేడుకలకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా మనకు సోషల్ మీడియాలో లభించలేదు. అందుకు గల కారణం ఈమె తన పెళ్లి వీడియోని మొత్తం ఒక ఓటీటీ సంస్థకు సుమారు వంద కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈమె పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు వీడియోలు కానీ ఇంతవరకు బయటకు రాకపోయినా ప్రస్తుతం ఈమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలలో కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ పెళ్లి చూపులలో రాజసం ఉట్టిపడేలా కనిపిస్తున్నారు.ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టడంతో ఎంతోమంది నెటిజనులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక వీరి పెళ్ళి వీడియోను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే త్వరలోనే వీరి పెళ్లికి సంబంధించిన వీడియోలను అమెజాన్ ప్రైమ్ ద్వారా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి పలువురు సిని ప్రముఖులు వ్యాపారవేత్తలు సమక్షంలో కత్రినా విక్కీ కౌశల్ ఒకటి కావడంతో వీరికి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.

పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకున్న కత్రినా- విక్కీ పెళ్లేప్పుడంటే..!

ప్రస్తుతం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఉన్న న్యూస్ కత్రినా, విక్కీల వివాహం. వీరి పెళ్లి గురించి గత రెండు మూడు రోజులుగా బాలీవుడ్ సినీ వర్గాలలో పెద్దఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ బాలీవుడ్ కోడైకూస్తోంది.

పెళ్లి పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఇటీవలే కత్రినా సన్నిహితుడు అయిన ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ ఇంట్లో కత్రినా, విక్కీల నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ జంట డిసెంబర్ మొదటి వారంలో రాజస్థాన్ లోని ఒక విలాసవంతమైన ప్యాలెస్ లో ఒకటి కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందని తెలుస్తోంది. రాజస్థాన్ లోని విలాసవంతమైన సిక్స్ సెన్సెస్ ఆఫ్ పోర్ట్ బర్వరాలో డిసెంబర్ 9న ఈ ప్రేమ జంట మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. ముహూర్తం రోజు సాయంత్రం హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరుగుతుందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.

అయితే వీరి పెళ్లికి అతికొద్దిమంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఫ్రీ వెడ్డింగ్ కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 7న మెహందీ, 8 సంగీత్ వేడుకలు జరగనున్నాయట. ఈ క్రమంలోనే పెళ్లికి అతి తక్కువ రోజులు ఉండటంతో పెళ్లి పనులు చకచకా జరుగుతున్నాయి. ఇక మెహందీ ఫంక్షన్ కోసం కత్రినా కైఫ్ భారీగానే ఖర్చు చేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు స్నేహితులకు అమ్మేశాడు.. చివరికి ఇలా!

పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే పెళ్లి చేసేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్లి చేయాలని చెబుతూ ఉంటారు. అలాగే పెళ్లి చేసే ముందు కలిసి జీవితాంతం బతికే ఆ వధూవరుల ఇష్టా, ఇష్టాలను అడిగి చేయాలని చెబుతుంటారు. అలా కాకుండా వధువు, వరుడిలో ఏ ఒక్కరికి అయినా ఆ పెళ్లి ఇష్టం లేకపోతే, వారు జీవితాంతం కష్టపడాల్సి ఉంటుంది.

ఇష్టంలేని పెళ్లి వల్ల భార్యభర్తల మధ్య కొట్లాటలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చిన్న చిన్న వాటికి పెద్ద నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఒకవేళ ఇష్టం లేని పెళ్లి చేసుకున్న, ఆ తరువాత కొట్లాటలు, సమస్యలు వచ్చినప్పటికీ ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వాటిని అధిగమిస్తూ వెళ్లాలి. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాలి. కానీ ఓ ప్రబుద్ధుడు మాత్రం తనకి ఇష్టంలేని పెళ్లి చేశారని ఏకంగా తన భార్యను స్నేహితులకు అమ్మేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒక వ్యక్తికి సంవత్సరం కిందట పెళ్లయింది. అయితే అతను కట్నంకోసం చేసుకున్నాడో, లేక తన తల్లిదండ్రుల బలవంతం మీద పెళ్లి చేసుకున్నాడో తెలియదుకానీ, పెళ్లి చేసుకున్న అప్పటినుంచి తన భార్యను చిత్రహింసలకు గురి చేయడం మొదలుపెట్టాడు. ఆమెను అందంగా లేవు, అసహ్యంగా ఉన్నావు అంటూ చిత్రహింసలకు గురి చేసే వాడు.ఆ కోపంతోనే ఏ భర్త చేయని ఒక దారుణానికి ఒడిగట్టాడు. తన భార్యను తన స్నేహితులకు అమ్మేసి చేతులు దులుపుకున్నాడు.

ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని కోట ప్రాంతంలో జరిగింది.కోటకు సమీపంలోని బుండి అనే ప్రాంతానికి చెందిన ఒక యువతిని విజయ్‌గఢ్ ప్రాంతానికి చెందిన రాకేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి తర్వాత రాకేష్ తన భార్యను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు.. భార్య అందంగా లేదని తిడుతూ చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా ఆమెపై ఉన్న కోపంతో ఆమెను తన స్నేహితులకు అమ్మేశాడు. వారు ఆమెను దెవ్లీ ప్రాంతానికి తీసుకెళ్లి ఓ ఇంట్లో ఉంచి, కొన్ని రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత వారి చెర నుంచి తప్పించుకున్న ఆమె పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాకేష్ ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

మేకలు కాసే 16 ఏళ్ల బాలికపై 25 రోజులుగా అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి..

మేకలు కాస్తున్న ఓ బాలికపై కామాంధులు కన్నేశారు. జీపులో తీసుకువెళ్లి, దాదాపు నెలరోజులుగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్‌ రాష్ట్రంలోని చురూ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. చురూ జిల్లలోని ఓ గ్రామంలో 16 ఏళ్ల బాలిక మేకలు కాస్తూ ఉంది.

ఆమె 25 రోజుల క్రితం ఓ కొండపైకి వెళ్లింది. అక్కడ నుంచి మేసుకుంటూ మేకలు.. కింద వరకు వస్తుండగా.. వాటిని అనుసరిస్తూ ఆ బాలిక కూడా వచ్చింది. అటు నుంచి ఓ కామాంధుడు జీపులో వచ్చి బలవంతంగా ఆమేను జీపులోకి ఎక్కించాడు. అక్కడ నుంచి ఆమెను జిల్లాలోని మరో ప్రదేశానికి తీసుకెళ్లాడు.

ఆమె కాపాడండి అంటూ అరుస్తుండగా.. నోటికి ప్లాస్టర్ వేసి మాట రాకుండా మూసి.. వేరే చోటుకు ఆ జీపును తీసుకెళ్లాడు. ఇలా ఆ ప్రదేశంలో ఆమెను 20 నుంచి 25 రోజులుగా రోజూ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల ఆమె అక్కడ నుంచి అతడు బయటకు వెళ్లింది చూసి.. ఎలాగోలా బయటపడి తన ఇంటికి వెళ్లి.. అక్కడ తన కుటుంబసభ్యులతో పాటు పోలీస్ స్టేషన్ కు జరిగిన విషయం చెప్పి వారిపై ఫిర్యాదు చేసింది.

ఆ రూంలో అతడితో పాటు మరికొంత మంది తనకు తేనీటిలో మత్తుపదరర్ధాన్ని కలిపి ఇచ్చారని చెప్పింది. ఇలా దాదాపు 25 రోజుల దాకా తనపై అత్యాచారం చేసినట్లు పేర్కొంది. దీనిపై పోలీసులు ఆ నిందితులపై ఐపీసీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు . పరారీ లో ఉన్న ఆ నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వామ్మో.. ఇతను ఏడాదిలో 300 రోజులు నిద్రలోనే ఉంటాడు.. కారణం ఏమిటంటే?

సాధారణంగా ప్రతి రోజూ మనం ఎనిమిది గంటల పాటు నిద్ర పోతే ఎంతో ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు. ఎనిమిది గంటలకు మించి నిద్రపోతే తీవ్రమైన తలనొప్పి మనల్ని వెంటాడుతుంది.అయితే మనం పురాణాలలో కుంభకర్ణుడు ఆరు నెలల పాటు నిద్రపోతే మరో ఆరు నెలల పాటు మేల్కొని ఉంటాడు అనే సంగతి వినే ఉంటాము. కానీ రాజస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం కుంభకర్ణుడిని మించి నిద్రపోవడం విశేషం. ఈ వ్యక్తి ఏడాదిలో సుమారుగా 300 రోజులు నిద్రలోనే ఉంటాడు. ఈ విధంగా నిద్ర పోవడానికి కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

రాజస్థాన్‌‌లోని నగౌర్‌కు చెందిన పుర్కారామ్ అనే వ్యక్తి వయస్సు 42 ఏళ్లు. భద్వా గ్రామంలో నివసిస్తున్నాడు. ఇతను ఏడాదిలో 300 రోజులు నిద్రలోనే ఉంటాడు. పుర్కారామ్ ఒక్కసారి నిద్రలోకి వెళ్ళాడు అంటే ఇక 25 రోజుల పాటు ఎంత లేపినా నిద్రనుంచి లేవడు. ఈ విధంగా నెలలో కేవలం అయిదు రోజులు మాత్రమే మెలకువలో ఉంటాడు. అయితే ఇతను సరదాగా ఇలా నిద్రపోతున్నాడు అంటే మనం పొరపాటు పడినట్లే.

పుర్కారామ్ ఈ విధంగా నిద్ర పోవడానికి గల కారణం అతనిని వెంటాడుతున్న “యాక్సిస్ హైపర్సోమ్నియా” అనే అరుదైన వ్యాధే కారణం. అయితే తన ఆర్థిక పరిస్థితుల కారణంగా చికిత్సకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తమ జీవనాధారం కోసం ఒక కిరాణా అంగడి నిర్వహిస్తున్న ఇతను కేవలం ఐదు రోజులు మాత్రమే షాపును తెరుస్తున్నాడు.

ఈ సందర్భంగా పుర్కారామ్ భార్య లక్ష్మీదేవి మాట్లాడుతూ.. గత కొంతకాలం వరకు రోజుకు 15 గంటలు మాత్రమే నిద్ర పోయేవాడు. వయసు పెరిగేకొద్దీ అతడు నిద్రపోవడం కూడా పెరుగుతోందని తెలిపింది. అతడు నిద్రలో ఉండగానే అతడికి స్నానం చేయించి ఆహారం తినపెడతామని లక్ష్మీదేవి తెలిపారు. ఒక్కసారి నిద్ర లోకి వెళ్ళాడంటే ఎంత ప్రయత్నించినా లేవడని నిద్ర లేవగానే తీవ్రమైన తలనొప్పితో బాధపడతారని ఈ సందర్భంగా భార్య లక్ష్మీదేవి తెలిపారు.

తన అందంతో భర్తను ఆకట్టుకున్న భార్య… మూడో రోజే అంత దారుణానికి ఒడిగట్టింది.!

ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిలు అబ్బాయిలను వెతకడం కోసం ఎన్నో మ్యారేజ్ బ్యూరో లు వచ్చాయి. అదేవిధంగా మ్యారేజ్ బ్రోకర్లు కూడా పెద్ద ఎత్తున వివాహ సంబంధాలను తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు పెళ్లి చేసుకోవాలని భావించి ఒక బ్రోకర్ ని సంప్రదించాడు. అతడు చూపించిన కొన్ని ఫోటోలలో ఒక అమ్మాయి అందానికి ముగ్ధుడై, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని హుటాహుటిన పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి చేసుకున్న మూడు రోజులకే ఆ పెళ్లి కొడుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది ఆ భార్య. పూర్తి వివరాలలోకి వెళితే…

రాజస్థాన్ లోని కోట జిల్లా, కునాడి ప్రాంతానికి చెందిన రవి అనే యువకుడు పెళ్లి కోసం ఓ మ్యారేజ్ బ్రోకర్ ని సంప్రదించాడు.ఈ క్రమంలోనే అతను ఓ అందమైన యువతి ఫోటో చూయించడంతో ఆ అమ్మాయిని చేసుకోవడానికి రవి ఎంతో ఇష్టపడ్డాడు.అయితే ఆ అమ్మాయికి కేవలం ఒక అన్న సోనూ మాత్రమే ఉన్నాడని, పెళ్లి చేసుకోవాలంటే అతనిని సంప్రదించాలని చెప్పడంతో వీరిరువురు ఒక హోటల్లో కలిశారు.

ఈ క్రమంలోనే యువతి కోమల్, సోదరుడు తన చెల్లికి ఏ విధమైనటువంటి కట్నకానుకలు సమర్పించుకోలేనని చెప్పడంతో ఆమె అందానికి ముగ్ధుడైన రవి కట్నకానుకలు లేకపోయినా తనని వివాహం చేసుకోవడం తనకు ఇష్టమని తెలిపాడు. ఈ క్రమంలోనే వారిరువురికి ఒక ఆలయంలో పెళ్లి జరిగింది. అయితే పెళ్లి అయిన మూడు రోజులకే కోమల్ ఇంట్లో నగలు డబ్బును తీసుకొని కనిపించకపోవడంతో రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

ఈ క్రమంలోనే మ్యారేజ్ బ్రోకర్ ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ క్రమంలోనే బ్రోకర్ కోమల్,సోనూ అన్నా చెల్లెలు కాదని,వారిద్దరూ భార్యాభర్తలనే విషయం చెప్పడంతో రవి కంగుతిన్నాడు. ఈ క్రమంలోనే పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.

వివాహ వేడుకలో ఎంపీ డ్యాన్స్.. వైరల్ వీడియో!

ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గలేదు. రోజురోజుకు కేసులు తగ్గుతున్న క్రమంలో ఇప్పటికే పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తి వేశారు. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ సరైన జాగ్రత్తలను పాటించడం ఎంతో ముఖ్యమని ఇప్పటికే అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా సమయంలో జరిగిన కొన్ని వివాహాలు కరోనా నిబంధనలని అతిక్రమించి వివాదాస్పదంగా మారిన సంగతి మనకు తెలిసిందే.

తాజాగా రాజస్థాన్ సవాయు మాధోపూర్‌ జిల్లాలోని బదిలా గ్రామంలో ఒక పెళ్లి జరిగింది. ఈ కార్యక్రమానికి
రాజస్థాన్‌ ఎంపీ కిరోడీలాల్‌ మీనా, స్థానిక ఎమ్మెల్యే ఇందిరా మీనా హజరయ్యారు. ఈ పెళ్లి వేడుకలలో భాగంగా జరిగి నబరాత్‌లో ఎం,పీ ఎమ్మెల్యే బంధువులతో కలిసి డ్యాన్సులు చేశారు. ఈ విధంగా ఎంపీ ఎమ్మెల్యే డాన్స్ లు చేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://youtu.be/emmmZtKLCtU

ప్రజలకు జాగ్రత్తలను చెప్పే ప్రజా ప్రతినిధులు ఈ విధంగా బాధ్యతారహితంగా మాస్కులు లేకుండా సామాజిక దూరం లేకుండా డాన్సులు చేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో తప్పు పడుతున్నాయి.ప్రజలకు సూచనలు చేయవలసిన నాయకులే ఈ విధంగా జాగ్రత్తలు పాటించకుండా బాధ్యతారహితంగా పాటిస్తే సామాన్య ప్రజల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పెళ్లి ఘటనకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆత్మహత్యకు ప్రయత్నించిన పూజారి.. కానీ అందులో ఏముందంటే?

సాధారణంగా ఆత్మాభిమానంతో ఉన్న వారికి సంబంధించిన కొన్ని విషయాలు అందరికీ తెలిస్తే ఎంతో కృంగిపోతారు. ఇలాంటి విషయాలలో ఎంతో సున్నితంగా ఉండేవారు ఆ సమయంలో ఎలాంటి అఘాయిత్యం చేసుకోడానికి అయినా వెనుకాడరు. అచ్చం ఇలాగే ఓ పూజారి తనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

రాజస్తాన్‌లోని ఆల్వార్‌ జిల్లాలో ఓ గుడిలో జగదీష్ అనే పూజారి పని చేసేవాడు. ఈ క్రమంలోనే గుడిలో పూజలు చేస్తుండగా ఓ మహిళ గత బుధవారం పూజారి పై చేయి చేసుకుంది. ఈ క్రమంలోనే పూజారి పై చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జగదీష్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే శుక్రవారం పూజారి విషం తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.

జగదీష్ ఈ విధంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గమనించిన అతని కుటుంబ సభ్యులు అతనిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పూజారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఈ క్రమంలోనే తన తండ్రికి ఇలాంటి పరిస్థితి ఎదురు కావడానికి కారణమైన మహిళపై పూజారి కొడుకు సర్దార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఈ క్రమంలోనే మహిళ కూడా పూజారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుడిలో పూజారి తనను వేధింపులకు గురి చేసినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది అందుకోసమే తనని కొట్టానని మహిళ తెలియజేసింది. వీరి ఫిర్యాదు అందుకున్న పోలీసులు మాట్లాడుతూ మహిళ గుడిలో పూజారిని చెప్పుతో కొట్టినప్పుడు ఆలయంలో ముగ్గురు భక్తులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతోనే పూజారి ఎంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

బైక్ మీద ఆరుగురు వచ్చారు.. వ్యాపారికి వార్నింగ్ ఇచ్చారు.. అంతలోనే?

ప్రస్తుత కాలంలో ఎవరి జీవితంలో ఎప్పుడు ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయో ఎవరికీ తెలియదు. ఉన్నఫలంగా ఎన్నో ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఇలాంటి ఈ సమయంలోనే మనం ఎంతో జాగ్రత్తగా వ్యవహరించకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా వహించిన లేదా కొద్దిగా ఏమరుపాటుగా ఉన్న తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి ఒక ప్రమాదకరమైన ఘటన రాజస్థాన్ లోని కోట జిల్లా మార్కెట్‌లో పట్టపగలే చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

పట్టపగలే మార్కెట్లోకి 2 బండ్లపై ఆరుగురు యువకులు వచ్చి మార్కెట్ లోని షాప్ యజమానులకు వేలుని చూపెడుతూ బెదిరించారు. అదే విధంగా మరో ముగ్గురు కైలాష్ మీనా అనే షాపు యజమాని ఇంట్లో ఉండగా అతని పేరు పెట్టి పిలిచిన వీరు ఆయన బయటికి రాగానే కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైన ఘటన చోటుచేసుకుంది.అయితే ఈ ప్రమాదంలో షాపు యజమానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

పండ్లు కూరగాయలు కమీషన్ ఏజెంటుగా గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కైలాష్ మీనా ఇక్కడి వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అతనిపై దాడి జరగడంతో పోలీసులకు సమాచారం తెలియజేశారు. ఈ క్రమంలోనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితుడిని పలు విషయాలపై ఆరా తీశారు.

ఈ క్రమంలోనే కైలాష్ మీనా తనకు ఎవరు శత్రువులు లేరని,అలాంటిది దుండగులు ఈ విధంగా తనపై టార్గెట్ చేయడానికి కారణం ఏమిటో తనకు తెలియడం లేదని తెలియజేశారు. కానీ కైలాష్ మీనా అప్పుడప్పుడు మార్కెట్లో తోటి వ్యాపారుల పట్ల ఎంతో దురుసుగా ప్రవర్తించే వారిని వారిలో ఎవరైనా అతనిపై ఈ విధంగా దాడి చేయడానికి ఈ యువకులను ప్రోత్సహించి ఉంటారా అన్న నేపథ్యంలో విచారణ చేపట్టారు.

ఈ విధంగా కైలాష్ మీనా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తామని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా ఉన్నఫలంగా మార్కెట్లో ఈ విధమైనటువంటి కాల్పులు జరగడంతో తోటి మార్కెట్ లోని వారందరూ తీవ్ర భయాందోళనలో ఉన్నారు.