ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గలేదు. రోజురోజుకు కేసులు తగ్గుతున్న క్రమంలో ఇప్పటికే పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తి వేశారు. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ సరైన జాగ్రత్తలను పాటించడం ఎంతో ముఖ్యమని ఇప్పటికే అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా సమయంలో జరిగిన కొన్ని వివాహాలు కరోనా నిబంధనలని అతిక్రమించి వివాదాస్పదంగా మారిన సంగతి మనకు తెలిసిందే.
తాజాగా రాజస్థాన్ సవాయు మాధోపూర్ జిల్లాలోని బదిలా గ్రామంలో ఒక పెళ్లి జరిగింది. ఈ కార్యక్రమానికి
రాజస్థాన్ ఎంపీ కిరోడీలాల్ మీనా, స్థానిక ఎమ్మెల్యే ఇందిరా మీనా హజరయ్యారు. ఈ పెళ్లి వేడుకలలో భాగంగా జరిగి నబరాత్లో ఎం,పీ ఎమ్మెల్యే బంధువులతో కలిసి డ్యాన్సులు చేశారు. ఈ విధంగా ఎంపీ ఎమ్మెల్యే డాన్స్ లు చేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రజలకు జాగ్రత్తలను చెప్పే ప్రజా ప్రతినిధులు ఈ విధంగా బాధ్యతారహితంగా మాస్కులు లేకుండా సామాజిక దూరం లేకుండా డాన్సులు చేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో తప్పు పడుతున్నాయి.ప్రజలకు సూచనలు చేయవలసిన నాయకులే ఈ విధంగా జాగ్రత్తలు పాటించకుండా బాధ్యతారహితంగా పాటిస్తే సామాన్య ప్రజల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పెళ్లి ఘటనకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…